Asia Cup 2023: ఇండియా వర్సెస్ నేపాల్ మ్యాచ్ ను కూడా వదలని వరుణుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆసియా కప్ 2023 టోర్నీని వర్షం వదిలిపెట్టడం లేదు. ఇండియా – పాకిస్తాన్ మధ్య జరగాల్సిన మ్యాచ్ వరుణుడి దెబ్బకు ఫలితం తేలకుండా రద్దు కాగా, ఇండియా- నేపాల్ మ్యాచ్ని కూడా వాన అడ్డుకుంది. వర్షం కారణంగా మ్యాచ్ నిలిచే సమయానికి 37.5 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయిన నేపాల్ 178 పరుగులు చేసింది.
Read Also: Pro Pak Slogans: అసెంబ్లీలో పాకిస్థాన్ అనుకూల నినాదాలు.. నేడు సుప్రీంకోర్టులో చుక్కెదురు
Also Read
- Shreyas Iyer: రేపటి మ్యాచ్కు మా స్ట్రాటజీ ఇదే.. మమ్మల్ని ఎవరూ ఆపలేరు: శ్రేయస్ అయ్యర్
- Rahul Gandhi: 'ప్రభుత్వాన్ని తొలగించండి' అని పోలీసులు నా చెవిలో చెప్పారు: రాహుల్ గాంధీ
- Niti Aayog: నీతి ఆయోగ్ కొత్త సీఈవోగా అనురాగ్ జైన్ నియామకం.. కేంద్రం ఉత్తర్వులు
- Cab Driver: నమ్మించి వంచించాడు.. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఎయిర్లైన్స్ ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ దాడి..
అయితే, టాస్ ఓడి బ్యాటింగ్ స్టార్ట్ చేసిన నేపాల్ జట్టుకి భారత ఫీల్డర్ల చెత్త ఫీల్డింగ్ బాగా కలిసి వచ్చింది. మొదటి 5 ఓవర్లలో టీమిండియా ఫీల్డర్లు 3 గోల్డెన్ క్యాచ్ లను డ్రాప్ చేశారు. దీన్ని వాడుకున్న నేపాల్ ఓపెనర్లు 9.5 ఓవర్లలో తొలి వికెట్కి 65 పరుగుల భాగస్వామ్యం జత చేశారు. కుశాల్ బుర్టెల్ ( 25 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 38 పరుగులు ) శార్దూల్ ఠాకూర్ బౌలింగ్లో ఇషాన్ కిషన్కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాట పట్టాడు. భీం శక్తి ( 17 బంతుల్లో 7 పరుగులు )ని రవీంద్ర జడేజా క్లీన్ బౌల్డ్ చేయగా.. నేపాల్ కెప్టెన్ రోహిత్ పాడెల్ ( 8 బంతుల్లో 5 పరుగులు ) ను కూడా జడ్డూ బౌలింగ్లో రోహిత్ శర్మకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు..
Read Also: Viral Video : ఇదేం అభిమానం సామి.. పెళ్లిలో పార్టీ కండువాలు మార్చుకున్న కొత్త జంట..
ఇక, కుశాల్ మల్ల ( 5 బంతుల్లో 2 పరుగులు )ను సైతం జడ్డూ బౌలింగ్లో మహ్మద్ సిరాజ్కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో నేపాల్ జట్టు వెంటవెంటనే 3 వికెట్లు కోల్పోయింది. 65/0 స్థితిలో ఉన్న నేపాల్ టీమ్ 101/4 స్థితికి చేరుకుంది. ఓ వైపు వికెట్లు పడుతున్నా మరో ఎండ్లో కుదురుకుపోయిన ఓపెనర్ ఆసిఫ్ షేక్ ( 97 బంతుల్లో 8 ఫోర్లతో 58 పరుగులు ) హాఫ్ సెంచరీ చేశాడు. హాఫ్ సెంచరీ తర్వాత సిరాజ్ బౌలింగ్లో విరాట్ కోహ్లీకి క్యాచ్ ఇచ్చి ఆసిఫ్ అవుట్ అయ్యాడు. గుల్షాన్ జా ( 35 బంతుల్లో 3 ఫోర్లతో 23 పరుగులు ) కూడా మహ్మద్ సిరాజ్ బౌలింగ్లోనే ఇషాన్ కిషన్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాట పట్టాడు.
Read Also: Sagileti katha: అందుకే ‘సగిలేటి కథ’ పోస్టర్స్ కి సూపర్ రెస్పాన్స్!
144 పరుగులకు నేపాల్ టీమ్ ఆరో వికెట్లు కోల్పోయింది. వర్షం కారణంగా ఆట నిలిచే సమయానికి దీపేంద్ర సింగ్ ఆరీ ( 20 బంతుల్లో 3 ఫోర్లతో 27 పరుగులు ), సోమ్పాల్ కమీ (20 బంతుల్లో ఓ ఫోర్తో 11 పరుగులు) క్రీజులో ఉన్నారు. ఈ ఇద్దరూ ఇప్పటికే ఏడో వికెట్కి 36 బంతుల్లో 34 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.
తాజావార్తలు
-
Shreyas Iyer: రేపటి మ్యాచ్కు మా స్ట్రాటజీ ఇదే.. మమ్మల్ని ఎవరూ ఆపలేరు: శ్రేయస్ అయ్యర్
-
Rahul Gandhi: ‘ప్రభుత్వాన్ని తొలగించండి’ అని పోలీసులు నా చెవిలో చెప్పారు: రాహుల్ గాంధీ
-
Story Board : దేశ ప్రజల స్వరం మారుతోంది..కేంద్రంపై అసంతృప్తి ,ఆవేశం మరింత రాజుకుంటే…
-
Criminal Lawyer: కోర్టులో లాయర్.. బయట గంజాయి స్మగ్లర్! పుష్ప స్టైల్లో స్మగ్లింగ్..
-
TG-AP THEFTS: తెలుగు రాష్ట్రాల్లో రెచ్చిపోయిన దోపిడీ దొంగలు.. నిమిషాల్లోనే ఎలా చక్కబెట్టారంటే..!
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!