Hyderabad: హైదరాబాద్ లో మరో రియల్ ఎస్టేట్ సంస్థ మోసం..రూ.100 కోట్లు లూటీ
- ఫ్రీ లాంచ్ పేరుతో కోట్ల రూపాయలు వసూలు
- కొల్లూరు.. మోకిలా..అబ్దుల్లాపూర్ మెట్టు.. యాదాద్రిలో భారీ వెంచర్ల అంటూ ప్రచారం
- మధ్యతరగతి ప్రజలు సాఫ్ట్వేర్ ఉద్యోగుల నుంచి ఇన్వెస్ట్మెంట్ పేరుతో భారీగా పెట్టుబడుల సేకరణ
హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ మోసాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. తక్కువ ధరకే ఇళ్లు..పెట్టుబడిపై అధిక లాభాలు.. ప్రీలాంచ్ ఆఫర్ అంటూ వంద శాతం వసూలు పేరిట రియల్ ఎస్టేట్ మోసాలు ఇటీవలి కాలంలో నగరంలో ఎక్కువ అయ్యాయి. సొంతింటి కల నెరవేర్చుకోవాలనుకునే సామాన్యుడి ఆశను కొందరు బిల్డర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ఏజెంట్లు అడియాసలు చేస్తున్నారు. పైసాపైసా కూడబెట్టుకున్న సొమ్ము, కష్టార్జితాన్ని లూటీ చేస్తున్నారు. డబ్బు వసూలు చేశాక మొహం చాటేయడం, ఏళ్ల తరబడి ప్రాజెక్టులు పూర్తి చేయకపోవడం వంటివి సర్వసాధారణమయ్యాయి. తాజాగా హైదరాబాద్ లో మరో రియల్ ఎస్టేట్ సంస్థ మోసం బయటపడింది. జీఎస్ఆర్ (GSR) ఇన్ఫ్రా గ్రూప్.. ఫ్రీ లాంచ్ పేరుతో కోట్ల రూపాయలు వసూలు చేసింది. కొల్లూరు, మోకిలా, అబ్దుల్లాపూర్ మెట్టు, యాదాద్రిలో భారీ వెంచర్ల అంటూ ప్రచారం చేసింది. సంస్థ ఎండి శ్రీనివాసరావు మధ్యతరగతి ప్రజలు సాఫ్ట్వేర్ ఉద్యోగుల నుంచి ఇన్వెస్ట్మెంట్ పేరుతో భారీగా పెట్టుబడులు సేకరించాడు. 2020 నుంచి డబ్బులు వసూలు చేశాడు. మూడు సంవత్సరాలు అయినా ప్రాజెక్టు కంప్లీట్ చేయకుండా తప్పించుకొని తిరుగుతున్నాడు.
READ MORE: Komatireddy Venkat Reddy: ఉస్మానియా ఆస్పత్రి నిర్మాణంపై మరోసారి అఖిల పక్ష సమావేశం
Also Read
- Software Engineer Suicide: మా కోడలికి ఆరుగురు బాయ్ ఫ్రెండ్స్.. ప్రవర్తన నచ్చకే కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడు.. తండ్రి ఆవేదన.!
- AP Cabinet Key Decisions: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు..
- Ajit Doval: ఢిల్లీలో ఇటలీ రక్షణ మంత్రి పర్యటన.. అజిత్ దోవల్తో సమావేశం
- 3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
వందలాదిమంది బాధితులు నుంచి రూ.100 కోట్ల వరకు వసూలు చేశాడు శ్రీనివాసరావు.. ల్యాండ్ కొనకుండానే డబ్బులు వసూలు చేశాడు. గత మూడు నెలల నుంచి తిరిగి డబ్బులు చెల్లిస్తానంటూ కస్టమర్లకు చెప్పాడు. రెండు నెలల నుంచి కనబడకుండా పోవడంతో హైదరాబాద్ సీసీఎస్ పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేశారు. సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. GSR ఇన్ఫ్రా పై రెండు కేసులు నమోదు చేశారు. అలర్ట్ అయిన సంస్థ ఎండీ హైకోర్టు నుంచి ముందస్తు బెయిల్ తెచ్చుకున్నాడు. బాధితులంతా సీసీఎస్ డీసీపీ శ్వేతను కలిసి కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు.
తాజావార్తలు
-
Motorola Moto G87: 200MP కెమెరా, 5200mAh బ్యాటరీతో మోటో G87 విడుదల
-
Software Engineer Suicide: మా కోడలికి ఆరుగురు బాయ్ ఫ్రెండ్స్.. ప్రవర్తన నచ్చకే కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడు.. తండ్రి ఆవేదన.!
-
AP Cabinet Key Decisions: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు..
-
Ajit Doval: ఢిల్లీలో ఇటలీ రక్షణ మంత్రి పర్యటన.. అజిత్ దోవల్తో సమావేశం
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
ట్రెండింగ్
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!
-
Raw Mango Tomato Roti Pachadi: వేడివేడి అన్నానికి సూపర్ కాంబో “మామిడికాయ టమాటా రోటి పచ్చడి”.!