Rohit Reaction: నాటౌట్ అయినా పెవిలియన్కు కోహ్లీ.. రోహిత్ ఎక్స్ప్రెషన్స్ చూశారా..!
- డీఆర్ఎస్ తీసుకోకుండా తప్పు చేసిన విరాట్ కోహ్లీ
- 36 బంతుల్లో 17 పరుగులు చేసిన కోహ్లీ
- నాటౌట్ అయిన ఎంఫైర్ ఔట్ ఇవ్వడంతో పెవిలియన్ కు కోహ్లీ
- ఆశ్యర్యం వ్యక్తం చేసిన కెప్టెన్ రోహిత్ శర్మ.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శుక్రవారం బంగ్లాదేశ్తో జరిగిన రెండో ఇన్నింగ్స్లో డీఆర్ఎస్ తీసుకోకుండా విరాట్ కోహ్లీ పెద్ద తప్పు చేశాడు. చెన్నై వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్లో విరాట్ కోహ్లీ 36 బంతుల్లో 17 పరుగులు చేసి మంచి ఫామ్లో ఉన్నాడు. ఈ క్రమంలో.. మెహదీ హసన్ మిరాజ్ వేసిన ఫుల్ డెలివరీ తప్పి బంతి ప్యాడ్కు తగిలింది. ఆలస్యం చేయకుండా అంపైర్ అప్పీల్ను అంగీకరించి ఔట్ ఇచ్చాడు. ఆ సమయంలో.. తోటి బ్యాటర్ శుభ్మన్ గిల్తో మాట్లాడి రివ్యూ తీసుకోకూడదని కోహ్లీ నిర్ణయించుకున్నాడు. దీంతో.. పెవిలియన్ బాట పట్టాడు. తర్వాత రీప్లేలలో చూపిస్తూ, బంతి బ్యాట్ అంచున పడినట్లు స్పష్టంగా కనపడింది. ఇది చూసి కెప్టెన్ రోహిత్ శర్మ కూడా ఆశ్చర్యపోయాడు.
Hezbollah: ఇజ్రాయిల్ వైమానిక దాడుల్లో హిజ్బుల్లా కీలక కమాండర్ ఇబ్రహీం అకిల్ హతం..
Also Read
- Mohammad Amir: బ్రిటిష్ పౌరుడిగా మహ్మద్ ఆమీర్.. ఇక IPLలో ఆడే ఛాన్స్.!
- Mamata Banerjee: మమత పార్టీలో విభేదాలు.. నిరసనకు 35 మంది ఎమ్మెల్యేలే హాజరు..
- Modi-Meloni: గంటల్లోనే కోట్లలో వ్యూస్.. ఇంటర్నెట్లో ప్రకంపనలు రేపుతున్న మెలోడీ వీడియో
- US-Iran War: ఇరాన్ యుద్ధంలో అమెరికాకు భారీ దెబ్బ.. 42 విమానాలు ధ్వంసం..
అనంతరం.. రిషబ్ పంత్ క్రీజులోకి వచ్చాడు. ఆ సమయంలో స్టేడియంలోని బిగ్ స్క్రీన్ పై విరాట్ కోహ్లి ఔట్ అయిన రీప్లే వేశారు. అందులో బంతి అతని బ్యాట్కు కొద్దిగా అంచుతో ప్యాడ్కు తగిలింది. ఇది చూసిన అభిమానులతో పాటు కామెంటేటర్లు, డగౌట్లో కూర్చున్న రోహిత్ శర్మ వరకు అందరూ ఆశ్చర్యపోయారు. బ్యాట్కు తగిలిందని కెప్టెన్ రోహిత్ శర్మ కోహ్లీకి.. అక్కడ ఉన్న జట్టు సభ్యులకు చెప్పాడు. కోహ్లీ ఎందుకు డీఆర్ఎస్ తీసుకోలేదంటూ డ్రెస్సింగ్ రూములో రోహిత్ శర్మ కోప్పడుతూ కనిపించాడు.
Telangana Cabinet: హైడ్రాకు విస్తృత అధికారాలు.. కేబినెట్ కీలక నిర్ణయాలివే..
రెండు మ్యాచ్ల సిరీస్లో భాగంగా తొలి టెస్టు రెండో రోజు ఆట ముగిసే సమయానికి.. బంగ్లాదేశ్తో భారత్ తన రెండో ఇన్నింగ్స్లో మూడు వికెట్ల నష్టానికి 81 పరుగుల వద్ద 308 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది. రోజు ఆట ముగిసే సమయానికి శుభ్మన్ గిల్ 33 పరుగులతో క్రీజులో ఉండగా, వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ రిషబ్ పంత్ 12 పరుగులతో క్రీజులో ఉన్నారు. అంతకుముందు, మూడో సెషన్ ప్రారంభంలో బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్ను 149 పరుగులకు భారత బౌలర్లు కట్టడి చేశారు. దీంతో భారత్ తొలి ఇన్నింగ్స్లో 227 పరుగుల భారీ ఆధిక్యం సాధించింది. భారత్ తొలి ఇన్నింగ్స్ 376 పరుగుల వద్ద ముగిసింది.
Rohit Sharma and Kettleborough's reaction to Virat Kohli not reviewing even after the edge. 🥲💔 pic.twitter.com/O9tK060MyD
— Mufaddal Vohra (@mufaddal_vohra) September 20, 2024
తాజావార్తలు
-
Mohammad Amir: బ్రిటిష్ పౌరుడిగా మహ్మద్ ఆమీర్.. ఇక IPLలో ఆడే ఛాన్స్.!
-
Prashanth Neel : ఎన్టీఆర్ బక్క చిక్కడం చూసి భయపడిపోయా.. ఎన్టీఆర్ భార్య కూడా నాపై సీరియస్ అయింది
-
Mamata Banerjee: మమత పార్టీలో విభేదాలు.. నిరసనకు 35 మంది ఎమ్మెల్యేలే హాజరు..
-
Modi-Meloni: గంటల్లోనే కోట్లలో వ్యూస్.. ఇంటర్నెట్లో ప్రకంపనలు రేపుతున్న మెలోడీ వీడియో
-
Lenovo Legion Y900: కొత్త టాబ్లెట్ లెనోవో లెజియన్ Y900 విడుదల..144Hz డిస్ప్లే, 12,700mAh బ్యాటరీ
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!