BRICS: వచ్చే నెలలో దక్షిణాఫ్రికాలో బ్రిక్స్ సదస్సు.. రష్యా విదేశాంగ శాఖ కీలక ప్రకటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BRICS: వచ్చే నెలలో దక్షిణాఫ్రికాలో బ్రిక్స్ సదస్సు జరగనుంది. కాగా బ్రిక్స్ సదస్సుకు సంబంధించి రష్యా విదేశాంగ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. బ్రిక్స్ దేశాలు వచ్చే నెలలో జరిగే తమ శిఖరాగ్ర సమావేశంలో సీమాంతర వాణిజ్యం కోసం దీర్ఘకాలిక చెల్లింపు వ్యవస్థను ఏర్పాటు చేయడంతో పాటు పలు ముఖ్యమైన అంశాలపై చర్చిస్తాయని రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆగస్టు 22 నుంచి 24 వరకు దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్బర్గ్లో జరగనున్న శిఖరాగ్ర సమావేశాన్ని ప్రస్తావిస్తూ.. ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితుల దృష్ట్యా రాబోయే సమావేశంలో ఈ సమస్యను పరిష్కరిస్తారని మంత్రిత్వ శాఖ తెలిపింది.
రష్యన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకారం.. సరిహద్దు వాణిజ్యంలో జాతీయ కరెన్సీల ఉపయోగం యూఎస్ డాలర్తో పోలిస్తే కాస్త పరిమితం చేయబడింది. ఈ నేపథ్యంలో కొత్త బ్రిక్స్ ఉమ్మడి కరెన్సీని ప్రారంభించడం చాలా సున్నితమైన ప్రక్రియ అని రష్యా విదేశాంగ శాఖ పేర్కొంది. ప్రత్యామ్నాయ కరెన్సీలపై దృష్టి సారించాలని బ్రిక్స్ దేశాలకు సూచించింది.వాస్తవానికి, బ్రిక్స్ దేశాలు పరస్పర వాణిజ్యంలో యూఎస్ డాలర్ కంటే ముందడుగు వేయడానికి ప్రయత్నిస్తున్నాయి. నివేదికల ప్రకారం, రష్యా, చైనా, భారతదేశం, బ్రెజిల్, దక్షిణాఫ్రికా వంటి అనేక అభివృద్ధి చెందుతున్న దేశాలు వాణిజ్యంలో ప్రత్యామ్నాయ కరెన్సీల వైపు వెళ్లడం ప్రారంభించాయి.
Also Read
- RCB Player: ‘ఆర్సీబీకి ఆడాలని నాకు లేదు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన కెప్టెన్ రజత్ పాటిదార్..
- Iran-Israel War: శాంతించండి.. దాడులు ఆపాలంటూ ఇరాన్, ఇజ్రాయెల్కు భారత్ విజ్ఞప్తి
- Minister Sridhar Babu : ‘హిట్లర్’ వ్యాఖ్యలపై రగడ.. కేసీఆర్ వీడియోతో శ్రీధర్ బాబు కౌంటర్.!
- India Test Win: టెస్టు మ్యాచ్ గెలిచిన తర్వాత.. గ్రౌండ్లో బిత్తర చూపులు చూసిన టీమిండియా ఆటగాళ్లు.. ఎందుకంటే..
Also Read: Supreme Court: ప్రత్యక్షి సాక్షి లేనప్పుడు నేరానికి గల కారణమే కీలకం.. సుప్రీం కీలక వ్యాఖ్యలు
15వ బ్రిక్స్ సదస్సు దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్బర్గ్లోని శాండ్టన్ కన్వెన్షన్ సెంటర్లో ఆగస్టు 22 నుంచి 24 వరకు జరగనుంది. దీనికి బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికా దేశాల ప్రతినిధులు హాజరుకానున్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ వర్చువల్గా సదస్సులో పాల్గొంటారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ శిఖరాగ్ర సమావేశానికి తమ దేశానికి రావడం లేదని దక్షిణాఫ్రికా గతంలోనే తెలియజేసింది. అయితే, రష్యా అధ్యక్షుడు పుతిన్ వర్చువల్గా సమ్మిట్లో పాల్గొంటారని తర్వాత క్రెమ్లిన్ స్పష్టం చేసింది. మొదటి బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం 2009లో రష్యాలో జరిగింది. బ్రిక్స్ ఏర్పడిన తర్వాత, దక్షిణాఫ్రికా 2010లో సమూహంలో చేరడానికి ఆహ్వానించబడింది.
తాజావార్తలు
-
RCB Player: ‘ఆర్సీబీకి ఆడాలని నాకు లేదు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన కెప్టెన్ రజత్ పాటిదార్..
-
Iran-Israel War: శాంతించండి.. దాడులు ఆపాలంటూ ఇరాన్, ఇజ్రాయెల్కు భారత్ విజ్ఞప్తి
-
Minister Sridhar Babu : ‘హిట్లర్’ వ్యాఖ్యలపై రగడ.. కేసీఆర్ వీడియోతో శ్రీధర్ బాబు కౌంటర్.!
-
India Test Win: టెస్టు మ్యాచ్ గెలిచిన తర్వాత.. గ్రౌండ్లో బిత్తర చూపులు చూసిన టీమిండియా ఆటగాళ్లు.. ఎందుకంటే..
-
Thaman: దాని గురించి నేను కూడా ఆలోచించాలి: తమన్
ట్రెండింగ్
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!