Lok Sabha Elections 2024: పోలింగ్ సరళిని పరిశీలించేందుకు 23 దేశాల నుండి 75 మంది ప్రతినిధులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్లో ‘లోక్సభ ఎన్నికల’లో జరిగే అతిపెద్ద పండుగను చూసేందుకు 23 దేశాల ఎన్నికల నిర్వహణ సంస్థలతో సంబంధం ఉన్న 75 మంది అంతర్జాతీయ ప్రతినిధులు ఇండియాకు వచ్చారు. ఈ విషయాన్ని ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ వెల్లడించారు. వార్తా సంస్థ ANIతో మాట్లాడుతూ, “మా ఆహ్వానం మేరకు, 23 దేశాల నుండి ఎన్నికల నిర్వహణ సంస్థలతో సంబంధం ఉన్న 75 మంది అంతర్జాతీయ ప్రతినిధులు మా ఎన్నికలను చూసేందుకు ఇక్కడకు రావడం చాలా సంతోషం మరియు సంతృప్తిని కలిగించే విషయం.” అని పేర్కొన్నారు.
Prajwal Revanna: ప్రజ్వల్ రేవణ్ణ ఎంపీగా గెలిచినా వదిలిపెట్టేది లేదు: బీజేపీ
Also Read
- Nikhil Chaudhary: కాటేరమ్మ కొడుకు స్థానంలో నిఖిల్ చౌదరి.. రికార్డు అదిరిపోయింది..
- Meenakshi Natarajan: మీనాక్షి నటరాజన్కు బిగ్ షాక్.. రాజ్యసభ ఆశలు ఆవిరి
- వృద్ధాప్యాన్ని తిప్పికొట్టే 'ER-100' ఇంజెక్షన్.. తొలి రోగికి డోస్ సక్సెస్! ఇక మానవులు అమరులు అవుతారా?
- NITI Aayog Meeting: మోడీ అధ్యక్షతన నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ భారత్పై ఫోకస్
“వివిధ దేశాల నుండి దాదాపు పది మంది ఛైర్పర్సన్లు, ప్రధాన ఎన్నికల కమిషనర్లు ఇండియాకు వచ్చారు. వారు ఐదు నగరాలు, ఐదు రాష్ట్రాలకు వెళుతున్నారు. అక్కడ పోలింగ్ బూత్లను సందర్శించి భారతదేశంలో ప్రజాస్వామ్య పండుగను ఎలా జరుపుకుంటున్నారో చూస్తారన్నారు” రాజీవ్ కుమార్. మరోవైపు.. ఓటర్లు తప్పనిసరిగా ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎన్నికల కమీషనర్ తెలిపారు. ఓటు ప్రతి ఒక్కరి హక్కు, ప్రతి ఒక్కరి బాధ్యత, తాము ప్రజలకు పదేపదే విజ్ఞప్తి చేస్తున్నామని అన్నారు. అయితే.. రెండు దశల్లో ఓటింగ్ శాతం 66 శాతం కంటే ఎక్కువే నమోదైంది. అయితే మూడో దశ, తదుపరి దశల్లో అది కూడా దాటుతుందని రాజీవ్ కుమార్ చెప్పారు.
Thummala: జిల్లాలను రద్దు చేస్తామని సీఎం రేవంత్రెడ్డి అనలేదు
ఇంటర్నేషనల్ ఎలక్షన్ విజిటర్స్ ప్రోగ్రామ్ (IEVP) సంస్థ ద్వారా అంతర్జాతీయ సహకారాన్ని ప్రోత్సహించడాన్ని ఎన్నికల సంఘం కొనసాగిస్తుంది. ఈ క్రమంలో.. భూటాన్, మంగోలియా, ఆస్ట్రేలియా, మడగాస్కర్, ఫిజీ, కిర్గిజ్ రిపబ్లిక్, రష్యా, మాల్దీవులు, ట్యునీషియా, సీషెల్స్, కంబోడియా, నేపాల్, ఫిలిప్పీన్స్, శ్రీలంక, జింబాబ్వే, బంగ్లాదేశ్ వంటి 23 దేశాలు పాల్గొంటున్నాయి. కజకిస్తాన్, జార్జియా, చిలీ, ఉజ్బెకిస్తాన్, మాల్దీవులు, పాపువా న్యూ గినియా మరియు నమీబియా నుండి వివిధ ఎన్నికల నిర్వహణ సంస్థలకు (EMBలు) ప్రాతినిధ్యం వహిస్తున్న 75 మంది ప్రతినిధులు పాల్గొంటారు.
తాజావార్తలు
-
Nikhil Chaudhary: కాటేరమ్మ కొడుకు స్థానంలో నిఖిల్ చౌదరి.. రికార్డు అదిరిపోయింది..
-
Meenakshi Natarajan: మీనాక్షి నటరాజన్కు బిగ్ షాక్.. రాజ్యసభ ఆశలు ఆవిరి
-
వృద్ధాప్యాన్ని తిప్పికొట్టే ‘ER-100’ ఇంజెక్షన్.. తొలి రోగికి డోస్ సక్సెస్! ఇక మానవులు అమరులు అవుతారా?
-
Allu Aravind: ఇప్పుడు లవ్ స్టోరీస్ అన్నిటికీ ఓయోలో ఎండ్ కార్డ్.. అల్లు అరవింద్ సంచలనం
-
NITI Aayog Meeting: మోడీ అధ్యక్షతన నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ భారత్పై ఫోకస్
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!