Rats Attack: పసికందుపై ఎలుకల గుంపు దాడి…ఎంత దారుణంగా కొరికేశాయంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కుక్కలు దాడి చేసి చంపేసిన ఘటనలు మనం చాలానే చూసుంటాం. అయితే ఎలుకలు దాడి చేసి చంపిన ఘటనలు పెద్దగా మనం చూసి ఉండం, విని ఉండం. అయితే ఆరునెలల పసికందును ఓ ఎలుకల గుంపు కొరికి కొరికి దారుణంగా చంపింది. ఈ ఘటన అగ్రరాజ్యం అమెరికాలో చోటు చేసుకుంది. అయితే దీనికి ప్రధాన కారణం ఇళ్లు పరిశుభ్రంగా లేకపోవడమే. పసికందు చనిపోవడంతో తల్లిదండ్రులపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Also Read: Road Accident: శంషాబాద్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకదానినొకటి ఢీకొట్టిన కంటైనర్, లారీ, కారు
Also Read
ఊయలలో నిద్రిస్తున్న ఆరు నెలల పసికందుపై ఎలుకల గుంపు దాడి చేసింది. మొత్తం 50 సార్లకు పైగా ఆ చిన్నారిని ఎలుకలు కొరికాయి. ఎంతలా ఎలుకలు కరిచాయి అంటే ఆ దాడిలో చిన్నారి ఎముకలు కూడా బయటకు వచ్చేశాయి. ముఖం, కాళ్లు, చేతులు ఇలా శరీరంలోని ప్రతి భాగంపై దాడి చేసి కొరికి తినేశాయి ఆ ఎలుకల గుంపు. ఇంత జరగుతున్న ఎలుకల దాడితో చిన్నారి అరుస్తున్నా ఎవరు రాకపోవడం గమనార్హం. అయితే చాలా సేపటికి అక్కడికి వచ్చిన చిన్నారి తల్లిదండ్రులు రక్తపు మడుగులో పడి ఉన్న బిడ్డను చూసి ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే చిన్నారి మరణించినట్లు డాక్టర్లు నిర్ధారించారు. ఈ ఘటన స్థానిక ఇండియానా (Indiana) ప్రాంతంలో ఆగస్టు 13వ తేదీన చోటు చేసుకుంది. సమాచారం తెలుసుకున్న ఇండియానా పోలీసులు అక్కడి చేరుకొని ఆ ఇంటిని పరిశీలించారు. కుటుంబం నివసించే ఇల్లంతా అపరిశుభ్రంగా ఉన్నట్లు గుర్తించారు. ఇల్లంతా చెత్తాచెదారంతో నిండిపోయి ఉండటంతో అది ఎలుకలకు ఆవాసంగా మారిందని తెలిపారు. కుటుంబంలో చాలా మందిని అనేక సార్లు ఎలుకలు కరిచిన ఆ తల్లిదండ్రులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని పోలీసులు గుర్తించారు. ఆ దంపతులకు చనిపోయిన పసికందు కంటే ముందే నలుగురు పిల్లలు ఉన్నాు. వీరే కాక మరో ఇద్దరు పిల్లలు కూడా వారితో కలిసి ఉంటున్నారు. వారిని కూడా ఎలుకలు కరిచినప్పటికీ ఆ దంపతులు ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. అందుకే ఇళ్లు పరిశుభ్రంగా ఉంచుకోకపోవడం, నిర్లక్ష్యం కారణంగా చిన్నారి ప్రాణాలు కోల్పోయినట్ల భావించిన పోలీసులు దంపతులతో పాటు అక్కడే ఉంటున్న ఓ మహిళను అరెస్ట్ చేశారు. ఈ ఘటన చూస్తుంటే పరిశుభ్రంగా ఉండటం ఎంతో ముఖ్యమో అర్థం అవుతుంది.
- Tags
- Indiana
- Rats Attack
- USA
తాజావార్తలు
-
Story Board : పాస్ పోర్ట్ కేవలం ప్రయాణ పత్రమేనా..? ఇప్పుడు కేంద్రం వాదనేంటి..?
-
OTR: ధర్మవరం రాజకీయాల్లో హీట్… మంత్రి సత్యకుమార్ వ్యూహం మారిందా?
-
OTR : SIR రూల్తో ఓటర్లలో గందరగోళం – ఏ గట్టు ఎంచుకోవాలి?
-
OTR: మంత్రాలయం కోటను బద్దలు కొట్టేందుకు టీడీపీ మాస్టర్ ప్లాన్?
-
YS Jagan : ఏపీలో నడుస్తోంది గూండాల రాజ్యమా?.. చంద్రబాబుపై వైఎస్ జగన్ ఫైర్..
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!