M. Rajeshwar Rao: డిజిటైజేషన్ దిశగా సహకార బ్యాంకులు పని చేయాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
30 ఏళ్ళ తర్వాత మళ్ళీ విజయవాడ రావటం సంతోషంగా ఉందన్నారు ఆర్బీఐ, , డిప్యూటీ గవర్నర్ ఎమ్. రాజేశ్వరరావు. ఆప్కాబ్ ఆధ్వర్యంలో బ్యాంకర్స్ కాంక్లేవ్ విజయవాడలో జరిగింది. ఈ కాంక్లేవ్ లో రాజేశ్వరరావు మాట్లాడారు. నియంత్రణలు దేశ వ్యాప్తంగా ఓకే రకంగా ఉండాలి. సహకార బ్యాంకులు కూడా విస్తృతంగా ఆర్ధిక సేవలు అందిస్తున్నాయి. ఆర్ధిక విధానాలలో కోఆపరేటివ్ బ్యాంక్ లు సమతౌల్యత పాటిస్తాయి. కోవిడ్ తరువాత సహకార సంస్ధలు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. కోవిడ్ కష్టాల నుంచీ బయట పడటానికి ఆర్బీఐ తగిన చర్యలు తీసుకుందన్నారు.
Read Also: Heavy Rains : న్యూజిలాండ్ను ముంచెత్తిన వర్షాలు.. విమాన సర్వీసులు రద్దు
Also Read
- RCB Vs PBKS: ప్లే ఆఫ్స్కు దూసుకెళ్లిన ఆర్సీబీ.. వరుసగా ఆరో ఓటమి చవిచూసిన పంజాబ్..
- Chickens Die: ఘోర ఘటన.. 3 గంటల్లో 5,300 కోళ్లు మృతి.. కారణం ఏంటంటే..
- Venkatesh Iyer: తమిళనాడు సీఎం విజయ్ స్టైల్ను దించేసిన వెంకటేశ్ అయ్యర్..
- PM Modi: స్వీడన్లో మోడీకి ఘన స్వాగతం.. గ్రిపెన్ ఫైటర్ జెట్ల ఎస్కార్ట్ వైరల్
బ్యాంకుల నిరర్థక ఆస్తులు (NPA) లు 8.7శాతం పెరిగాయి. డిపాజిట్లు 10.5శాతం.. రుణాలు 7.5శాతం పెరిగాయి. స్ధిరమైన అభివృద్ధి సాధించడమే ప్రధాన ఉద్దేశం అన్నారు. బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ లో మార్పులు తీసుకొచ్చాక బ్యాంకుల పనితీరు కూడా మారింది. దీర్ఘకాలిక సమస్యలు తీర్చడానికి ఒక ప్రత్యేక సంస్ధ ఏర్పాటు కావాలి. వెంటనే ప్రతిస్పందించే వ్యవస్ధ చాలా ముఖ్యమైనది. క్యాపిటల్ పెంచడానికి, డిపాజిట్ల సేకరణ చాలా ముఖ్యమైనది. సహకార బ్యాంకులకు క్యాపిటల్ పెంచడం కొంత కష్టతరమే అన్నారు. ఆర్బీఐ ద్వారా అంతర్గత ఆడిట్ విధానం అమలు చేయడం ద్వారా క్వాలిటీ సర్వీసు ఇవ్వవచ్చు. డిజిటైజేషన్ దిశగా సహకార బ్యాంకులు పని చేయాలి. సహకార బ్యాంకులు ఐటీ విధానాలు అభివృద్ధి చేయడం ద్వారా పోటీ ప్రపంచంలో ముందుకెళతాయన్నారు.
అనంతరం అమరావతిలో ముఖ్యమంత్రి జగన్తో భేటీ అయ్యారు నాబార్డు ఛైర్మన్ కె.వి.షాజీ, ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ ఎమ్. రాజేశ్వరరావు. తాడేపల్లి సీఎం జగన్ నివాసంలో మర్యాద పూర్వక భేటీలో పాల్గొన్నారు. సమావేశంలో మచిలీపట్నం ఎంపీ బాలశౌరి కూడా పాల్గొన్నారు.
Read Also: Jairam Ramesh: ప్రతిపక్ష కూటములకు జైరాం ట్విస్ట్.. బీజేపీపై పోరుకి కాంగ్రెసే పెద్ద దిక్కు
తాజావార్తలు
-
Jet Lee OTT Release: సడన్ సర్ప్రైజ్.. ‘జెట్ లీ’ ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్.. స్ట్రీమింగ్ డేట్ ఇదే!
-
RCB Vs PBKS: ప్లే ఆఫ్స్కు దూసుకెళ్లిన ఆర్సీబీ.. వరుసగా ఆరో ఓటమి చవిచూసిన పంజాబ్..
-
Chickens Die: ఘోర ఘటన.. 3 గంటల్లో 5,300 కోళ్లు మృతి.. కారణం ఏంటంటే..
-
Pichi Potta Chicken : నోరూరించే ‘పిచి పొట్టా చికెన్’.. ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్లో ఇలా ఈజీగా చేసుకోండి.!
-
Venkatesh Iyer: తమిళనాడు సీఎం విజయ్ స్టైల్ను దించేసిన వెంకటేశ్ అయ్యర్..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..