- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jammu And Kashmir: భారీ వర్షాలు ఉత్తరాది రాష్ట్రాలను అతలాకుతలం చేస్తున్న సంగతి తెలిసిందే. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ లో వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. వీటి కారణంగా చాలా మంది ప్రాణాలు కోల్పొతున్నారు. వరదలకు తోడు పిడుగులు పడి కూడా కొంతమంది చనిపోతున్నారు. ఇక వరదల కారణంగా కొండలపై ఉండే పెద్దపెద్ద బండరాళ్లు కిందకు పడుతున్నాయి. కొండచరియలు విరిగి పడుతున్నాయి. దీని కారణంగా జమ్మూ కశ్మీర్ లో నలుగురు ప్రాణాలు కోల్పొయారు. బనిహాల్ ప్రాంతంలోని షేర్ బీబీ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది.
Also Read: Food Poisoning: కస్తూర్బా విద్యాలయంలో ఫుడ్ పాయిజన్.. ఆసుపత్రిలో 80 మంది విద్యార్ధినిలు
Also Read
ఓ ట్రక్ జమ్మూ నుంచి శ్రీనగర్ కు వెళుతుంది. అయితే రాంబన్ జిల్లా వ్దద భారీ వర్షాల కారణంగా బండరాయి జారి ట్రక్కు మీద పడింది. దీంతో ట్రక్కు లోయలోకి పడిపోయింది. ఈ ఘటనలో నలుగురు దుర్మరణం చెందారు. ట్రక్కు లోతైన లోయలో పడటంతో దానిలో ఉన్న నలుగురు అక్కడికక్కడే చనిపోయారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. లోయలో పడిన మృతదేహాలను వెలికితీశారు. ఈ ప్రమాదంలో మనుషులతో పాటు ట్రక్ లో ఉన్న ఆరు పశువులు కూడా చనిపోయాయి. కొండచరియాలు విరిగిపడటంతో జాతీయ రహదారి-44పై వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. కిష్త్వారీ పథేర్ బనిహాల్ వద్ద కొండచరియలు విరిగిపడిన కారణంగా జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిని బ్లాక్ చేశారు.
ఉత్తరప్రదేశ్ లో కూడా వరదల కారణంగా 19 మంది మరణించిన విషయం తెలిసిందే. మరో మూడు నాలుగు రోజుల పాటు వర్షాలు ఉండటంతో అప్రమత్తంగా ఉండాలని రాష్ట్రాలకు వాతావరణ శాఖ సూచించింది. ఉత్తరప్రదేశ్ లో స్కూళ్లకు కూడా సెలవులు ప్రకటించారు. సెప్టెంబర్ 14 వ తేదీ వరకు భారీ వర్షాలు ఉన్నాయని అవసరమైతే బయటకు రావాలని వాతావరణ శాఖ సూచించింది.
తాజావార్తలు
-
Rupee: రూపాయి గరిష్ట పతనంపై.. ఆర్బీఐ సంచలన నిర్ణయం..
-
KKR Vs MI: కేకేఆర్ బౌలర్ల ధాటికి ముంబై విలవిల.. కోల్కతా టార్గెట్ ఎంతంటే..
-
Off The Record : జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ గురించి టీడీపీలో చర్చలు
-
Uttar Pradesh: జిమ్లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
-
Story Board : రూపాయి పతనం సెంచరీకి చేరువౌతోందా..? ఇరాన్ యుద్ధమే కొంప ముంచుతోందా..?
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!