Revanth Reddy: హైదరాబాద్కి స్వాతంత్రం ఇప్పించిన పార్టీ కాంగ్రెస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మరోసారి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై విరుచుకుపడ్డారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సెప్టెంబర్ 17 పై టీఆర్ఎస్, బీజేపీ లు డ్రామాలు అడుతున్నాయన్నారు. హైదరాబాద్కి స్వాతంత్రం ఇప్పించిన పార్టీ కాంగ్రెస్ అని ఆయన విమర్శించారు. మన పేటెంట్ని గుంజుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. మైనార్టీలకు రక్షణ కల్పిస్తున్నామని కేసీఆర్, మెజారిటీ ప్రజలకు అండగా ఉన్నామని బీజేపీ నాటకాలు అడుతున్నాయన్నారు. ముస్లింలకు వ్యతిరేకంగా జరిగిన పోరాటం కాదు.. రాచరికనికి వ్యతిరేకంగా జరిగిన పోరాటం అని ఆయన అన్నారు. అంతేకాకుండా.. సెప్టెంబర్ 17 2022 – సెప్టెంబర్ 17 2023 వరకు వజ్రోత్సవాలు నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తుందని, తెలంగాణను కేసీఆర్ తెచ్చారని ప్రజల్లో భ్రమ కల్పిస్తున్నారన్నారు. ఉద్యమంలో వాహనాలకు టీజీ ఉంది.. కానీ రాష్ట్రం ఏర్పడిన తరువాత వారి పార్టీకి గుర్తుగా దానిని టీఎస్గా మార్చారన్నారు.
Also Read
- Jagtial: జగిత్యాల జిల్లాలో బీజేపీ vs కాంగ్రెస్ పార్టీల మధ్య సవాళ్లు.. పట్టణంలో పోస్టర్లు కలకలం
- RBI New Currency Notes: ఆర్బీఐ సంచలన ప్లాన్..? పాత కరెన్సీ నోట్లు బ్యాన్..!?
- ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP).. కేంద్రానికి కోర్టు నోటీసులు జారీ..!
- Supreme Court: హైకోర్టులకు సుప్రీంకోర్టు కీలక మార్గదర్శకాలు.. ఆలస్యం వద్దు..!
మనం వచ్చిన తరువాత దానిని టీజీగా మారుస్తామని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. అందే శ్రీ రాసిన జయ జయహే తెలంగాణను రాష్ట్ర విభజన జరిగిన తరువాత దానిని పట్టించుకోలేదన్నారు. కాంగ్రెస్ వచ్చిన తరువాత అందే శ్రీ రాసిన జయ జయహే తెలంగాణను అధికార గీతంగా చేస్తామని రేవంత్ రెడ్డి వెల్లడించారు. టీఆర్ఎస్ సృష్టించిన తెలంగాణ తల్లి కాకుండా.. సబ్బడ్డ వర్గాలకు సంబంధించిన తెలంగాణ తల్లిని గ్రామగ్రామాన విగ్రహాలు ప్రతిష్ఠిస్తామని, పక్క రాష్ట్రాల్లో జాతీయ జెండాతో పాటు రాష్ట్ర ప్రభుత్వంకి ప్రత్యేక ఫ్లాగ్ ఉంటుంది..మనం వచ్చిన తరువాత తెలంగాణ రాష్ట్రానికి కూడా ప్రత్యేక ఫ్లాగ్ రూపొందిస్తామన్నారు రేవంత్ రెడ్డి.
తాజావార్తలు
-
BCCI New Rule: ఐపీఎల్ 2026 క్వాలిఫయర్-2కు ముందు.. కొత్త రూల్ తీసుకొచ్చిన బీసీసీఐ!
-
Jagtial: జగిత్యాల జిల్లాలో బీజేపీ vs కాంగ్రెస్ పార్టీల మధ్య సవాళ్లు.. పట్టణంలో పోస్టర్లు కలకలం
-
RBI New Currency Notes: ఆర్బీఐ సంచలన ప్లాన్..? పాత కరెన్సీ నోట్లు బ్యాన్..!?
-
Explainer: చనిపోయిన తర్వాత భారతీయుల ర*క్తాన్ని తాగుతున్నారు.. వెలుగులోకి భయంకర లెక్కలు!
-
Peddi Team Takes : ఆన్లైన్ టార్గెటెడ్ నెగిటివిటీపై ‘పెద్ది’ టీమ్ లీగల్ యాక్షన్ స్టార్ట్
ట్రెండింగ్
-
షియోమీ నుంచి కొత్త గాడ్జెట్స్ వచ్చేశాయ్.. Xiaomi Watch S5, Smart Band 10 Pro, Buds 6 లాంచ్.!
-
120x AI అల్ట్రా జూమ్ కెమెరాలు, 144Hz AMOLED డిస్ప్లే, 8K వీడియో రికార్డింగ్ వంటి ప్రీమియం ఫీచర్లతో Xiaomi 17T, 17T Pro లాంచ్..
-
AC Tips : ఏసీని పదేపదే ఆన్ చేసి ఆఫ్ చేస్తే ఏమవుతుంది.?
-
భారత్లో Sony BRAVIA 7 II RGB Mini LED 4K టీవీల లాంచ్.. అద్భుత ఫీచర్లతో సరికొత్త సిరీస్.!
-
Dondakaya Roti Pachadi: పల్లీల స్పెషల్ టచ్తో ‘దొండకాయ రోటి పచ్చడి’.. టేస్ట్ చేస్తే లొట్టలేసుకుంటూ తింటారంతే.!