Asia Cup 2023: పాకిస్తాన్తో మ్యాచ్.. భారత్ తుది జట్టులో తిలక్ వర్మ ఉండాల్సిందే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sanjay Manjrekar Picks His Playing 11 for IND vs PAK Match in Asia Cup 2023: ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 17 వరకు ఆసియా కప్ 2023 జరగనుంది. ప్రపంచకప్ 2023 ఉన్న నేపథ్యంలో ఈసారి 50 ఓవర్ల ఫార్మాట్లో ఈ టోర్నీ జరగనుంది. శ్రీలంక వేదికగా సెప్టెంబరు 2న పాకిస్తాన్తో భారత్ తమ తొలి మ్యాచ్ ఆడనుంది. ప్రపంచకప్ సన్నాహకంగా ఆసియా కప్ని అన్ని జట్లు ఉపయోగించుకోనున్నాయి. భారత్ ప్రయోగాలకు పోకుండా.. ప్రధాన జట్టుతోనే బరిలోకి దిగనుంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్తో మ్యాచ్లో హైదరాబాద్ ఆటగాడు తిలక్ వర్మను ఆడించాలని భారత మాజీ ఆటగాడు, కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ సూచించాడు.
స్టార్ స్పోర్ట్స్లో సంజయ్ మంజ్రేకర్ మాట్లాడుతూ భారత తుది జట్టుపై స్పందించాడు. ‘ఓపెనర్లుగా శుబ్మన్ గిల్, రోహిత్ శర్మ ఆడతారు. మూడో స్థానంలో విరాట్ కోహ్లీ, వికెట్ కీపర్గా కేఎల్ రాహుల్ ఉంటారు. మిడిలార్డర్లో శ్రేయస్ అయ్యర్ లేదా తిలక్ వర్మలో ఒకరు ఆడుతారు. వీరిద్దరిలో భారత్ మొదటి ప్రాధాన్యం తిలక్కే ఉండాలి. ఎందుకంటే టాప్ 7 బ్యాటర్లలో హార్దిక్ పాండ్యాను కలుపుకొని అందరూ రైట్ హ్యాండ్ బ్యాటర్లే. అందుకే లెఫ్టాండర్ అయిన తిలక్ను మిడిలార్డర్లో ఆడించాలి. ఏ స్థానంలో ఆడించాలనేది కెప్టెన్ ఇష్టం’ అని మంజ్రేకర్ అన్నాడు.
Also Read
- Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
- Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్కు సూపర్ టిప్స్
- Ind Vs Ban: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
- First T20 Captain: ధోని కాదు.. భారత్కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
‘తుది జట్టులో ముగ్గురు సీమర్లు జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీకి నేను ఓటేస్తా. నాలుగో సీమర్గా హార్దిక్ పాండ్యా ఎలాగూ ఉంటాడు. స్పిన్నర్లుగా రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్ ఉండనే ఉన్నారు. జడేజా, హార్దిక్ ఆల్రౌండ్ సేవలు టీమిండియాకు ఉంటాయి’ అని సంజయ్ మంజ్రేకర్ పేర్కొన్నాడు. సంజయ్ చెప్పిన విషయాన్నే ఇప్పటికే చాలా మంది మాజీలు కూడా చెప్పారు. జట్టులో లెఫ్టాండర్ ఉంటే బాగుంటుందని అందరూ అభిప్రాయపడుతున్నారు. ఈ లెక్కన తిలక్ తుది జట్టులో ఉండే అవకాశాలు లేకపోలేదు.
Also Read: Virat Kohli Yo Yo Test: యో-యో టెస్టు పాసైన విరాట్ కోహ్లీ.. సంతోషం పట్టలేక..!
హైదారాబాదీ స్టార్ తిలక్ వర్మ ఇటీవలే టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. వెస్టిండీస్ టీ20 సిరీస్లో అతడు అరంగేట్రం చేశాడు. ఐదు మ్యాచ్లలో 173 పరుగులతో భారత్ టాప్ స్కోరర్గా నిలిచాడు. సీనియర్లు విఫలమయిన చోట తన అద్భుత బ్యాటింగ్ తో ఆకట్టుకున్నాడు. ఒక్క సిరీస్తో ప్రపంచ క్రికెట్ దృష్టిని ఆకర్షించిన తిలక్.. ఒక్క వన్డే కూడా ఆడకుండానే ఏకంగా ఆసియా కప్ వంటి మెగా టోర్నీలో స్థానం సంపాదించాడు.
తాజావార్తలు
-
Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
-
HYDRAA : హైదరాబాద్ చెరువులకు హైడ్రా టచ్.. రూ.107 కోట్ల భారీ ప్రాజెక్ట్.!
-
Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్కు సూపర్ టిప్స్
-
Ind Vs Ban: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
-
First T20 Captain: ధోని కాదు.. భారత్కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
ట్రెండింగ్
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!