Bandi Sanjay : ప్రజలే బీజేపీకి భరోసా కల్పిస్తున్నారు.. స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్తో సరికొత్త రికార్డ్ సృష్టించాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం తథ్యమని, ఈ మేరకు ప్రజలే బీజేపీ నాయకులకు భరోసా ఇస్తున్నారని పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు. 18 రోజుల వ్యవధిలో 11 వేల 123 స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లను నిర్వహించి దేశంలోనే సరికొత్త రికార్డు సృష్టించామన్నారు. స్ట్రీట్ కార్నర్ మీటింగ్ సక్సెస్ చేసిన నేపథ్యంలో కేంద్ర మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా సహా అగ్ర నేతలు అభినందించిన విషయాన్ని గుర్తు చేశారు. ఈరోజు పార్టీ రాష్ట్ర కార్యాలయంలో స్ట్రీట్ కార్నర్ మీటింగ్ బాధ్యులు, రాష్ట్ర ఉపాధ్యక్షులు కాసం వెంకటేశ్వర్లుసహా కమిటీ సభ్యులందరినీ బండి సంజయ్ తోపాటు మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలు వనతి శ్రీనివాసన్ ఘనంగా సన్మానించారు.
Also Read : Sathvik Suicide: సాత్విక్ సూసైడ్.. వైరల్ అవుతున్న నాగచైతన్య స్పీచ్
Also Read
- FSSAI: ఎవరెస్ట్, లాల్జీ గోధూ ఇంగువపై బ్యాన్.. ఎగ్, చికెన్, గరం మసాలాల్లో నిబంధనల ఉల్లంఘన..
- Indus Waters Treaty: సింధు జలాలపై భారత్ కఠిన నిర్ణయం.. పాకిస్తాన్ వేడుకోలు..
- Rahul Gandhi: హల్ద్వానీలో ‘శుద్ధీకరణ’ వివాదం.. ఎఫ్ఐఆర్కు రాహుల్ గాంధీ డిమాండ్
- AI in Cinema: సినీ రంగంపై ఏఐ ఎఫెక్ట్.. సెట్లో 20% మనుషులు, 80% AI.. జూనియర్ ఆర్టిస్టుల పరిస్థితి ఏంటి?
ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ బూత్ స్థాయి కార్యకర్త మొదలు జాతీయ కార్యవర్గ సభ్యుల వరకు ప్రతి ఒక్కరూ స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్ లో భాగస్వాములయ్యారన్నారు. ఈ మీటింగ్స్ ద్వారా క్షేత్ర స్థాయిలో ప్రజా సమస్యలపై చర్చించడంతోపాటు కేంద్ర ప్రభుత్వ పథకాలను, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లగలిగామన్నారు. ఈ మీటింగ్ లకు హాజరైన ప్రజలు బీజేపీ అధికారంలోకి రావడం తథ్యమని పార్టీ నాయకులకే భరోసా ఇచ్చారని పేర్కొన్నారు.
Also Read : Sathvik Suicide: సాత్విక్ సూసైడ్.. వైరల్ అవుతున్న నాగచైతన్య స్పీచ్
రాష్ట్ర ఉపాధ్యక్షులు కాసం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ …9,224 శక్తి కేంద్రాలకుగాను 11 వేల 123 స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్ నిర్వహించడం గొప్ప విషయమన్నారు. స్థానిక నేతల్లో సామర్థ్యాన్ని పెంపొందించేందుకు ఈ మీటింగ్స్ ఎంతగానో ఉపయోగపడ్డాయన్నారు. ప్రతి గ్రామంలోనూ కాషాయ జెండాలు రెపరెపలాడాయన్నారు. ప్రారంభ, ముగింపు సభలను ఘనంగా నిర్వహించడంతోపాటు ఈ మీటింగ్స్ భవిష్యత్ కార్యక్రమాలకు మోడల్ గా నిలిచేలా చేయడం ఆనందంగా ఉందన్న్నారు.
తాజావార్తలు
-
FSSAI: ఎవరెస్ట్, లాల్జీ గోధూ ఇంగువపై బ్యాన్.. ఎగ్, చికెన్, గరం మసాలాల్లో నిబంధనల ఉల్లంఘన..
-
Indus Waters Treaty: సింధు జలాలపై భారత్ కఠిన నిర్ణయం.. పాకిస్తాన్ వేడుకోలు..
-
Trivikram Srinivas: అప్పట్లో ‘అజ్ఞాతవాసి’ దెబ్బకు ఇల్లు అమ్మేయాలనుకున్న త్రివిక్రమ్.. అసలేం జరిగిందంటే?
-
Irumudi: అసలు ఇరుముడి అంటే ఏంటి?
-
Rahul Gandhi: హల్ద్వానీలో ‘శుద్ధీకరణ’ వివాదం.. ఎఫ్ఐఆర్కు రాహుల్ గాంధీ డిమాండ్
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!