Sabitha Indra Reddy : మాదక ద్రవ్యాలు క్రమంగా విద్యాసంస్థల్లోకి చాప కింద నీరులా విస్తరిస్తున్నాయి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ మీర్ పెట్ పోలీస్ స్టేషన్ పరిధి ఎస్వైఆర్ గార్డెన్లో యాంటీ డ్రగ్ అవేర్ నెస్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. ప్రజలు రాత్రి వేళ ఇళ్ళల్లో హాయిగా నిద్ర పోతున్నారంటే దానికి పోలిసులే కారణమని, పోలీసులు శాంతి భద్రతలు కాపాడంతో పాటు, సామాజిక కార్యక్రమాల్లోనూ తమ వంతు పాత్ర పోషించడం అభినందనీయమన్నారు. మాదక ద్రవ్యాలు క్రమంగా విద్యా సంస్థల్లోకి చాప కింద నీరులా విస్తరిస్తున్నాయని, దీనిపై ప్రభుత్వం చాలా సీరియస్గా ఉందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మాదక ద్రవ్యాల నిరోధక అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని, అమ్మాయిలను వేధించేందుకు ఆకతాయిలు ఎన్నో రకాలుగా వ్యవహరిస్తుంటారని, బాధిత అమ్మాయిలు షీ టీమ్ లకు ఫిర్యాదు చేస్తే వెంటనే చర్యలుంటాయని ఆమె వెల్లడించారు. ఇదివరకు కళాశాలల్లో రాగింగ్ కు ఉండేవని, కమిటీలు వేసి రాగింగ్పై కఠిన చర్యలు తీసుకున్నామన్నారు.
Also Read : YS Jagan Mohan Reddy: కోలుకుంటున్న ఆ చిన్నారి.. ఆశీర్వదించిన సీఎం జగన్
Also Read
- Rohit Sharma and Virat Kohli: రోహిత్-కోహ్లీ ఫ్లాప్ షో.. తొలి వన్డేలో వరుస ఓవర్లలో పెవిలియన్ బాట
- Off The Record: నోరు అదుపులో లేక.. మాట పొదుపు లేక ఆ తండ్రి కొడుకులు ఇరుకున పడ్డారా?
- Trump-Iran: ట్రంప్ సంచలన ప్రకటన.. హార్ముజ్ కార్గో ఫీజు రద్దు.. ఇరాన్ నౌకలపై దిగ్బంధం అమలు
- StepX Neo: ప్రపంచంలోనే తొలి ఐఏ స్టార్మ్ఫోన్ వచ్చేసింది.. చిటికెలో అన్ని పనులు ఫినిష్!
ప్రస్తుతం మాదక ద్రవ్యాల నిరోధానికి పకడ్బందీగా వ్యవహరిస్తున్నామని ఆమె వివరించారు. అనంతరం.. రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్ మాట్లాడుతూ.. మాదక ద్రవ్యాల వినియోగం అత్యంత ప్రమాదకరమన్నారు. మొదట్లో ఆనందం ఇచ్చినా క్రమంగా ఆరోగ్యం పూర్తిగా దెబ్బ తింటుందని, ఆర్థికంగా, ఆరోగ్య పరంగా పూర్తిగా దెబ్బతింటాయన్నారు. చరవాణినీ సైతం పరిధుల మేరకు వినియోగించాలని, యువత హద్దులు దాటి సెల్ ఫోన్ వినియోగిస్తే సమస్యల పాలవుతారన్నారు. ఇటీవల ఓ ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థినిలు గుర్తు తెలియని వ్యక్తులతో స్నేహం చేసి, సైబర్ మోసానికి గురయ్యారని ఆయన వెల్లడించారు. అమ్మాయిలు, అబ్బాయిలు ఎవరూ కూడా సామాజిక మాధ్యమాల్లో గుర్తు తెలియని వ్యక్తులు స్నేహం చేయొద్దని, మాదక ద్రవ్యాలు, సైబర్ మోసాలపైన రాచకొండ కమిషనరేట్ పరిధిలో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.
తాజావార్తలు
-
Rohit Sharma and Virat Kohli: రోహిత్-కోహ్లీ ఫ్లాప్ షో.. తొలి వన్డేలో వరుస ఓవర్లలో పెవిలియన్ బాట
-
Off The Record: నోరు అదుపులో లేక.. మాట పొదుపు లేక ఆ తండ్రి కొడుకులు ఇరుకున పడ్డారా?
-
OTR: సింగనమల వైసీపీలో సెగలు..
-
OTR: తాడేపల్లిగూడెం వైసీపీలో ముదిరిన వర్గపోరు..
-
Trump-Iran: ట్రంప్ సంచలన ప్రకటన.. హార్ముజ్ కార్గో ఫీజు రద్దు.. ఇరాన్ నౌకలపై దిగ్బంధం అమలు
ట్రెండింగ్
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్రూఫ్తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
-
CSK Head Coach: సీఎస్కే కొత్త కోచ్ రేసులో ముగ్గురు.. భారత్ నుంచి ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు!
-
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!
-
Ashleigh Gardner Controversy: ఆసీస్ మహిళా క్రికెటర్ల మధ్య అక్రమ సంబంధం.. భార్య ఉండగానే సహచర ప్లేయర్తో ఎఫైర్!