Revanth Reddy : భక్తి ముసుగులో ఒకరు, అభివృద్ధి ముసుగులో మరొకరు రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హాత్ సే హాత్ జోడో పేరిట టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో జగిత్యాల జిల్లా రేవంత్ రెడ్డి పాదయాత్ర కొనసాగుతోంది. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కొండగట్టుకు తక్షణం 500 కోట్లు విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. భక్తి ముసుగులో ఒకరు, అభివృద్ధి ముసుగులో మరొకరు రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని ఆయన ఆరోపించారు. తెలంగాణలోనే ప్రసస్థమైన దేవాలయం కొండగట్టు అని ఆయన అన్నారు. అంజన్న ఆశీర్వాదం తీసుకొని 4 కోట్ల ప్రజలకు మేలు జరిగేలా కోరుకోవడం జరిగిందని, గుడిలో ఉన్న పూజారులను భక్తులను, కొండగట్టు అంజన్నను అబద్ధాల వాగ్ధానాలతో మోసం చేసిన ఘనత సీఎం కేసీఆర్ ది అని రేవంత్ రెడ్డి విమర్శించారు.
Also Read : Kishan Reddy : బాలుడి మృతికి జీహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యమే కారణం
Also Read
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
- Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
- Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
కవిత హనుమాన్ చాలీసా పారాయణ చేసి..125 అడుగుల విగ్రహం కట్టిస్తానని మోసం చేసిందని, తండ్రి, కొడుకు, కూతురు, దేవుళ్లను కూడా మోసం చేశారని ఆయన అన్నారు. 600 సంవత్సరాల చరిత్ర కలిగిన ఆలయాన్ని భక్తులకు ఇబ్బంది కలుగకుండా అభివృద్ధి చేయాలని ఆయన కోరారు. 800 ఎకరాల అటవీ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి కాపాడాలని ఆయన అన్నారు. గతంలో బస్సు ప్రమాదం జరిగి.. 70 మంది చనిపోయారని ఆయన అన్నారు. బస్సు బాధిత కుటుంబాలను ఆదుకునే ప్రయత్నం ప్రభుత్వం చేయలేదని ఆయన మండిపడ్డారు. తూతూ మంత్రంగా ఆర్ధిక సాయం చేశారని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొండగట్టును అభివృద్ధి చేస్తామన్నారు.
Also Read : MLA Jagga Reddy : వీఆర్ఏల డిమాండ్లపై సీఎం కేసీఆర్కు జగ్గారెడ్డి లేఖ
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!