Bharat Jodo Yatra: కర్ణాటకలో భారత్ జోడో యాత్ర ఇంపాక్ట్.. రాహుల్ పర్యటించిన మెజారిటీ స్థానాల్లో విజయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bharat Jodo Yatra: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఎప్పుడూ లేని విధంగా కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. బీజేపీ దారుణ పరాజయాన్ని మూటకట్టుకుంది. 224 అసెంబ్లీ స్థానాలు ఉన్న కన్నడ అసెంబ్లీలో కాంగ్రెస్ 137 స్థానాల్లో, బీజేపీ 64 స్థానాల్లో, 20 స్థానాల్లో దాదాపుగా గెలుపును ఖాయం చేసుకున్నాయి. ఇదిలా ఉంటే కర్ణాటకలో కాంగ్రెస్ భారీ విజయానికి రాహుల్ గాంధీ ‘ భారత్ జోడో యాత్ర’నే కారణం అని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్, రాహుల్ గాంధీ యాత్ర వల్లే ఈ స్థాయిలో విజయం వరించిందని వ్యాఖ్యాినించారు.
Read Also: Pallam Raju: మోడీ సర్కార్పై వ్యతిరేకత.. రాహుల్ గాంధీ ప్రధాని కావడం ఖాయం..
Also Read
- Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
- Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో భర్త సమర్థ్ సింగ్కు షాక్.. న్యాయ వృత్తి నుంచి సస్పెండ్
- Twisha Sharma: ట్విషా శర్మ మరణానికి ముందు ఎక్కడకెళ్లిందంటే.. వెలుగులోకి వీడియో
- Modi-Suvendu: మోడీతో బెంగాల్ సీఎం భేటీ.. 45 నిమిషాలు సాగిన సమావేశం
ఇదిలా ఉంటే కాంగ్రెస్ కమ్యూనికేషన్ చీఫ్ మరియు రాజ్యసభ ఎంపీ జైరాం రమేష్ ఏకంగా భారత్ జోడో యాత్రం ప్రభావాన్ని తెలిపే స్టాటిస్టిక్స్ ని ట్వీట్ చేశారు. గతేడాది సెప్టెంబర్ 7న తమిళనాడులోని కన్యాకుమారి మీదుగా కేరళ, కర్ణాటక రాష్ట్రంలో భారత్ జోడో యాత్ర నిర్వహించారు. ఏకంగా 12 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాల గుండా ఈ యాత్ర జరిగింది. 3500 కిలోమీటర్ల పాదయాత్రను 150 రోజుల పాటు నిర్వహించారు.
ఇదిలా ఉంటే కర్ణాటకలో 20 అసెంబ్లీ నియోజకవర్గాల గుండా రాహుల్ పాదయాత్ర సాగింది. తాజాగా ప్రకటించి ఫలితాల్లో ఈ 20 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ 15 స్థానాల్లో ఆధిక్యం/విజయం కనబరిచింది. బీజేపీ 2, జేడీఎస్ 3 స్థానాలకే పరిమితం అయింది. 2018 ఎన్నికల్లో ఈ స్థానాాల్లో బీజేపీ 9, కాంగ్రెస్ 5, స్థానాల్లో గెలుపొందాయి. ఇది కర్ణాటకలో భారత్ జోడో యాత్ర ప్రభావం. యాత్రలో కర్ణాటక ప్రజలతో మాట్లాడామని, పార్టీని ఏకం చేయడంతో పాటు క్యాడర్ ను సమాయత్తం చేశామని, వీటి ద్వారానే మా మానిఫెస్టోలోని హామీలు, వాగ్ధానాలను చర్చించి ఖరారు చేశామని జైరాం రమేష్ ట్వీట్ చేశారు.
While this is the direct impact of the #BharatJodoYatra in Karnataka, the intangible impact was uniting the party, reviving the cadre and shaping the narrative for the Karnataka elections. It was during the Bharat Jodo Yatra, from the many conversations @RahulGandhi had with the… pic.twitter.com/r1JOWMoei3
— Jairam Ramesh (@Jairam_Ramesh) May 13, 2023
తాజావార్తలు
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!