ఎన్ని కఠిన చట్టాలొచ్చినా సైబర్ నేరాలు ఆగడం లేదు. ఎక్కడొక చోట మోసాలు జరుగుతూనే ఉంటున్నాయి. తాజాగా థానేలో సెక్స్టార్షన్ కేసు వెలుగు చూసింది. ఒక రిటైర్డ్ ప్రభుత్వ ఇంజనీర్పై మహిళ వలపు వల విసిరింది. అందులో చిక్కుకున్న వృద్ధుడు రూ.4 కోట్లు వదిలించుకున్నాడు. దీంతో బాధితుడు లబోదిబో అంటూ పోలీసులను ఆశ్రయించాడు.