PUBG: ప్రాణం తీసిన పబ్జీ .. మెదడులో రక్తస్రావం జరిగి యువకుడు మృతి
- ప్రాణం తీసిన పబ్జీ
- మెదడులో రక్తస్రావం జరిగి యువకుడు మృతి
- మీరట్లో 22 ఏళ్ల మహ్మద్ కైఫ్ పబ్జీ ఆడుతూ ప్రాణాలు కోల్పోయాడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆన్లైన్ మొబైల్ గేమ్లు ప్రమాదకరమే కాదు ప్రాణాంతకంగా మారాయి. ఆన్లైన్ కొరియన్ డ్రామా గేమ్లో మునిగిపోయిన ముగ్గురు సోదరీమణులు ఘజియాబాద్లోని భారత్ సొసైటీ తొమ్మిదవ అంతస్తు నుండి దూకిన ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. తాజాగా మీరట్లో 22 ఏళ్ల మహ్మద్ కైఫ్ పబ్జీ ఆడుతూ ప్రాణాలు కోల్పోయాడు. ఖైర్నగర్లోని గులార్ వాలి గలిలో నివసిస్తున్న ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి కుమారుడు కైఫ్, ఆన్లైన్ గేమ్ PUBG ఆడుతున్నప్పుడు మెదడు రక్తస్రావంతో తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. వెంటనే కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉండటంతో, అతన్ని ఢిల్లీకి తరలించారు. సఫ్దర్జంగ్ ఆసుపత్రిలో రెండు రోజుల చికిత్స తర్వాత కైఫ్ ఆదివారం మరణించాడు. ఒక్కాగొనక్క కుమారుడు మరణించడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
Also Read:PNB Recruitment 2026: పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో 5,138 పోస్టులు.. జస్ట్ డిగ్రీ ఉంటే చాలు..
Also Read
- V.D. Satheesan: "సతీశన్ అనే నేను".. దశాబ్దం తర్వాత కేరళంలో కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం..
- AP Crime: ఏపీలో దారుణం.. మైనర్ బాలికపై రెండేళ్లుగా అత్యాచారం.. నలుగురిపై కేసు నమోదు
- Pakistan: పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ను గద్దె దించేందుకు అమెరికా కుట్ర.. బయటపడ్డ సంచలన రహస్యాలు!
- Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్..
ఢిల్లీ గేట్లోని ఖైర్నగర్ గులార్ వాలి నివాసి అయిన మహ్మద్ ఫరూఖ్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తు్న్నాడు. కైఫ్ తన తండ్రికి సాయపడుతుంటాడు. శుక్రవారం నాడు, కైఫ్ ఆఫీస్ లో కూర్చుని తన మొబైల్ ఫోన్లో ఆన్లైన్ గేమ్ PUBG ఆడుతున్నాడని ఫరూఖ్ చెప్పాడు. అతను ఇయర్ఫోన్ ధరించి ఉన్నాడు. అకస్మాత్తుగా, కైఫ్ స్పృహ తప్పి పడిపోయాడు. ఆఫీసులో ఉన్నవారు అతన్ని సమీపంలోని వైద్యుడి వద్దకు తీసుకెళ్లారు. అతని రక్తపోటును తనిఖీ చేశారు. అది 300 కంటే ఎక్కువగా ఉంది. కైఫ్ను వెంటనే హోప్ నర్సింగ్ హోమ్లో చేర్చారు. అతని పరిస్థితి విషమంగా ఉండటం చూసి వైద్యులు వెంటనే అతన్ని రిఫర్ చేశారు.
Also Read:Tragedy: కూకట్పల్లిలో విషాదం.. ట్రాన్స్ఫార్మర్పై పడిన పతంగి తీస్తూ బాలుడు విద్యుత్ షాక్
అతని కుటుంబ సభ్యులు అతన్ని ఢిల్లీకి తరలించి సఫ్దర్జంగ్ ఆసుపత్రిలో చేర్చారు. అధిక రక్తపోటు కారణంగా అతని మెదడులోని రక్తనాళం చీలిపోయి అంతర్గత రక్తస్రావం జరిగిందని వైద్యులు నిర్ధారించారు. కైఫ్ను కాపాడే ప్రయత్నాలు రెండు రోజులు కొనసాగాయి. ఆదివారం చికిత్స పొందుతూ కైఫ్ మరణించాడు. కైఫ్ మొబైల్ ఫోన్ తో ఎక్కువ గడిపేవాడని ఆన్లైన్ గేమ్స్ ఆడుతూ తరచుగా వీడియో రీల్స్ కూడా చేసేవాడని తెలిపారు. వద్దని వారించినా వినేవాడు కాదని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
JR NTR : అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా రాకుండానే థియేటర్ వద్ద భారీ కటౌట్.. పాలాభిషేకాలతో ఫ్యాన్స్ రచ్చ
-
Samsung Galaxy M47 5G, F70 Pro 5G: సామ్ సంగ్ మిడ్-రేంజ్ 5G ఫోన్లు విడుదలకు సిద్ధం.. 8GB ర్యామ్
-
Kalki Avatar: కలియుగం ముగింపుకు కౌంట్డౌన్ మొదలైందా? పురాణాలు చెప్పిన భయంకర నిజాలు ఇవే!
-
Rashmika Mandanna: కృతి హాట్నెస్పై రష్మిక బోల్డ్ కామెంట్స్..షాక్ అయిన ఫ్యాన్స్
-
KERALA CM VDS: కేరళ కాంగ్రెస్ చరిత్రలోనే కొత్త శకానికి నాంది.. సీఎంగా VDS ప్రమాణం.. ఇంతకీ ఎవరీ సతీశన్?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..