Hezbollah: ఇజ్రాయిల్ వైమానిక దాడుల్లో హిజ్బుల్లా కీలక కమాండర్ ఇబ్రహీం అకిల్ హతం..
- హిజ్బుల్లా టార్గెట్గా విరుచుకుపడుతున్న ఇజ్రాయిల్..
- బీరూట్పై వైమానిక దాడులు..
- హిజ్బుల్లా కమాండర్ అకిల్ హతం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hezbollah: హిజ్బుల్లా మిలిటెంట్లు లక్ష్యంగా ఇజ్రాయిల్ లెబనాన్పై విరుచుకుపడుతోంది. ఇప్పటికే పేజర్లు, వాకీ-టాకీల పేలుళ్లతో షాక్లో ఉన్న హిజ్బుల్లాని చావుదెబ్బ తీస్తోంది. ఇప్పటికే పేజర్ల పేలుళ్లలో 37 మంది ఆ సంస్థ మద్దతుదారులతో పాటు కీలక వ్యక్తులు మరణించినట్లు తెలుస్తోంది. 3000 మంది ఈ పేలుళ్ల కారణంగా గాయపడ్డారు. ఇదిలా ఉంటే శుక్రవారం హిజ్బుల్లా స్థావరాలపై ఇజ్రాయిల్ వైమానిక దాడులు నిర్వహించింది. ఈ దాడిలో 8 మంది మరణించారని, డజన్ల సంఖ్యలో గాయపడ్డారని తెలుస్తోంది.
Read Also: Rishikesh station: రైల్వేస్టేషన్ ఫ్లాట్ఫామ్పై పాము హల్చల్.. ప్రయాణికులు పరుగులు
Also Read
- Turkey-SCO: ‘ఎస్సీవో’లో మేము చేరతాం.. టర్కీ ప్రతిపాదన.. భారత్ అభ్యంతరం!
- US: పౌరసత్వంపై ట్రంప్ కఠిన వైఖరి.. పిల్లల పాస్పోర్ట్కు తల్లిదండ్రుల ఆధారాలు మెలిక?
- Nepal Floods: వరదలకు మీరే కారణం.. భారత్, చైనా, అమెరికాలను టార్గెట్ చేస్తున్న నేపాల్..
- Hamas Crypto Funding: హమాస్కు చావుదెబ్బ.. క్రిప్టో నెట్వర్క్పై FBI మెరుపుదాడి.. రూ. కోట్లలో నిధులు సీజ్!
ఇదిలా ఉంటే, ఈ వైమానిక దాడుల్లో హిజ్బుల్లా కీలక కమాండర్ మరణించినట్లు సమాచారం. దక్షిణ బీరూట్లోని మిలిటెంట్ గ్రూప్ ప్రధాన స్థావరంపై దాడి జరిగింది. ఈ దాడిలో దాని ఎలైట్ ఫోర్స్ రద్వాన్ యూనిట్ అధిపతి ఇబ్రహీం అకిల్ చనిపోయినట్లు తెలుస్తోంది. అక్టోబర్ 07న ఇజ్రాయిల్పై హమాస్ దాడి తర్వాత ఇరు వర్గాల మధ్య యుద్ధం ప్రారంభమైంది. అప్పటి నుంచి హమాస్కి హిజ్బుల్లా మద్దతు ఇస్తోంది. తరుచుగా ఉత్తర ఇజ్రాయిల్పై దాడులకు తెగబడుతోంది. తాజా వైమానిక దాడితో ఏడాదిలో లెబనాన్ రాజధాని బీరూట్పై ఇది మూడో దాడి.
ఈ ఏడాది జూలైలో హిజ్బుల్లా టాప్ కమాండర్ ఫువాద్ షుక్ర్ని ఇలాగే వైమానిక దాడిలో ఇజ్రాయిల్ హతమార్చింది. బీరూట్లో అతను నివాసం ఉండే భవనంపై దాడి జరిగింది. అంతకుముందు హమాస్ నాయకుడు సలేహ్ అల్ అరూరి కూడా వైమానిక దాడిలో మరనించాడు. ఫువాద్ షుక్ర్ తర్వాత హిజ్బుల్లా సాయుధ దళానికి సెకండ్ ఇన్ కమాండ్ అయిన రద్వాన్ ఫోర్స్ కమాండర్ ఇబ్రహీం అకిల్ మరణించినట్లు ఆ మిలిటెంట్ సంస్థ వర్గాలు తెలిపాయి. అయితే, ఇప్పటి వరకు హిజ్బు్ల్లా ఎలాంటి అధికారిక ప్రకటనని విడుదల చేయలేదు. 1983లో బీరుట్లోని యుఎస్ రాయబార కార్యాలయంపై బాంబు దాడి చేసి 63 మంది మృతి ఘటనలో అకిల్ ప్రధాన సభ్యుడు. ఇతడి కోసం అమెరికా 7 మిలియన్ల బహుమతి ప్రకటించింది.
తాజావార్తలు
-
Razesh Danda : నిద్ర లేదు.. చాలా టెన్షన్ పడ్డాం!
-
Story Board: లక్షల ఓట్లు గల్లంతుకు కారణాలేంటి..? ఓటర్లకు ఓటింగ్ అంటేనే విరక్తి పుట్టిస్తారా..?
-
Irumudi : ‘ఇరుముడి’ అడవి సీక్రెట్ చెప్పేసిన శివ నిర్వాణ!
-
Shiva Nirvana : నెక్స్ట్ సినిమా ధనుష్తోనా? క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ శివ నిర్వాణ
-
ICC Cricket World Cup 2027: ప్రపంచకప్లో టీమ్ఇండియా ఎక్స్ఫ్యాక్టర్ ఎవరు..? జాంటీ రోడ్స్ సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!