Bank Robbery: రాయ్గఢ్లో దొంగల బీభత్సం.. బ్యాంకులో కత్తి చూపించి బంగారం, డబ్బుతో పరారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఛత్తీస్గఢ్ లోని రాయ్గఢ్లో దొంగలు బీభత్సం సృష్టించారు. ఓ బ్యాంకులో మంగళవారం తెల్లవారుజామున భారీ దోపిడీ జరిగింది. ఉదయం బ్యాంకు తెరిచిన తర్వాత కొందరు దుండగులు హఠాత్తుగా బ్యాంకులోకి ప్రవేశించారు. తొలుత బ్యాంకు మేనేజర్ను కత్తితో పొడిచిన దుండగులు.. మిగిలిన బ్యాంకు ఉద్యోగులను బందీలుగా చేసుకుని నగదు, బంగారం, వెండితో పరారయ్యారు. బ్యాంకులో ఎంత మొత్తం దోచుకున్నారు అనే దానిపై ఇంకా స్పష్టత లేదు. అయితే దొంగలు ఎంత దోచుకెళ్లారోనని బ్యాంకు ఉద్యోగులు లెక్కలు వేస్తున్నారు. అయితే కోట్లాది రూపాయల దోపిడీ జరిగినట్లు భావిస్తున్నారు.
Armenia-Azerbaijan War: అర్మేనియాపై మరోసారి యుద్ధం ప్రకటించిన అజర్బైజాన్
Also Read
- CM Chandrababu: వారణాసిలో చంద్రబాబు పర్యటన.. కాశీ విశ్వనాథుడికి ప్రత్యేక పూజలు.. రాజ్నాథ్, యోగితో కలిసి..
- Movies Postponed: చివరి నిమిషంలో టాలీవుడ్లో చిన్న సినిమాలు పోస్ట్పోన్..!
- Onion Price Hike: కోయకుండానే కన్నీళ్లు తెప్పిస్తున్న ఉల్లి.. 94 శాతం పెరిగిన ధరలు.. ఉత్పత్తి ఉన్నా ఎందుకీ దుస్థితి?
- Vice President Radhakrishnan: సర్దార్ పటేల్కు నిజమైన నివాళి అదే.. విమోచన దినోత్సవంలో ఉపరాష్ట్రపతి కీలక వ్యాఖ్యలు.!
వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని ధీమ్రాపూర్ చౌక్లోని యాక్సిస్ బ్యాంక్లో ఈరోజు ఉదయం చోరీ జరిగింది. ఉదయం బ్యాంకు తెరుస్తుండగా ముసుగులు ధరించిన వ్యక్తులు ఆయుధాలతో బ్యాంకులోకి ప్రవేశించి ఉద్యోగులందరినీ బందీలుగా పట్టుకున్నారు. అంతేకాకుండా బ్యాంకు మేనేజర్పై అగంతకులు కత్తితో దాడి చేశారు. ఘటన అనంతరం దుండగులు డబ్బుతో పరారయ్యారు. ఈ ఘటనపై బ్యాంకు ఉద్యోగులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం పోలీసు ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. బ్యాంకులో పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.
సుమారు 10 గంటల సమయంలో బ్యాంకు అధికారులు డయల్ 112కు సమాచారం అందించారని రాయ్గఢ్ ఎస్పీ సదానంద్ కుమార్ మీడియాకు తెలిపారు. కొందరు గుర్తు తెలియని దుండగులు దోపిడీకి పాల్పడ్డారని తెలిపారు. దీంతో రాయ్గఢ్ పోలీసుల బృందం అంతా వెంటనే బ్యాంకుకు చేరుకున్నారు. బ్యాంకు మేనేజర్ తొడపై కత్తితో పొడిచి మిగతా సిబ్బందిని బందీలుగా పట్టుకుని దోచుకున్నారని ఎస్పీ పేర్కొన్నారు. అనంతరం దుండగులు పరారీ అయ్యారని.. వారి కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయని తెలిపారు.
Harish Rao: ప్రధాని మోడీ వ్యాఖ్యలకు హరీశ్ రావు కౌంటర్
మరోవైపు దుండగులు ఎంత దోచుకున్నారని బ్యాంకు అధికారులు ధృవీకరించలేదు. బ్యాంకులోని సీసీటీవీని దుండగులు ధ్వంసం చేయగా. దానిని బ్యాకప్ చేస్తున్నారు. అంతేకాకుండా.. రాయ్గఢ్ పొరుగు జిల్లాలు, పొరుగు రాష్ట్రాల్లో పోలీసులు చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తున్నారు. రాయగఢ్ జిల్లా ఒడిశా రాష్ట్రానికి అనుసంధానం కావడం గమనార్హం. ఈ ఘటనపై రాయ్ఘర్ పోలీసులు.. ఒడిశా పోలీసులను సంప్రదిస్తున్నారు. నిందితులను అరెస్టు చేయడానికి జిల్లా సరిహద్దులో భారీ భద్రతను ఏర్పాటు చేస్తున్నారు.
- Tags
- bank robbery
- Gold
- money
- raigarh
- stole
తాజావార్తలు
-
Semicon India 2026: సెమీకాన్ ఇండియా 2026 ప్రారంభించిన ప్రధాని మోడీ.. సెమీకండక్టర్ రంగంలో భారీ సంస్కరణలు
-
CM Chandrababu: వారణాసిలో చంద్రబాబు పర్యటన.. కాశీ విశ్వనాథుడికి ప్రత్యేక పూజలు.. రాజ్నాథ్, యోగితో కలిసి..
-
Movies Postponed: చివరి నిమిషంలో టాలీవుడ్లో చిన్న సినిమాలు పోస్ట్పోన్..!
-
Prabhas-Spirit: మరింత డార్క్ అండ్ బోల్డ్.. యానిమల్కు మించి స్పిరిట్.. థియేటర్లు తగలబడిపోవడం ఖాయం!
-
Onion Price Hike: కోయకుండానే కన్నీళ్లు తెప్పిస్తున్న ఉల్లి.. 94 శాతం పెరిగిన ధరలు.. ఉత్పత్తి ఉన్నా ఎందుకీ దుస్థితి?
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!