Revanth Reddy: బీజేపీ అంటే.. బ్రిటీష్ జనతా పార్టీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాహుల్ గాంధీ లోక్సభ సభ్యత్వం రద్దును వ్యతిరేకిస్తూ ‘సంకల్ప్ సత్యాగ్రహ’ పేరుతో కాంగ్రెస్ దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టింది. ఇందులో భాగంగా ఇవాళ హైదరాబాద్ గాంధీభవన్లోనూ తెలంగాణ కాంగ్రెస్ నేతలు దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. బీజేపీ అంటే.. బ్రిటీష్ జనతా పార్టీ అంటూ విమర్శలు గుప్పించారు. బ్రిటీష్ విధానాలనే బీజేపీ అమలు చేస్తుందని, బీజేపీని ఈ రోజు నుంచి బ్రిటీష్ జనతా పార్టీగా పిలుద్దామని ఆయన అన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ లేకుంటే హైదరాబాద్ కి స్వతంత్రం వచ్చేది కాదని అమిత్ షా అంటున్నాడన్నారు. వల్లభాయ్ పటేల్ కి మీ పార్టీకి సంబంధం ఏంటని ఆయన ప్రశ్నించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ కాంగ్రెస్ నాయకుడని, ఆర్ఎస్ఎస్ ని నిషేధించింది కూడా సర్దార్ వల్లభాయ్ పటేలే అని ఆయన వ్యాఖ్యానించారు. గాంధీభవన్ కి పునాది వేసింది కూడా వల్లభాయ్ పటేలే అని, అదానీ కంపెనీ కూడా ఈస్ట్ ఇండియా కంపెనీ లెక్క సూరత్ నుంచే మొదలైందన్నారు.
Also Read : Smriti Irani: సిగ్గులేదా.. నీకు అని అతడు నన్ను అవమానించాడు
Also Read
- India vs Pakistan: అంపైర్లు కూడా భారత్కే సపోర్ట్.. పాక్ క్రికెటర్ సంచలన ఆరోపణలు..
- TG20 League: 'హైదరాబాద్ ఈ ఛాంపియన్స్' ఫైనల్ స్క్వాడ్.. ఇదిగో పూర్తి లిస్ట్..
- APL: విద్యార్థులకు శుభవార్త.. ఏపీఎల్ మ్యాచ్లకు ఉచిత ప్రవేశం..
- Vaibhav Sooryavanshi: ‘నా ఆట బానే ఉంటుంది కదా.. మరి వాళ్లు అలా ఎందుకు చేశారు’.. భావోద్వేగానికి గురైన సూర్యవంశీ..
బ్రిటీష్ తెచ్చిన ఈస్ట్ ఇండియా కంపెనీ లెక్క బీజేపీ కూడా అదానీ కంపెనీలతో దేశ సంపదను కొల్లగొడుతుందన్నారు. రాహుల్ గాంధీ మాట్లాడింది కర్ణాటకలో గుజరాత్ లో కేస్ ఎలా వేస్తారు..? అని ఆయన ప్రశ్నించారు. అదానీ దోపిడీపై పార్లమెంటులో మోడీని రాహుల్ కడిగేశారని, రాహుల్ గాంధీని చూడాలంటే మోడీకి భయం పట్టుకుందన్నారు. అదానీ కంపెనీలో 23 వేల కోట్ల పెట్టుబడులు పెట్టింది ఎవరో తేలాలి? అని ఆయన డిమాండ్ చేశారు. అదానీ దొంగతనం చేశారంటే మోడీ ఎందుకు భయపడుతున్నాడని, అదానీపై ఈడీ విచారణ జరగాలంటే మోడీ ఎందుకు మౌనంగా ఉంటున్నారన్నారు. ఫిబ్రవరి 7న రాహుల్ గాంధీ మాట్లాడితే.. 16న హైకోర్టులో స్టే తెచ్చుకున్న కేసును ఓపెన్ చేశారన్నారు. ఫిబ్రవరి 27న కిందికోర్టులో కేసు విచారణ మొదలుపెట్టారని, మార్చి 23న రాహుల్ గాంధీకి శిక్ష వేశారన్నారు. కోర్టు రాహుల్ గాంధీకి 30 రోజులు గడువు ఇచ్చిందని, కానీ తెల్లారగానే పార్లమెంటులో రాహుల్ గాంధీని అనర్హత వేటు వేశారన్నారు. డబుల్ ఇంజన్ సర్కార్ అంటే ఒక ఇంజన్ అదానీ… రెండో ఇంజన్ ప్రధాని అంటూ ఆయన విమర్శలు గుప్పించారు. అదానీ ఇంజన్ రిపేరుకు రాగానే ప్రధాని ఇంజన్ పాడైపోయిందని ఆయన ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీ పప్పు అని చెప్పిన బీజేపీకి ఇప్పుడు నిప్పులా కనపడుతున్నాడని, అందుకే నిప్పును అడ్డు తొలగించుకోవాలని మోడీ కుట్ర చేశాడని ఆయన ఆరోపించారు.
Also Read : YCP Leader KSN Raju: ఎమ్మెల్యే రాపాకను ప్రలోభ పెట్టిన మాట వాస్తవమే.. వైసీపీ లీడర్ క్లారిటీ
తాజావార్తలు
-
Kitchen Hacks: ఇలా చేస్తే మీ వంటింట్లోకి చీమలు చచ్చినారావు.. కేవలం 2 నిమిషాల్లో ఇంట్లోనే ఈ నాచురల్ స్ప్రే చేసుకోండిలా!
-
buchi babu: సినిమా హిట్ అయినా ఆ తప్పును ఒప్పుకున్న డైరెక్టర్ బుచ్చిబాబు..
-
India vs Pakistan: అంపైర్లు కూడా భారత్కే సపోర్ట్.. పాక్ క్రికెటర్ సంచలన ఆరోపణలు..
-
TG20 League: ‘హైదరాబాద్ ఈ ఛాంపియన్స్’ ఫైనల్ స్క్వాడ్.. ఇదిగో పూర్తి లిస్ట్..
-
Ragi Burelu: ఆరోగ్యానికి ఆరోగ్యం.. రుచికి రుచి.. సాంప్రదాయ పద్ధతిలో ‘రాగి బూరెలు’ ఎలా చేయాలో తెలుసా?
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!