Hezbollah: ఇజ్రాయిల్ వైమానిక దాడుల్లో హిజ్బుల్లా కీలక కమాండర్ ఇబ్రహీం అకిల్ హతం..
- హిజ్బుల్లా టార్గెట్గా విరుచుకుపడుతున్న ఇజ్రాయిల్..
- బీరూట్పై వైమానిక దాడులు..
- హిజ్బుల్లా కమాండర్ అకిల్ హతం..
Hezbollah: హిజ్బుల్లా మిలిటెంట్లు లక్ష్యంగా ఇజ్రాయిల్ లెబనాన్పై విరుచుకుపడుతోంది. ఇప్పటికే పేజర్లు, వాకీ-టాకీల పేలుళ్లతో షాక్లో ఉన్న హిజ్బుల్లాని చావుదెబ్బ తీస్తోంది. ఇప్పటికే పేజర్ల పేలుళ్లలో 37 మంది ఆ సంస్థ మద్దతుదారులతో పాటు కీలక వ్యక్తులు మరణించినట్లు తెలుస్తోంది. 3000 మంది ఈ పేలుళ్ల కారణంగా గాయపడ్డారు. ఇదిలా ఉంటే శుక్రవారం హిజ్బుల్లా స్థావరాలపై ఇజ్రాయిల్ వైమానిక దాడులు నిర్వహించింది. ఈ దాడిలో 8 మంది మరణించారని, డజన్ల సంఖ్యలో గాయపడ్డారని తెలుస్తోంది.
Read Also: Rishikesh station: రైల్వేస్టేషన్ ఫ్లాట్ఫామ్పై పాము హల్చల్.. ప్రయాణికులు పరుగులు
Also Read
- India Defense Budget: సాహో భారత్.. పాకిస్థాన్ను గజగజలాడిస్తున్న ఇండియా రక్షణ బడ్జెట్.. చైనా సాయం ఉన్నా దాయాదికి వణుకు పుట్టాల్సిందే!
- Bordeaux : ఈ ఒక్క ప్రాంతం వైన్ ప్రపంచాన్ని ఎలా మార్చింది..??
- Putin - Abbas Araghchi Meeting: అమెరికాకు పుతిన్ మాస్టర్ స్ట్రోక్.. ఇరాన్కు రష్యా 'ఫుల్' సపోర్ట్..!
- Iranian Attack Indian Crew: ఒమన్ తీరంలో టెన్షన్ టెన్షన్.. భారతీయ సిబ్బంది ఉన్న కెమికల్ ట్యాంకర్పై ఇరాన్ దాడులు!
ఇదిలా ఉంటే, ఈ వైమానిక దాడుల్లో హిజ్బుల్లా కీలక కమాండర్ మరణించినట్లు సమాచారం. దక్షిణ బీరూట్లోని మిలిటెంట్ గ్రూప్ ప్రధాన స్థావరంపై దాడి జరిగింది. ఈ దాడిలో దాని ఎలైట్ ఫోర్స్ రద్వాన్ యూనిట్ అధిపతి ఇబ్రహీం అకిల్ చనిపోయినట్లు తెలుస్తోంది. అక్టోబర్ 07న ఇజ్రాయిల్పై హమాస్ దాడి తర్వాత ఇరు వర్గాల మధ్య యుద్ధం ప్రారంభమైంది. అప్పటి నుంచి హమాస్కి హిజ్బుల్లా మద్దతు ఇస్తోంది. తరుచుగా ఉత్తర ఇజ్రాయిల్పై దాడులకు తెగబడుతోంది. తాజా వైమానిక దాడితో ఏడాదిలో లెబనాన్ రాజధాని బీరూట్పై ఇది మూడో దాడి.
ఈ ఏడాది జూలైలో హిజ్బుల్లా టాప్ కమాండర్ ఫువాద్ షుక్ర్ని ఇలాగే వైమానిక దాడిలో ఇజ్రాయిల్ హతమార్చింది. బీరూట్లో అతను నివాసం ఉండే భవనంపై దాడి జరిగింది. అంతకుముందు హమాస్ నాయకుడు సలేహ్ అల్ అరూరి కూడా వైమానిక దాడిలో మరనించాడు. ఫువాద్ షుక్ర్ తర్వాత హిజ్బుల్లా సాయుధ దళానికి సెకండ్ ఇన్ కమాండ్ అయిన రద్వాన్ ఫోర్స్ కమాండర్ ఇబ్రహీం అకిల్ మరణించినట్లు ఆ మిలిటెంట్ సంస్థ వర్గాలు తెలిపాయి. అయితే, ఇప్పటి వరకు హిజ్బు్ల్లా ఎలాంటి అధికారిక ప్రకటనని విడుదల చేయలేదు. 1983లో బీరుట్లోని యుఎస్ రాయబార కార్యాలయంపై బాంబు దాడి చేసి 63 మంది మృతి ఘటనలో అకిల్ ప్రధాన సభ్యుడు. ఇతడి కోసం అమెరికా 7 మిలియన్ల బహుమతి ప్రకటించింది.
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!