Rajnath Singh: పాక్ వద్ద అణ్వాయుధాలు సురక్షితమా..? అంతర్జాతీయ జోక్యం అవసరం..!
- శ్రీనగర్కు చేరుకున్న భారత రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్
- “ఆపరేషన్ సిందూర్” అనంతరం చేపట్టిన తొలి పర్యటన
- పాక్ వద్ద అణ్వాయుధాలు సురక్షితమా..?
- అంతర్జాతీయ జోక్యం అవసరం..
Rajnath Singh: భారత రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్ గురువారం ఉదయం జమ్మూ కశ్మీర్లోని శ్రీనగర్కు చేరుకున్నారు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత దళాలు నిర్వహించిన “ఆపరేషన్ సిందూర్” అనంతరం ఆయన చేపట్టిన తొలి పర్యటన ఇది. ఈ పర్యటనలో రక్షణ మంత్రి భారత సాయుధ దళాల సిద్ధతను సమీక్షించారు. పాక్ సరిహద్దుల్లో పడిన షెల్స్ను పరిశీలించారు. అనంతరం శ్రీనగర్ లోని ఆర్మీ 15 కార్ప్స్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించి జవాన్లతో ముచ్చటించారు.
Also Read
- KTR: కాళేశ్వరంపై కాంగ్రెస్ అబద్ధాల కోటలు బద్దలయ్యాయి.. హైకోర్టు తీర్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
- LSG vs RR: టాస్ గెలిచిన లక్నో.. బ్యాటింగ్ ఎవరిదంటే?
- CM Revanth Reddy : పెద్దల చదువుకు పెద్ద పీట.. వయోజనుల్లో అక్షరాస్యత పెంపుపై ప్రత్యేక శ్రద్ధ..
- Tragedy: వయ్యారాలు ఒలకబోస్తూ 5 గురు స్త్రీలు.. ఏకాంతంగా కలిసేందుకు ఆహ్వానాలు.. చివరకు ఇలా..
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ఉగ్రవాద పోరాటంలో ప్రాణత్యాగం చేసిన అమర జవాన్లకు నేను వందనం చేస్తున్నాను. పహల్గాం దాడిలో ప్రాణాలు కోల్పోయిన పౌరులకూ నివాళులు అర్పిస్తున్నాను. గాయపడిన జవాన్లు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని అన్నారు. అలాగే ఆపరేషన్ సిందూర్ను “భారత వైమానిక దళాల అతిపెద్ద ప్రతీకార చర్య”గా అభివర్ణించిన రాజనాథ్ సింగ్, ఉగ్రవాదాన్ని నివారించేందుకు అవసరమైతే ఏ స్థాయికైనా వెళ్లడానికి సిద్ధంగా ఉన్నాం. ఉగ్రవాదులను అక్కడ అడ్డుకోవాలంటే పాకిస్తాన్ ఉగ్రవాదులకు ఆశ్రయం ఇవ్వడం ఆపాలని ఆయన పేర్కొన్నారు.
Read Also: Murder : హైదరాబాద్ నడిబొడ్డున దారుణం.. టీ తాగడానికి వచ్చిన వ్యక్తి నడిరోడ్డుపై హత్య
ఈ సందర్బంగా ఆయన ఓ ప్రశ్నను లేవనెత్తారు. “పాకిస్తాన్ వద్ద అణ్వాయుధాలు సురక్షితంగా ఉన్నాయా?” అని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలతో ఆయన అంతర్జాతీయ సమాజం జోక్యం అవసరమని సూచించారు. ఇటీవల పాక్ సాయుధ దళాలు భారత ఎయిర్ఫోర్స్ స్థావరాలపై దాడి ప్రయత్నం చేశాయి. పంజాబ్ లోని ఆదంపూర్ ఎయిర్బేస్ లక్ష్యంగా పాక్ జేఎఫ్-17 యుద్ధవిమానాల నుంచి హైపర్సోనిక్ క్షిపణులు ప్రయోగించినట్లు పేర్కొంది. అయితే, భారత్ ఈ ఆరోపణలను ఖండించింది.
తాజావార్తలు
-
Earthquake: గుజరాత్లో భూకంపం.. ఆందోళనలో ప్రజలు!
-
PM Modi: ప్రధాని మోడీపై సంచలన వ్యాఖ్యలు.. మల్లికార్జున్ ఖర్గేకు ఎన్నికల సంఘం నోటీసులు
-
Donald Trump: గుడ్న్యూస్ చెప్పిన డొనాల్డ్ ట్రంప్.. ఈ శుక్రవారంతో అంతా ఫైనల్..
-
World Cup 2011: అందుకే 2011 వరల్డ్ కప్లో రోహిత్ శర్మను తీసుకోలేదు.. ‘నన్ను క్షమించు’: శ్రీకాంత్
-
Niharika Konidela: వరుణ్ – లావణ్యల ‘సీక్రెట్’ లవ్ స్టోరీ.. అసలు విషయం బయటపెట్టిన నిహారిక!
ట్రెండింగ్
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?