Ram Temple: 2100 కిలోల గంట, 108 అడుగుల అగర్బత్తి.. దేశవిదేశాల నుంచి శ్రీరాముడి చెంతకు కానుకలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ram Temple: అయోధ్యలో శ్రీరామ ఆలయం ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లు దాదాపుగా పూర్తవుతున్నాయి. ఈ నెల 22న రామాలయ ప్రారంభోత్సవం జరగబోతోంది. ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీతో పాటు మొత్తం 7000 మందికి పైగా ముఖ్య అతిథులు హాజరవుతున్నారు. లాల్ లల్లా విగ్రహ ప్రతిష్టాపన కోసం దేశం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తోంది.
మరోవైపు రాముడికి కానుకలుగా పంపిన పలు వస్తువులు అయోధ్యకు చేరుకోబోతున్నాయి. ఇందులో 2100 కిలోల గంట, 108 అడుగుల పొడవాటి అగర్బత్తి, 1,100కిలోల భారీ దీపం, బంగారు పాదరక్షలు, 10 అడుగుల ఎత్తైన తాళం, 8 దేశాల్లో ఏకకాలంలో సమాయాన్ని సూచించే భారీ గడియారం ఉన్నాయి. జనవరి 22 రామమందిర వేడుకకు ముందే ఈ కానుకలు అయోధ్యకు చేరుకోబోతున్నాయి.
Also Read
- Natural gas: భారత్కు జాక్పాట్.. అండమాన్లో గ్యాస్ నిల్వలు..
- Putin: విదేశాల ఒత్తిడికి భారత్ ఎన్నడూ లొంగలేదు.. ట్రంప్కు పుతిన్ స్ట్రాంగ్ మెసేజ్..
- India-China: భారత్ జీడీపీ చైనాను మించిపోనుందా? అంతర్జాతీయ సంస్థ అంచనాలు ఇవే!
- TGPSC New Notification: నిరుద్యోగులకు భారీ శుభవార్త.. మరో నోటిఫికేషన్ విడుదల చేసిన TGPSC..
ఒక్క మనదేశం నుంచే కాదు నేపాల్, శ్రీలంకల నుంచి కూడా కానుకలు వస్తు్న్నాయి. నేపాల్ లోని జనక్పూర్ లోని సీతా జన్మస్థానం నుంచి శ్రీరాముడి కోసం 3000 కంటే ఎక్కువ కానుకలు అయోధ్యకు చేరుకున్నాయి. వీటిలో వెండి బూట్లు, ఆభరణాలు, బట్టలు, ఇతర బహుమతులు ఉన్నాయి. ఈ వారం నేపాల్లోని జనక్పూర్ ధామ్ రామజానకి ఆలయం నుండి అయోధ్యకు దాదాపు 30 వాహనాల కాన్వాయ్ చేరుకున్నాయి. శ్రీలంకలోని ‘అశోకా వాటిక’(సీతను రావణుడు బందీ చేసిన స్థలం) నుంచి ప్రత్యేకమైన రాయిని అయోధ్యకు తీసుకువచ్చారు.
Read Also: Jeddah Tower: బుర్జ్ ఖలీఫా స్థానంలో “జెడ్డా టవర్”.. దీని ప్రత్యేకతలు ఇవే..
రామ్ లాల్లా ప్రాణ్ప్రతిష్ట కోసం అహ్మదాబాద్ నుంచి 44 అడుగుల పొడవైన ఇత్తడి జెండా స్తంబం, ఇతర చిన్న ఆరు స్తంభాలను గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ జెండా ఊపి గత వారం ప్రారంభించారు. గుజరాత్ దరియాపూర్లోని ఆల్ ఇండియా దబ్గర్ సమాజ్ రూపొందించిన నగారు (టెంపుల్ డ్రమ్)ని కూడా పంపింది. బంగారు రేకుతో చేసిన 56 అంగుళాల నగారుని ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేయనున్నారు. 10 అడుగుల ఎత్తు, 4.6 అడుగుల వెడల్పు, 9.5 అంగుళాల మందంతో 400 కేజీల బరువున్న తాళం, తాళం చెవిని ఉత్తరప్రదేశ్లోని అలీగఢ్కు చెందిన సత్య ప్రకాశ్ శర్మ శ్రీరాముడి కోసం తయారు చేశారు. ఇదే ప్రపంచంలో అతిపెద్ద తాళం.
రామాలయ సంప్రోక్షణ కార్యక్రమానికి హాజరయ్యే భక్తుల కోసం 7000 కిలోల ‘‘రామ్ హల్వా’’ని తయారు చేస్తున్నట్లు చెఫ్ విష్ణు మనోహర్ తెలిపారు. మథురలోని శ్రీ కృష్ణ జన్మస్థాన్ సేవా సంస్థాన్ అయోధ్యకు ‘యాగం’ కోసం 200 కిలోల లడ్డూను నైవేద్యంగా పంపడానికి సన్నాహాలు చేస్తోంది. తిరుమల తిరుపతి దేవస్థానం లక్ష శ్రీవారి లడ్డూలను భక్తులకు అందించనుంది.
తాజావార్తలు
-
Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
-
Shreyas Iyer: చరిత్రను లిఖించనున్న శ్రేయస్ అయ్యర్.. 2028 వరకు కెప్టెన్గా సర్పంచ్ సాబ్..
-
Hyderabad: బంధాల్ని తెంచుతున్న వివాహేతర సంబంధాలు.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం
-
NTR Viral Tweet: కుకీలు పంపమన్న అభిమాని.. ఎన్టీఆర్ క్రేజీ రిప్లై ట్వీట్ వైరల్!
-
Natural gas: భారత్కు జాక్పాట్.. అండమాన్లో గ్యాస్ నిల్వలు..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!