Yash Birthday: హీరో యశ్ పుట్టినరోజు వేడుకల్లో విషాదం.. ముగ్గురు అభిమానులు మృతి!
3 Fans of Yash Died in Karnataka while putting up a banner: కన్నడ హీరో యశ్ పుట్టినరోజు వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది. కేజీయఫ్ హీరో యశ్కు సోమవారం ఉదయం బ్యానర్ ఏర్పాటు చేస్తుండగా.. విద్యుదాఘాతానికి గురై ముగ్గురు అభిమానులు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ విషాద ఘటన కర్ణాటకలోని గడగ్ జిల్లాలో చోటుచేసుకుంది. ఈ ఘటన అందరిని దిగ్భ్రాంతికి గురి చేసింది. ప్రాణాలు కోల్పోయిన వారికి ప్రభుత్వం ఆర్థిక సహాయం చేయాలని బాధిత కుటుంబ సభ్యులు మరియు స్నేహితులు అభ్యర్థిస్తున్నారు.
యశ్ నేడు 38వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. తన బర్త్డే నేపథ్యంలో యశ్ జనవరి 5న ఓ పోస్ట్ చేశారు. ‘ఫాన్స్ నా పుట్టినరోజు కోసం ఎదురుచూస్తున్నారని తెలుసు. నన్ను కలిసి విషెస్ చెప్పాలని ఆశపడుతున్నారు. మీతో కలిసి సమయాన్ని గడపడం నాకు అత్యంత విలువైన వాటిలో ఒకటి. అయితే జనవరి 8న నేను అందుబాటులో ఉండను. మనం మరో రోజు కలుద్దాం. ప్రత్యక్షంగా మిమ్మల్ని కలవలేకపోయినా.. మీ అందరి శుభాకాంక్షలు నా హృదయానికి చేరతాయి’ అని యశ్ ట్వీట్ చేశారు.
Also Read
- Petrol, Diesel Price: భారీగా పెరిగిన ఎల్పీజీ సిలిండర్ ధరలు.. పెట్రోల్, డీజిల్ పెరుగుదలపై కేంద్రం క్లారిటీ!
- Bitter Gourd Chips Recipe: కారం కారంగా కరకరలాడే కాకరకాయ చిప్స్.. చేదు లేకుండా ఇంట్లోనే సులభంగా తయారు చేసే ప్రత్యేక రెసిపీ..
- AP Student Suicide in US: అమెరికాలో కర్నూలు యువకుడు ఆత్మహత్య.. పిస్టల్తో కాల్చుకుని..
- Veggie Frittata Recipe: హెల్తీ అండ్ టేస్టీ.. లంచ్ బాక్స్లోకి కమ్మని 'వెజ్జీ ఫ్రిటాటా'.. తింటే పిల్లలు అస్సలు వదలరు!
Also Read: Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్కు కొత్త ఆరోగ్య సమస్య.. ఐపీఎల్ 2024కు దూరం!
యశ్ అసలు పేరు నవీన్ కుమార్ గౌడ. 1986 జనవరి 8న కర్ణాటకలోకి బూవనహళ్లి అనే గ్రామంలో జన్మించారు. నటనపై ఉన్న ఇష్టంతో ఇండస్ట్రీలోకి వచ్చి చాలా కష్టపడ్డారు. 2000లలో అనేక టెలివిజన్ సీరియల్స్లో నటించారు. 2007లో ‘జంబడ హుడుగి’ సినిమాతో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. రాకీ, గూగ్లీ, మిస్టర్ అండ్ మిస్ రామాచారి సినిమాలతో తనకంటూ స్థానం సంపాదించుకున్నారు. ఇక కేజీఎఫ్ సిరీస్తో పాన్ ఇండియా స్టార్ అయ్యారు. ప్రస్తుతం మలయాళ దర్శకురాలు గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో టాక్సిక్ సినిమా చేస్తున్నారు. ఇందులో సాయి పల్లవి కథానాయికగా కనిపించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అలానే బాలీవుడ్ హీరోయిన్ కరీనా కపూర్ కీలక పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది.
తాజావార్తలు
-
Petrol, Diesel Price: భారీగా పెరిగిన ఎల్పీజీ సిలిండర్ ధరలు.. పెట్రోల్, డీజిల్ పెరుగుదలపై కేంద్రం క్లారిటీ!
-
Bitter Gourd Chips Recipe: కారం కారంగా కరకరలాడే కాకరకాయ చిప్స్.. చేదు లేకుండా ఇంట్లోనే సులభంగా తయారు చేసే ప్రత్యేక రెసిపీ..
-
Shruti Haasan : హీరోయిన్గా కంటే ఐటంగర్ల్గా ఎక్కువ సంపాదిస్తున్న శృతి
-
AP Student Suicide in US: అమెరికాలో కర్నూలు యువకుడు ఆత్మహత్య.. పిస్టల్తో కాల్చుకుని..
-
Jason Holder: కేజీ నా దగ్గరే ఉన్నాడు.. రజత్ పాటీదార్ వివాదాస్పద క్యాచ్పై స్పందించిన హోల్డర్!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!