Sandra Venkata Veeraiah : సీతారామ ప్రాజెక్టు రూప కల్పన చేసిన ఏకైక వ్యక్తి కేసీఆరే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఖమ్మం సత్తుపల్లి మండలం బుగ్గపాడు గ్రామంలో సీతారామ ప్రాజెక్టు కెనాల్ భూనిర్వాసితుల సన్మాన సభలో ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఒక్క బుగ్గపాడు గ్రామానికే అభివృద్ధి కోసం 6 కోట్ల 30 లక్షలు ఇచ్చామని, సత్తుపల్లి నియోజకవర్గం లో అత్యంత ప్రజాదరణ కలిగిన గ్రామం బుగ్గపాడు అని ఆయన అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సీతారామ ప్రాజెక్టు కెనాల్ కు భూ నిర్వసితులకు 8 లక్షలు మాత్రమే వచ్చాయి అదే ఖమ్మం జిల్లా లో బుగ్గపాడు లో 10.50 లక్షలు ఇప్పించిన ఘనత మాదే అని ఆయన అన్నారు. భూ నిర్వాసితుల ఎకౌంటులో డబ్బులు వేసి వెలుగు నింపిన ఘనత కేసిఆర్ దే అని ఆయన అన్నారు.
అంతేకాకుండా.. ‘సీతారామ ప్రాజెక్టు రూప కల్పన చేసిన ఏకైక వ్యక్తి కేసిఆరే కానీ మారేవ్వరు లేరు ఇది మీరందరూ గుర్తుంచుకోవాలి. యే నాయకుడికి రాని ఆలోచన మన కేసిఆర్ కి వచ్చింది. అధికారంలో కాంగ్రెస్ పార్టీ లేదు కాబట్టి ఇప్పుడు ఐదు పధకాలతో మీ ముందుకు వస్తున్నారు వారితో అప్రమత్తంగా ఉండాలి. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్ర లల్లో ఎందుకు అమలు చెయ్యడం లేదు…? 55 పాలించిన కాంగ్రెస్ వాళ్ళు 1000 రూపాయలు పెంక్షన్ ఇచ్చినోళ్ళు ఇప్పుడు నాలుగు వేలు ఇస్తాం అంటున్నారు నమ్మదగనాదేనా….గతంలో ఇవ్వనోళ్ళు ఇప్పుడు ఎలా ఇస్తారు….? కృష్ణా గోదావరి జలాలు అనుసంధానం చేస్తేన్న గొప్ప వ్యక్తి కేసీఆర్. కాళేశ్వరం ప్రాజెక్టు వలనే ఎండుతున్న పంటలకు ఇప్పుడు నీళ్ళు అందుతున్నాయి. అధికారంలో లేని వాళ్ళు అధికారంలోకి వస్తారో రారు తెలియదు కానీ సీతారామ ప్రాజెక్టు నా స్వప్నం అంటున్నారు….అని తుమ్మలపై విమర్శ. సీతరామ ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలు అందించే ఏకైక వ్యక్తి కేసిఆర్ నే. ప్రజల కోసమే పని చెయ్యాటానికే మేమున్నాం.. ఎన్నికలు వస్తున్నాయి అంటే రకరకాల వేషాలతో కొంతమంది మీ ముందుకు వస్తున్నారు వారితో జాగ్రత్త.
Also Read
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
- Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
- Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
ఎప్పుడూ అహంకారంతో దొరతనంతో పని చెయ్యాలేదు మీలో ఒక్కడిగా పనిచేశా. పాలేరు నియోజకవర్గం రాజకీయ జన్మ ఇస్తే సత్తుపల్లి నియోజకవర్గం పునః జన్మ ఇచ్చింది. రుణామఫీ కానీ రైతులు రైతు వేదికల వద్దకు వెళ్ళి నేరుగా వేళ్ళి వ్యవసాయ అధికారికి ఫిర్యాదు చేయ్యండి.ఉన్న లోపాలను సరి చేసుకొని రుణామఫీ పొందండి. కేసీఆర్ అభ్యర్థి గా సత్తుపల్లి లో నేనే..
ఖమ్మం లో కాంగ్రెస్ మీటింగ్ పెట్టుకొని కొట్టుకొవటం తలలు పగలగొట్టుకోవటం మన కల్చర్ కాదు వాళ్ళ కల్చరే. ఎవ్వడు దయ దక్షిణాలతో నేను మూడు సార్లు ఎమ్మెల్యే కాలేదు..మీ ఆశ్శీసులతోనే గెలిచా.. ఇప్పుడు నాలుగోసారి బరిలో ఉన్న మీ ఆశ్శీసులు ఉండాలి… అందరు నాయకులు ఒకవైపు ఉన్నారు…కానీ ప్రజలందరూ నాకు ఆశ్శీసులతో నాలుగోసారి గెలిపిస్తారు. ప్రత్యర్ధులను ఇబ్బంది పెట్టాలని ఎప్పుడూ రాజకీయాలు చేయ్యలేదు కేసిఆర్ ….కేసిఆర్ గొప్ప విజన్ ఉన్న నాయకుడు…కుట్రలు కుతంత్రాలు తెలియదు…కేసిఆర్ కు అండంగా ఉండి గెలిపించాలి.’ అని సండ్ర వెంకట వీరయ్య అన్నారు.
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!