RBI Decision on UPI Payments: క్రెడిట్ ఉన్న వారికి గుడ్ న్యూస్. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా ఓ శుభవార్త చెప్పింది. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ అంటే UPI ద్వారా క్రెడిట్ కార్డ్ చెల్లింపులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బ్యాంకుల్లో ముందస్తుగా మంజూరైన క్రెడిట్ లైన్లను నిర్వహించడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతించింది. మానిటరింగ్ పాలసీ కమిటీ సమావేశంలో ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ఈ విషయాన్ని ప్రకటించారు. ఏప్రిల్ 6వ తేదీన జరిగిన ఆర్బిఐ సమావేశం అనంతరం గవర్నర్ శక్తికాంత దాస్ మాట్లాడుతూ బ్యాంకుల్లో ముందస్తుగా మంజూరైన క్రెడిట్ లైన్ల నిర్వహణను అనుమతించడం ద్వారా యుపిఐ పరిధిని పెంచుతామన్నారు. ఇది ఆవిష్కరణలను ప్రోత్సహిస్తూ.. కస్టమర్లకు క్రెడిట్ యాక్సెస్ను పెంచుతుందని తెలిపారు. ఆర్బీఐ దీని గురించి మరింత సమాచారాన్ని తర్వాత విడుదల చేస్తుంది.
Read Also:Delhi High Court: బాత్రూంలో స్నానం చేయడం ప్రైవేటు వ్యవహారం.. ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు..
ప్రస్తుతం యూపీఐ బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్ల ద్వారా బదిలీలు జరుగుతున్నాయి. దీనితో పాటు, వాలెట్, ప్రీ-పెయిడ్ కింద డబ్బు లావాదేవీలు కూడా జరుగుతాయి. ప్రస్తుతం యూపీఐలో రూపే క్రెడిట్ కార్డ్ ద్వారా చెల్లింపు కూడా అనుమతించబడింది. ఇప్పుడు ప్రీ-సెక్షన్ క్రెడిట్ లైన్ ఆపరేషన్ సహాయంతో UPI పరిధిని పెంచాలని ప్రతిపాదించబడింది. దీని కింద భారతదేశానికి చెందిన కొన్ని ప్రత్యేకమైన ఉత్పత్తుల అభివృద్ధికి ఇది సహాయపడుతుందని ఆర్బిఐ తెలిపింది. దీనిపై వివరణాత్మక మార్గదర్శకాలను తర్వాత జారీ చేస్తామని ఆర్బీఐ తెలిపింది. దీంతో ఖాతాదారులకు క్రెడిట్ యాక్సెస్ సులభతరం అవుతుందని నిపుణులు భావిస్తున్నారు.
Read Also: YouTube : మీ యూట్యూబ్ ఛానల్ హ్యాక్ అయిందా.. ఓ సారి చెక్ చేసుకోండి ?
రెపో రేటులో ఎలాంటి మార్పు లేదు
2024 ఆర్థిక సంవత్సరానికి ముందు జరిగిన మొదటి ద్రవ్య విధాన సమావేశంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేటును పెంచలేదు. అంటే ప్రజలు ఖరీదైన రుణాల నుండి ఉపశమనం పొందారు. UPI పరిధిని విస్తరించడం నుండి CIBIL స్కోర్ కోసం అన్క్లెయిమ్ పోర్టల్.. సందేశ హెచ్చరికల వరకు సౌకర్యాలు ప్రవేశపెట్టబడ్డాయి.