IND vs NZ: అంతా రేపే.. తుది జట్టుపై ఏ నిర్ణయం తీసుకోలేదు: రోహిత్
- న్యూజిలాండ్తో టెస్టు సిరీస్
- ప్రీమ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్లో రోహిత్
- రేపు ఉదయం నిర్ణయం తీసుకొంటాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బుధవారం నుంచి న్యూజిలాండ్తో ప్రారంభం కానున్న తొలి టెస్ట్ తుది జట్టుపై ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పాడు. బెంగళూరులో వర్షం పడుతోందని, పరిస్థితులను బట్టి తుది జట్టును ఎంపిక చేస్తామని చెప్పాడు. జట్టులో ఇద్దరు స్పిన్నర్లు కచ్చితంగా ఉంటారని, పరిస్థితులను బట్టి మూడో స్పిన్నర్ను తీసుకోవాలా? వద్దా? అనే విషయం ఆలోచిస్తామని రోహిత్ తెలిపాడు. మంగళవారం ప్రీమ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్లో పాల్గొన్న హిట్మ్యాన్ పలు విషయాలపై స్పందించాడు.
‘బెంగళూరులో వర్షం పడుతోంది. పిచ్ కవర్ల కిందే ఉంది. జట్టులో ముగ్గురు పేసర్లను తీసుకోవాలా లేదా అనే అంశంపై రేపు ఉదయం నిర్ణయం తీసుకొంటాం. తుది జట్టు ప్రకటన కూడా అప్పుడే ఉంటుంది. పరిస్థితులు ఎలా మారుతున్నాయో గమనించి నిర్ణయం తీసుకొంటాం. కాన్పూర్ మ్యాచ్లో రెండు రోజులు ఆట సాగలేదు. అయినా విజయం కోసం మేం బరిలోకి దిగాము. ఇక్కడ ఏం జరుగుతుందో చూడాలి. గెలుపు కోసమే మేము ఆడతాము’ అని రోహిత్ శర్మ తెలిపాడు.
Also Read
- Bank Loan: ఎలాంటి పూచీ కత్తు లేకుండా రూ.20 లక్షల లోన్ .. ప్రాసెస్ ఇదే..
- MG Motors: MG నుంచి కొత్త ADAPT టెక్నాలజీ.. EVలు, హైబ్రిడ్ కార్ల తయారీలో సంచలనం..
- Kejriwal: సోనం వాంగ్చుక్కు కేజ్రీవాల్ మద్దతు.. యువత డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్
- IND vs ENG 2nd ODI: సిరీస్ చేజిక్కించుకోవాలంటే బౌలర్ల చేతుల్లోనే.. ఇంగ్లాండ్ లక్ష్యం ఎంతంటే..
Also Read: IND vs NZ: మరో 53 పరుగులే.. అరుదైన రికార్డుపై కన్నేసిన కోహ్లీ!
బెంగళూరు టెస్టులో ముగ్గరు స్పిన్నర్లతో బరిలోకి దిగాలని భారత్ భావిస్తోంది. రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా సహా కుల్దీప్ యాదవ్ తుది జట్టులో ఆడే అవకాశాలు ఉన్నాయి. జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్ పేస్ బాధ్యతలు మోయనున్నారు. సర్ఫరాజ్ ఖాన్, అక్షర్ పటేల్, ధ్రువ్ జురెల్, ఆకాశ్ దీప్ బెంచ్కే పరిమితం కానున్నారు.
తాజావార్తలు
-
Bank Loan: ఎలాంటి పూచీ కత్తు లేకుండా రూ.20 లక్షల లోన్ .. ప్రాసెస్ ఇదే..
-
MG Motors: MG నుంచి కొత్త ADAPT టెక్నాలజీ.. EVలు, హైబ్రిడ్ కార్ల తయారీలో సంచలనం..
-
Kejriwal: సోనం వాంగ్చుక్కు కేజ్రీవాల్ మద్దతు.. యువత డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్
-
IND vs ENG 2nd ODI: సిరీస్ చేజిక్కించుకోవాలంటే బౌలర్ల చేతుల్లోనే.. ఇంగ్లాండ్ లక్ష్యం ఎంతంటే..
-
The Odyssey: ‘ది ఒడిస్సీ’ ప్రీ రివ్యూ ..
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!