Rats Attack: పసికందుపై ఎలుకల గుంపు దాడి…ఎంత దారుణంగా కొరికేశాయంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కుక్కలు దాడి చేసి చంపేసిన ఘటనలు మనం చాలానే చూసుంటాం. అయితే ఎలుకలు దాడి చేసి చంపిన ఘటనలు పెద్దగా మనం చూసి ఉండం, విని ఉండం. అయితే ఆరునెలల పసికందును ఓ ఎలుకల గుంపు కొరికి కొరికి దారుణంగా చంపింది. ఈ ఘటన అగ్రరాజ్యం అమెరికాలో చోటు చేసుకుంది. అయితే దీనికి ప్రధాన కారణం ఇళ్లు పరిశుభ్రంగా లేకపోవడమే. పసికందు చనిపోవడంతో తల్లిదండ్రులపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Also Read: Road Accident: శంషాబాద్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకదానినొకటి ఢీకొట్టిన కంటైనర్, లారీ, కారు
Also Read
- INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
- CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
- India vs Pakistan: అంపైర్లు కూడా భారత్కే సపోర్ట్.. పాక్ క్రికెటర్ సంచలన ఆరోపణలు..
- TG20 League: 'హైదరాబాద్ ఈ ఛాంపియన్స్' ఫైనల్ స్క్వాడ్.. ఇదిగో పూర్తి లిస్ట్..
ఊయలలో నిద్రిస్తున్న ఆరు నెలల పసికందుపై ఎలుకల గుంపు దాడి చేసింది. మొత్తం 50 సార్లకు పైగా ఆ చిన్నారిని ఎలుకలు కొరికాయి. ఎంతలా ఎలుకలు కరిచాయి అంటే ఆ దాడిలో చిన్నారి ఎముకలు కూడా బయటకు వచ్చేశాయి. ముఖం, కాళ్లు, చేతులు ఇలా శరీరంలోని ప్రతి భాగంపై దాడి చేసి కొరికి తినేశాయి ఆ ఎలుకల గుంపు. ఇంత జరగుతున్న ఎలుకల దాడితో చిన్నారి అరుస్తున్నా ఎవరు రాకపోవడం గమనార్హం. అయితే చాలా సేపటికి అక్కడికి వచ్చిన చిన్నారి తల్లిదండ్రులు రక్తపు మడుగులో పడి ఉన్న బిడ్డను చూసి ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే చిన్నారి మరణించినట్లు డాక్టర్లు నిర్ధారించారు. ఈ ఘటన స్థానిక ఇండియానా (Indiana) ప్రాంతంలో ఆగస్టు 13వ తేదీన చోటు చేసుకుంది. సమాచారం తెలుసుకున్న ఇండియానా పోలీసులు అక్కడి చేరుకొని ఆ ఇంటిని పరిశీలించారు. కుటుంబం నివసించే ఇల్లంతా అపరిశుభ్రంగా ఉన్నట్లు గుర్తించారు. ఇల్లంతా చెత్తాచెదారంతో నిండిపోయి ఉండటంతో అది ఎలుకలకు ఆవాసంగా మారిందని తెలిపారు. కుటుంబంలో చాలా మందిని అనేక సార్లు ఎలుకలు కరిచిన ఆ తల్లిదండ్రులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని పోలీసులు గుర్తించారు. ఆ దంపతులకు చనిపోయిన పసికందు కంటే ముందే నలుగురు పిల్లలు ఉన్నాు. వీరే కాక మరో ఇద్దరు పిల్లలు కూడా వారితో కలిసి ఉంటున్నారు. వారిని కూడా ఎలుకలు కరిచినప్పటికీ ఆ దంపతులు ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. అందుకే ఇళ్లు పరిశుభ్రంగా ఉంచుకోకపోవడం, నిర్లక్ష్యం కారణంగా చిన్నారి ప్రాణాలు కోల్పోయినట్ల భావించిన పోలీసులు దంపతులతో పాటు అక్కడే ఉంటున్న ఓ మహిళను అరెస్ట్ చేశారు. ఈ ఘటన చూస్తుంటే పరిశుభ్రంగా ఉండటం ఎంతో ముఖ్యమో అర్థం అవుతుంది.
- Tags
- Indiana
- Rats Attack
- USA
తాజావార్తలు
-
Carrot Oil : ముఖం గ్లో అవ్వాలా.? క్యారెట్ నూనెతో మెరిసే చర్మం..
-
INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
-
CM Revanth Reddy : సైబరాబాద్కు రూ.1,858 కోట్ల బూస్ట్.. రేపు సీఎం భారీ శంకుస్థాపనలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
-
Kitchen Hacks: ఇలా చేస్తే మీ వంటింట్లోకి చీమలు చచ్చినారావు.. కేవలం 2 నిమిషాల్లో ఇంట్లోనే ఈ నాచురల్ స్ప్రే చేసుకోండిలా!
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!