Revanth Reddy : కర్ణాటక ఎన్నికల ఫలితాలు మాకు వెయ్యి ఏనుగుల బలం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కన్నడ రాజకీయాలు మలుపు తీసుకున్నాయి. ఎగ్జిట్ పోల్స్ను తిరగరాస్తూ.. కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి రానుంది. అయితే.. కర్ణాటక కాంగ్రెస్ విజయాని తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. బీజేపీకి మతం ఒక అవసరమని, మతంని రాజకీయాలకు వాడే విధానం ప్రజలు తిరస్కరించారన్నారు. కర్ణాటక ప్రజలు మోడీని ఓడించడంతో రాహుల్ జోడో యాత్రని విశ్వసించారన్నారు. జేడీఎస్కి మద్దతు పలికన కేసీఆర్ ని ఓడించారని, హాంగ్ రావాలని కేసీఆర్ చూశారన్నారు. మోడీని…కేసీఆర్ ఆలోచన కర్ణాటక ప్రజలు తిరస్కరించారని, తెలంగాణ ఎన్నికలపై ప్రభావము చూపుతాయన్నారు రేవంత్ రెడ్డి. జోడో యాత్ర రెండో విజయం కర్ణాటక అని, మూడో విజయం తెలంగాణ అని ఆయన వ్యాఖ్యానించారు.
Also Read : Bharat Jodo Yatra: కర్ణాటకలో భారత్ జోడో యాత్ర ఇంపాక్ట్.. రాహుల్ పర్యటించిన మెజారిటీ స్థానాల్లో విజయం
Also Read
ఆఖరికి ఎర్రకోటపై జెండా ఎగరేస్తామని రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కేటీఆర్.. ట్విట్టర్ లో స్పందించారని, ఎక్కడ ప్రజల తీర్పుని స్వాగతించలేదన్నారు. మోడీ ఓడిపోతే కేటీఆర్ ఎందుకు బాధ పడుతున్నారని ఆయన ప్రశ్నించారు. కర్ణాటక ఎన్నికల ఫలితాలు మాకు వెయ్యి ఏనుగుల బలం వచ్చిందని, అక్కడి ఫలితాల ప్రభావం ఎక్కడ ఉంటాయని కేటీఆర్ ట్వీట్ చేశారని, కానీ.. క్యాన్సర్ ట్రీట్మెంట్ చివరి దశలో ఉన్న వారి ఆశ లాంటిదేనన్నారు రేవంత్ రెఎడ్డి. మోడీ ఓడిపోతే ఎందుకు బాధ పడుతున్నారని, ఆస్పష్ట రాజకీయాలు చేస్తున్నాయి బీజేపీ, బీఆర్ఎస్ లు అంటూ రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. దక్షిణ భారతదేశంలో బీజేపీకి చోటు లేదని, కర్ణాటక లాస్ట్ ఎన్నికల్లో కూడా గెలిచింది కాంగ్రెస్సే.. ఫిరాయింపుల తో… బీజేపీ అధికారంలోకి వచ్చిందన్నారు. బీఆర్ఎస్, బీజేపీ రెండు ఒక్కటేనని, వేరు వేరు కాదన్నారు.
Also Read : SRH vs LSG: ముగిసిన సన్రైజర్స్ బ్యాటింగ్.. లక్నో లక్ష్యం ఎంతంటే?
మోడీకి అండగా నిలబడ్డది కేసీఆరే అని రేవంత్ ఆరోపించారు. కర్ణాటక ఎన్నికల్లో మోడీ ని ఓడించండి అని స్టేట్మెంట్ ఇచ్చాడా..? ఇద్దరు దోస్తులు కాబట్టే అలా వ్యవహారం నడిపారు. మహారాష్ట్ర లో సభలు పెట్టె కేసీఆర్..కర్ణాటక లో ఎందుకు పెట్టలేదు. మోడీ ని ఓడించండి అని ఎందుకు పిలుపు ఇవ్వలేదు. కర్ణాటక లో మాదిరిగానే..ఇక్కడ కూడా 40 శాతం కమిషన్ తీసుకుంటుంది. మోడీ కి..కేసీఆర్ కి తేడా లేదు. పేర్లు మాత్రమే వేరు.. విధానాలు ఒక్కటే. పార్టీ ఫిరాయింపుల చేయడం.. ఎమ్మెల్యేల కొనడం.. కమిషన్ తీసుకోవడంలో ఇద్దరు ఒక్కటే. దళిత బంధు లో 30 శాతం కమిషన్ తీస్కుంటున్నట్టు కేసీఆర్ చెప్పారు. కొత్తగా మేము చెప్పేది ఏముంది. ఔటర్ అమ్ముకుంది ఆయనే’ అని రేవంత్ రెడ్డి మండిపడ్డారు.
తాజావార్తలు
-
IND vs SL 2nd Test Day 4: కొలంబోలో వర్షం కారణంగా ముందుగానే ఆట ముగింపు.. ఎవరిది పైచేయి?
-
Shiraz Mehdi: దిల్ రాజు సహా ఫిల్మ్ ఛాంబర్కు దర్శకుడు లీగల్ నోటీసులు, సీఎం రేవంత్ కు ఫిర్యాదు!
-
Kitchen Tips: అల్లం తొక్క క్షణాల్లో ఊడిపోవాలంటే ఈ టెక్నిక్ పాటించండి
-
IND vs SL: జడేజా ఖాతాలో చెత్త రికార్డు.. అందులో నంబర్ వన్!
-
Indiramma Houses : ఇందిరమ్మ ఇళ్ల లాటరీకి డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే.?
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..