BRICS: వచ్చే నెలలో దక్షిణాఫ్రికాలో బ్రిక్స్ సదస్సు.. రష్యా విదేశాంగ శాఖ కీలక ప్రకటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BRICS: వచ్చే నెలలో దక్షిణాఫ్రికాలో బ్రిక్స్ సదస్సు జరగనుంది. కాగా బ్రిక్స్ సదస్సుకు సంబంధించి రష్యా విదేశాంగ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. బ్రిక్స్ దేశాలు వచ్చే నెలలో జరిగే తమ శిఖరాగ్ర సమావేశంలో సీమాంతర వాణిజ్యం కోసం దీర్ఘకాలిక చెల్లింపు వ్యవస్థను ఏర్పాటు చేయడంతో పాటు పలు ముఖ్యమైన అంశాలపై చర్చిస్తాయని రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆగస్టు 22 నుంచి 24 వరకు దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్బర్గ్లో జరగనున్న శిఖరాగ్ర సమావేశాన్ని ప్రస్తావిస్తూ.. ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితుల దృష్ట్యా రాబోయే సమావేశంలో ఈ సమస్యను పరిష్కరిస్తారని మంత్రిత్వ శాఖ తెలిపింది.
రష్యన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకారం.. సరిహద్దు వాణిజ్యంలో జాతీయ కరెన్సీల ఉపయోగం యూఎస్ డాలర్తో పోలిస్తే కాస్త పరిమితం చేయబడింది. ఈ నేపథ్యంలో కొత్త బ్రిక్స్ ఉమ్మడి కరెన్సీని ప్రారంభించడం చాలా సున్నితమైన ప్రక్రియ అని రష్యా విదేశాంగ శాఖ పేర్కొంది. ప్రత్యామ్నాయ కరెన్సీలపై దృష్టి సారించాలని బ్రిక్స్ దేశాలకు సూచించింది.వాస్తవానికి, బ్రిక్స్ దేశాలు పరస్పర వాణిజ్యంలో యూఎస్ డాలర్ కంటే ముందడుగు వేయడానికి ప్రయత్నిస్తున్నాయి. నివేదికల ప్రకారం, రష్యా, చైనా, భారతదేశం, బ్రెజిల్, దక్షిణాఫ్రికా వంటి అనేక అభివృద్ధి చెందుతున్న దేశాలు వాణిజ్యంలో ప్రత్యామ్నాయ కరెన్సీల వైపు వెళ్లడం ప్రారంభించాయి.
Also Read
- Disha Salian Case: ‘మోదీ, ట్రంప్ పేర్లు కూడా చేర్చండి’.. ఉద్ధవ్ ఠాక్రే సంచలన వ్యాఖ్యలు
- Tata Sons: టాటా గ్రూప్లో కీలక పరిణామం.. పగ్గాలు మళ్లీ చంద్రశేఖరన్కే.. లొల్లి తప్పదా?
- CM Chandrababu: శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. సెప్టెంబర్ 19న ఇళ్ల పట్టాలు పంపిణీ..
- Modi-Jinping: ‘ఇట్స్ ఓకే?’ జిన్పింగ్ను మోడీ ఎందుకు అడిగారు? వెలుగులోకి కొత్త వీడియో
Also Read: Supreme Court: ప్రత్యక్షి సాక్షి లేనప్పుడు నేరానికి గల కారణమే కీలకం.. సుప్రీం కీలక వ్యాఖ్యలు
15వ బ్రిక్స్ సదస్సు దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్బర్గ్లోని శాండ్టన్ కన్వెన్షన్ సెంటర్లో ఆగస్టు 22 నుంచి 24 వరకు జరగనుంది. దీనికి బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికా దేశాల ప్రతినిధులు హాజరుకానున్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ వర్చువల్గా సదస్సులో పాల్గొంటారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ శిఖరాగ్ర సమావేశానికి తమ దేశానికి రావడం లేదని దక్షిణాఫ్రికా గతంలోనే తెలియజేసింది. అయితే, రష్యా అధ్యక్షుడు పుతిన్ వర్చువల్గా సమ్మిట్లో పాల్గొంటారని తర్వాత క్రెమ్లిన్ స్పష్టం చేసింది. మొదటి బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం 2009లో రష్యాలో జరిగింది. బ్రిక్స్ ఏర్పడిన తర్వాత, దక్షిణాఫ్రికా 2010లో సమూహంలో చేరడానికి ఆహ్వానించబడింది.
తాజావార్తలు
-
Disha Salian Case: ‘మోదీ, ట్రంప్ పేర్లు కూడా చేర్చండి’.. ఉద్ధవ్ ఠాక్రే సంచలన వ్యాఖ్యలు
-
Peddapur School Food Poisoning: స్కూల్లో ఫుడ్ పాయిజనింగ్.. 20 మంది విద్యార్థులకు అస్వస్థత
-
Tata Sons: టాటా గ్రూప్లో కీలక పరిణామం.. పగ్గాలు మళ్లీ చంద్రశేఖరన్కే.. లొల్లి తప్పదా?
-
CM Chandrababu: శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. సెప్టెంబర్ 19న ఇళ్ల పట్టాలు పంపిణీ..
-
Erravalli Lands: ఎర్రవల్లి ఫామ్ హౌస్ భూములపై విచారణ షురూ.!
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!