Revanth Reddy: తెలంగాణలో ఓ ట్రంప్ ఉండేవారు.. కేసీఆర్పై సీఎం సెటైర్లు!
- తెలంగాణలో ఓ ట్రంప్ ఉండేవారు
- కేసీఆర్పై సీఎం రేవంత్ పరోక్ష విమర్శలు
- ఇష్టరాజ్యంగా పరిపాలన నడిపించే వారు ట్రంప్
- దిగ్గజ పారిశ్రామికవేత్తలతో సీఎం వరుస సమావేశాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పరోక్షంగా విమర్శలు చేశారు. తెలంగాణలో ఒక ట్రంప్ ఉండేవారని, తెలంగాణ ప్రజలు ఆ ట్రంప్ను పక్కన పడేశారని ఎద్దేవా చేశారు. ఇష్టరాజ్యంగా పరిపాలన నడిపించే వారు ఎవరైనా ట్రంప్ అవుతారు అని పేర్కొన్నారు. రాత్రి నిద్రలో ఏదైనా ఆలోచన వస్తే.. మరుసటి రోజు ఆర్డర్ ఇవ్వడం చాలా రోజులు నడవదు అని సీఎం విమర్శించారు. పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా సీఎం రేవంత్ ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. నిన్ననే ఢిల్లీ చేరుకున్న సీఎం.. ఈరోజు పలువురు దిగ్గజ పారిశ్రామికవేత్తలతో వరుస సమావేశాల్లో పాల్గొంటున్నారు.
పబ్లిక్ ఎఫైర్స్ ఫోరమ్ ఆఫ్ ఇండియా 12వ వార్షిక సదస్సుకు సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ‘విజన్ తెలంగాణ రైజింగ్ 2047’ అంశంపై సీఎం మాట్లాడారు. ‘పరిపాలన చెయ్యాలంటే పొలిటికల్ విల్ చాలా అవసరం. తెలంగాణలో ఓ ట్రంప్ ఉండేవారు. తెలంగాణ ప్రజలు ఆ ట్రంప్ను పక్కన పడేశారు. ఇష్టరాజ్యంగా పరిపాలన నడిపించే వాళ్లు ఎవరైనా ట్రంప్ అవుతారు. రాత్రి నిద్రలో ఏదైనా ఆలోచన వస్తే, మరుసటి రోజు ఆర్డర్ ఇవ్వడం చాలా రోజులు నడవదు. ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు అమెరికాకే నష్టం. హార్వర్డ్, స్టాన్ఫోర్డ్ సంస్థలతో మాట్లాడుతాను. అమెరికా కాదంటున్న సంస్థలు ఇండియాకి రావాలి. తెలంగాణకు వెల్కమ్ చెబుతున్నాం. అన్ని మౌలిక వసతులు కల్పిస్తాం. తెలంగాణకు రండి పెట్టుబడులు పెట్టండి’ అని సీఎం కోరారు.
Also Read
Also Read: Today Gold Price: చిన్న బ్రేక్.. మళ్లీ మొదలైన బంగారం ధరల మోత!
‘భవిష్యత్ తరాల కోసం అవకాశాలను క్రియేట్ చేయడమే మా ఆలోచన. దేశంలో తెలంగాణ యంగెస్ట్ స్టేట్. 2047 కోసం తెలంగాణ విజన్ డాక్యుమెంట్ రూపొందించాం. 10 మిలియన్ పీపుల్స్ అర్బన్ ఏరియాలో నివసిస్తున్నారు. సెమీ అర్బన్ ఏరియాలో మాన్యుఫాక్చర్ జోన్గా నిర్ణయించాం. తెలంగాణలో అభివృద్ధి జరుగుతోంది. అందుకే 150 కిలోమీటర్ల మేర మెట్రో సెకండ్ ఫేజ్, మూసీ రివర్ డెవలప్మెంట్పై దృష్టి పెట్టాం. ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణం, టెంపుల్-మసీదు-చర్చ్-గురుద్వారాల నిర్మాణంతో కల్చరల్ కనెక్టివిటీ, 2027 నాటికి హైద్రాబాద్ నగరంలో ఈవీ వెహికల్స్ రానున్నాయి. ఈవీ వెహికిల్ కోసం రాయితీలు ప్రకటించాం’ అని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.
తాజావార్తలు
-
BCCI Meeting: సూర్యకుమార్ టీ20 కెప్టెన్సీపై కీలక నిర్ణయం?.. బీసీసీఐ సమావేశంలో హాట్ టాపిక్!
-
Sreeleela: శ్రీలీల – తిలక్ వర్మ రిలేషన్షిప్పై షాకింగ్ ట్విస్ట్..!
-
Kumar Sangakkara: “వైభవ్తో క్రికెట్ ముచ్చట్లు పెట్టను”.. బుడ్డోడి సీక్రెట్ లీక్ చేసిన రాజస్థాన్ హెడ్ కోచ్..
-
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
-
Mamata Banerjee: రాజకీయ అహంకారానికి పేదలే మూల్యం చెల్లిస్తున్నారు.. బెంగాల్లో బుల్డోజర్ చర్యలపై మమతా ఫైర్
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..