Pro Pak Slogans: అసెంబ్లీలో పాకిస్థాన్ అనుకూల నినాదాలు.. నేడు సుప్రీంకోర్టులో చుక్కెదురు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pro Pak Slogans: 2018లో నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు మహ్మద్ అక్బర్ లోన్ జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో ‘పాకిస్తాన్ జిందాబాద్’ అనే నినాదాన్ని లేవనెత్తారు. ఈ పెద్ద వివాదం తర్వాత ఐదేళ్ల తర్వాత, సుప్రీంకోర్టు సోమవారం మహ్మద్ అక్బర్ లోన్ను భారత రాజ్యాంగానికి విధేయతగా ప్రమాణం చేసి, దేశ సార్వభౌమత్వాన్ని అంగీకరిస్తూ అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. భారత రాజ్యాంగానికి విధేయత చూపుతున్నట్లు లిఖితపూర్వకంగా ప్రమాణం చేయాలని మహ్మద్ అక్బర్ లోన్ను ధర్మాసనం కోరింది. 2018లో జమ్మూకశ్మీర్ అసెంబ్లీలో పాకిస్థాన్ అనుకూల నినాదాలు చేశాడని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఆరోపించడంతో సుప్రీంకోర్టు చర్యలకు పూనుకుంది.
Also Read: Omar Abdullah: ప్రాంతీయ పార్టీలను తుడిచిపెట్టేందుకే జమిలి ఎన్నికలు..
Also Read
- Off The Record: తెలంగాణ బీజేపీలో 'నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్'
- NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
- Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
- Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
ఆర్టికల్ 370 రద్దు ప్రధాన పిటిషనర్ అయి అక్బర్ లోన్ మంగళవారం నాటికి అఫిడవిట్ దాఖలు చేయనున్నారు. చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనానికి సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ ఈ విషయాన్ని తెలియజేశారు. బెంచ్ కోరిన అఫిడవిట్ను దాఖలు చేయకపోతే ఆయన తరపున వాదించబోనని సీనియర్ లాయర్ తెలిపారు. అక్బర్ లోన్ తరపున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ తన వాదనలు వినిపిస్తూ, ‘ఆయన లోక్సభ ఎంపీ. అతను భారత పౌరుడు, రాజ్యాంగం సూచించిన విధంగా ప్రమాణ స్వీకారం చేశారు. భారత సార్వభౌమత్వాన్ని అంగీకరిస్తున్నట్లు సిబల్ చెప్పారు. అదే సమయంలో దీనికి ఒక రోజు ముందు, కేంద్రం తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, ‘పాకిస్తాన్ జిందాబాద్’ అనే నినాదాన్ని లేవనెత్తినందుకు అక్బర్ లోన్ క్షమాపణలు చెప్పాలని కేంద్ర ప్రభుత్వం కోరుతున్నట్లు ధర్మాసనానికి తెలిపారు.
Also Read: TMC: ఇండియా కూటమికి ఎలాంటి సంబంధం లేదు.. ఉదయనిధి ‘సనాతన ధర్మ’ వ్యాఖ్యపై తృణమూల్
అక్బర్ లోన్కు రాజ్యాంగం పట్ల విధేయత ఉందని అంగీకరించాలంటే, సభలో నినాదాలు చేసినందుకు క్షమాపణలు చెప్పాలని లా ఆఫీసర్ అన్నారు. సెప్టెంబర్ 1న, కాశ్మీరీ పండిట్ గ్రూప్ అక్బర్ లోన్ వేర్పాటువాద శక్తులకు మద్దతుదారుడని పేర్కొంటూ, అతని అర్హతలను ప్రశ్నిస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ‘రూట్స్ ఇన్ కాశ్మీర్’ అనే ఎన్జీవో సుప్రీం కోర్టులో జోక్యానికి దరఖాస్తు చేసింది.
తాజావార్తలు
-
Lionel Messi:19ఏళ్ల క్రితం మెస్సీ చేతుల్లో పెరిగిన బుడతడు.. ఇప్పుడు ప్రపంచకప్ ఫైనల్లో అతడికే సవాల్ విసురుతున్న చిచ్చరపిడుగు!
-
Vrushakarma OTT Deal: థియేటర్లకు ముందే ‘వృషకర్మ’ సంచలనం.. నాగ చైతన్య కెరీర్లోనే అతిపెద్ద డీల్ ఇదేనా?
-
Argentina vs England 2026: ఇంగ్లాండ్పై అర్జెంటీనా సంచలన విజయం.. వరుసగా రెండోసారి ఫిఫా ప్రపంచకప్ ఫైనల్లోకి
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!