RK Roja: కూటమి గెలుపుపై రోజా సంచలన వ్యాఖ్యలు.. ఈవీఎం మాయాజాలం తోడై..!
- ఎన్డీఏ కూటమి గెలుపుపై రోజా సంచలన వ్యాఖ్యలు..
- ఈవీఎం మాయాజాలం తోడై కూటమి ప్రభుత్వం గెలిచింది..
- కళ్ల బొల్లి మాటలు, వాగ్దానాలకు ప్రజలు నమ్మి ఓటు వేశారు..
- గెలిచాక మాటమార్చారని విమర్శించిన రోజా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RK Roja: ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ప్రభుత్వం కూలిపోయి.. టీడీపీ-జనసేన-బీజేపీ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తి అయ్యింది.. అయితే, ఇప్పటికీ ఆ నాటి ఎన్నికల, ఫలితాలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు.. మరోసారి అదే అంశాన్ని లేవనెత్తారు వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఆర్కే రోజా.. తిరుపతిలో మీడియాతో మాట్లాడిన ఆమె.. ఈవీఎం మాయాజాలం తోడై కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో గెలిచిందని ఆరోపించారు.. కళ్ల బొల్లి మాటలు, వాగ్దానాలకు ప్రజలు నమ్మి ఓటు వేశారు, గెలిచాక మాటమార్చారని విమర్శించారు.. కుక్కతోక వంకర తరహాలో చంద్రబాబు ఎన్నికలు ముందు మారాను అని చెప్పి, అధికారంలోకి వచ్చాక మళ్లీ అదే విధంగా ఆలోచన చేస్తున్నారు అని దుయ్యబట్టారు.
Read Also: Pakistan: భారత్ దెబ్బతో చైనా ఆయుధాలను నమ్మలేకపోతున్న పాకిస్తాన్.. ఇప్పుడు ఏం చేస్తోందంటే..
Also Read
- OTR: దసరా కానుకగా కేబినెట్ విస్తరణ ఉంటుందా?
- LG Smart TV: ఎల్జీ టీవీ ఆఫ్లో ఉన్నా ఆడియో రికార్డింగ్ జరుగుతోందా..? అసలు నిజమేంటి?
- Pakistan: బ్రిక్స్లో చేరేందుకు పాకిస్తాన్ తహతహ.. ‘ఛీ పొమ్మంటున్న’ భారత్!
- New Smart Mobile: OLED డిస్ప్లే, 1TB స్టోరేజ్, 7,000mAh బ్యాటరీ.. పాస్పోర్ట్ లాంటి ఫోన్.. ఎగబడుతున్న జనాలు..
ఇక, కరోనా లాంటి విపత్కర పరిస్థితిలో కుంటి సాకులు చెప్పకుండా ప్రజలకు జగన్ అన్న సాయం చేశారని గుర్తుచేశారు రోజా.. ఈ నెల 9వ తేదీన మామిడి రైతుల కోసం వైఎస్ జగన్ వస్తున్నారు అని తెలియగానే ఒక అలజడి మొదలైంది.. సీఎం చంద్రబాబు ఇదే జిల్లా వాసి అయినప్పటికీ మామిడి రైతుల కష్టాలు తెలియనట్లు మాట్లాడుతున్నారు అంటూ మండిపడ్డారు.. ఇదే జిల్లాలో పుట్టి పెరిగావు, నీ వయసు ఎంత..?. రైతులకు అన్యాయం జరుగుతుంటూ నీకు తెలియడం లేదా..? అని నిలదీశారు.. సొంత జిల్లాలో రైతులకు ఏమి చేయని దౌర్భాగ్య స్థితిలో సీఎం చంద్రబాబు ఉన్నారని ఫైర్ అయ్యారు..
Read Also: Piracy : పైరసీ చేసి 50 లక్షలు సంపాదించిన కిరణ్ ..ప్రైవేటు వీడియోలు కూడా ?
మరోవైపు, మామిడి రైతులు సిండికేట్ గా మారి రైతులను దోచుకుంటున్నారు అని ఆరోపించారు రోజా.. వ్యవసాయ మంత్రి ఎక్కడెక్కడో ఉండి.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై మాట్లాడటం కాదు.. చిత్తూరు జిల్లాకు వస్తే రైతులు పాతేస్తారు అంటూ హెచ్చరించారు.. త్వరలోనే కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు బంగాళాఖాతంలో కలిపేస్తారు అంటూ జోస్యం చెప్పారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఆర్కే రోజా..
తాజావార్తలు
-
Story Board : ఏఐతో ప్రపంచానికి పెను ముప్పు తప్పదా..? ఏఐతో అసలు సినిమా ముందుందా..?
-
OTR: దసరా కానుకగా కేబినెట్ విస్తరణ ఉంటుందా?
-
LG Smart TV: ఎల్జీ టీవీ ఆఫ్లో ఉన్నా ఆడియో రికార్డింగ్ జరుగుతోందా..? అసలు నిజమేంటి?
-
CM Revanth Reddy : ప్రపంచంతో పోటీపడేలా తెలంగాణ నూతన విద్యావిధానం
-
Pakistan: బ్రిక్స్లో చేరేందుకు పాకిస్తాన్ తహతహ.. ‘ఛీ పొమ్మంటున్న’ భారత్!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?