Bank Robbery: రాయ్గఢ్లో దొంగల బీభత్సం.. బ్యాంకులో కత్తి చూపించి బంగారం, డబ్బుతో పరారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఛత్తీస్గఢ్ లోని రాయ్గఢ్లో దొంగలు బీభత్సం సృష్టించారు. ఓ బ్యాంకులో మంగళవారం తెల్లవారుజామున భారీ దోపిడీ జరిగింది. ఉదయం బ్యాంకు తెరిచిన తర్వాత కొందరు దుండగులు హఠాత్తుగా బ్యాంకులోకి ప్రవేశించారు. తొలుత బ్యాంకు మేనేజర్ను కత్తితో పొడిచిన దుండగులు.. మిగిలిన బ్యాంకు ఉద్యోగులను బందీలుగా చేసుకుని నగదు, బంగారం, వెండితో పరారయ్యారు. బ్యాంకులో ఎంత మొత్తం దోచుకున్నారు అనే దానిపై ఇంకా స్పష్టత లేదు. అయితే దొంగలు ఎంత దోచుకెళ్లారోనని బ్యాంకు ఉద్యోగులు లెక్కలు వేస్తున్నారు. అయితే కోట్లాది రూపాయల దోపిడీ జరిగినట్లు భావిస్తున్నారు.
Armenia-Azerbaijan War: అర్మేనియాపై మరోసారి యుద్ధం ప్రకటించిన అజర్బైజాన్
Also Read
- Shreyas Iyer: ఓటమికి కారణాలు ఇవే.. తప్పులను నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్ అయ్యర్..
- Harmanpreet Kaur: ఆ తప్పే మా కొంపముంచింది.. ప్రతీ సారి ఇలానే జరుగుతోంది.. భావోద్వేగానికి లోనైన కెప్టెన్..
- IND Vs IRE: ప్రపంచ ఛాంపియన్ను మట్టికరిపించిన ఐర్లాండ్.. సిరీస్ కైవసం..
- T20 World Cup: టీమిండియా ఘోర ఓటమి.. వరల్డ్ కప్ నుంచి ఔట్..
వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని ధీమ్రాపూర్ చౌక్లోని యాక్సిస్ బ్యాంక్లో ఈరోజు ఉదయం చోరీ జరిగింది. ఉదయం బ్యాంకు తెరుస్తుండగా ముసుగులు ధరించిన వ్యక్తులు ఆయుధాలతో బ్యాంకులోకి ప్రవేశించి ఉద్యోగులందరినీ బందీలుగా పట్టుకున్నారు. అంతేకాకుండా బ్యాంకు మేనేజర్పై అగంతకులు కత్తితో దాడి చేశారు. ఘటన అనంతరం దుండగులు డబ్బుతో పరారయ్యారు. ఈ ఘటనపై బ్యాంకు ఉద్యోగులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం పోలీసు ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. బ్యాంకులో పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.
సుమారు 10 గంటల సమయంలో బ్యాంకు అధికారులు డయల్ 112కు సమాచారం అందించారని రాయ్గఢ్ ఎస్పీ సదానంద్ కుమార్ మీడియాకు తెలిపారు. కొందరు గుర్తు తెలియని దుండగులు దోపిడీకి పాల్పడ్డారని తెలిపారు. దీంతో రాయ్గఢ్ పోలీసుల బృందం అంతా వెంటనే బ్యాంకుకు చేరుకున్నారు. బ్యాంకు మేనేజర్ తొడపై కత్తితో పొడిచి మిగతా సిబ్బందిని బందీలుగా పట్టుకుని దోచుకున్నారని ఎస్పీ పేర్కొన్నారు. అనంతరం దుండగులు పరారీ అయ్యారని.. వారి కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయని తెలిపారు.
Harish Rao: ప్రధాని మోడీ వ్యాఖ్యలకు హరీశ్ రావు కౌంటర్
మరోవైపు దుండగులు ఎంత దోచుకున్నారని బ్యాంకు అధికారులు ధృవీకరించలేదు. బ్యాంకులోని సీసీటీవీని దుండగులు ధ్వంసం చేయగా. దానిని బ్యాకప్ చేస్తున్నారు. అంతేకాకుండా.. రాయ్గఢ్ పొరుగు జిల్లాలు, పొరుగు రాష్ట్రాల్లో పోలీసులు చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తున్నారు. రాయగఢ్ జిల్లా ఒడిశా రాష్ట్రానికి అనుసంధానం కావడం గమనార్హం. ఈ ఘటనపై రాయ్ఘర్ పోలీసులు.. ఒడిశా పోలీసులను సంప్రదిస్తున్నారు. నిందితులను అరెస్టు చేయడానికి జిల్లా సరిహద్దులో భారీ భద్రతను ఏర్పాటు చేస్తున్నారు.
- Tags
- bank robbery
- Gold
- money
- raigarh
- stole
తాజావార్తలు
-
Shreyas Iyer: ఓటమికి కారణాలు ఇవే.. తప్పులను నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్ అయ్యర్..
-
Harmanpreet Kaur: ఆ తప్పే మా కొంపముంచింది.. ప్రతీ సారి ఇలానే జరుగుతోంది.. భావోద్వేగానికి లోనైన కెప్టెన్..
-
CM Chandrababu : ఐదు రోజుల సీఎం టూర్.. వరుసగా భారీ కార్యక్రమాలు
-
IND Vs IRE: ప్రపంచ ఛాంపియన్ను మట్టికరిపించిన ఐర్లాండ్.. సిరీస్ కైవసం..
-
Nimmala Ramanaidu : జగన్వి అన్నీ క్రెడిట్ చోరీ ముచ్చట్లే.. వెలిగొండను పూర్తి చేసేది చంద్రబాబే
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!