Kishan Reddy : బాలుడి మృతికి జీహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యమే కారణం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కుక్కల జనన నియంత్రణ ఆపరేషన్ కేంద్రాలను హైదరాబాద్ బయట ఏర్పాటు చేయాలన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. సోమవారం ఆయన మాట్లాడుతూ.. అంబర్పేటలో ఉన్న కుక్కలను బయటకు తరలించాలన్నారు. కుక్కల దాడిలో చనిపోయిన బాలుడి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అంతేకాకుండా.. బాలుడి మృతికి జీహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యమే కారణమని, అంబర్పేటలో కుక్కలకు ఆపరేషన్ చేసి వదిలివేయడం కారణంగా వాటి సంఖ్య పెరిగిందని ఆయన అన్నారు.
అంబర్పేట ఘటనలో చనిపోయిన బాలుడు ప్రదీప్కు జీహెచ్ఎంసీ పరిహారం ప్రకటించింది. ప్రదీప్ కుటుంబానికి రూ.8 లక్షలు పరిహారం అందించాలని జీహెచ్ఎంసీ కౌన్సిల్ నిర్ణయించింది. బాలుడి కుటుంబానికి తమ నెల రోజుల వేతనం విరాళంగా ఇవ్వాలని కార్పోరేటర్లు తీర్మానించింది.
Also Read : Manchu Manoj: రాజకీయాల ఆలోచన లేదు, ప్రజా సేవ చెయ్యాలన్న కోరిక వుంది
Also Read
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
- Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
- Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
కాగా.. హైదరాబాద్ అంబర్పేట్కు చెందిన ఐదేళ్ల చిన్నారి ప్రదీప్ తన తండ్రితో కలిసి ఆయన పనిచేసే ప్రాంతానికి వెళ్లాడు. అయితే తండ్రి పనిచేసుకుంటూ వుండటంతో అక్కడికి సమీపంలోనే వున్న అక్క దగ్గరికి నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఇంతలో ఎక్కడి నుంచి వచ్చాయో కానీ మూడు వీధి కుక్కలు.. చిన్నారిని చుట్టుముట్టాయి. అవి అరుస్తూ, దాడి చేస్తుండటంతో బాలుడు భయాందోళనలకు గురయ్యాడు. తప్పించుకునేందుకు ఆ చిన్నారి ఎంతగా ప్రయత్నించినప్పటికీ.. ఫలితం దక్కలేదు. ఆ కుక్కలు చిన్నారిపై దాడి చేస్తూ నోట కరచుకుని దాడి చేశాయి.
Also Read : Sathwik Suicide : కాలేజీ వేధింపుల వల్లే సాత్విక్ ఆత్మహత్య.. రిమాండ్ రిపోర్ట్లో సంచలన విషయాలు
ఇదిలా ఉంటే.. తెలంగాణలో మహిళలపై కొనసాగుతున్న అఘాయిత్యాలకు, అత్యాచారాలకు వ్యతిరేకంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, కరీనంగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో నిరసన దీక్ష చేపట్టారు. ఈటెల రాజేందర్, విజయ శాంతి, అరవింద్ మీనన్, మహిళ కార్పొరేటర్ లు, నేతలు ఈ నిరసన దీక్షలో పాల్గొన్నారు.
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!