Pro Pak Slogans: అసెంబ్లీలో పాకిస్థాన్ అనుకూల నినాదాలు.. నేడు సుప్రీంకోర్టులో చుక్కెదురు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pro Pak Slogans: 2018లో నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు మహ్మద్ అక్బర్ లోన్ జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో ‘పాకిస్తాన్ జిందాబాద్’ అనే నినాదాన్ని లేవనెత్తారు. ఈ పెద్ద వివాదం తర్వాత ఐదేళ్ల తర్వాత, సుప్రీంకోర్టు సోమవారం మహ్మద్ అక్బర్ లోన్ను భారత రాజ్యాంగానికి విధేయతగా ప్రమాణం చేసి, దేశ సార్వభౌమత్వాన్ని అంగీకరిస్తూ అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. భారత రాజ్యాంగానికి విధేయత చూపుతున్నట్లు లిఖితపూర్వకంగా ప్రమాణం చేయాలని మహ్మద్ అక్బర్ లోన్ను ధర్మాసనం కోరింది. 2018లో జమ్మూకశ్మీర్ అసెంబ్లీలో పాకిస్థాన్ అనుకూల నినాదాలు చేశాడని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఆరోపించడంతో సుప్రీంకోర్టు చర్యలకు పూనుకుంది.
Also Read: Omar Abdullah: ప్రాంతీయ పార్టీలను తుడిచిపెట్టేందుకే జమిలి ఎన్నికలు..
Also Read
- Shehbaz Sharif: ఇరాన్ అధ్యక్షుడి టూర్లో పాక్ ప్రధాని వింత ప్రవర్తన.. నెట్టింట తీవ్ర విమర్శలు
- PoK: పీఓకే ప్రజల్ని ఆకలితో చంపేస్తున్న పాకిస్తాన్..
- CM Revanth Reddy: చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచే రోజు ఇది.. జల వివాదాలకు శాశ్వత పరిష్కారం..!
- Vaibhav Sooryavanshi: పక్కా ప్లాన్తో బరిలోకి వైభవ్ సూర్యవంశీ.. కాటేరమ్మ కొడుకు రికార్డుపైనే గురి..
ఆర్టికల్ 370 రద్దు ప్రధాన పిటిషనర్ అయి అక్బర్ లోన్ మంగళవారం నాటికి అఫిడవిట్ దాఖలు చేయనున్నారు. చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనానికి సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ ఈ విషయాన్ని తెలియజేశారు. బెంచ్ కోరిన అఫిడవిట్ను దాఖలు చేయకపోతే ఆయన తరపున వాదించబోనని సీనియర్ లాయర్ తెలిపారు. అక్బర్ లోన్ తరపున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ తన వాదనలు వినిపిస్తూ, ‘ఆయన లోక్సభ ఎంపీ. అతను భారత పౌరుడు, రాజ్యాంగం సూచించిన విధంగా ప్రమాణ స్వీకారం చేశారు. భారత సార్వభౌమత్వాన్ని అంగీకరిస్తున్నట్లు సిబల్ చెప్పారు. అదే సమయంలో దీనికి ఒక రోజు ముందు, కేంద్రం తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, ‘పాకిస్తాన్ జిందాబాద్’ అనే నినాదాన్ని లేవనెత్తినందుకు అక్బర్ లోన్ క్షమాపణలు చెప్పాలని కేంద్ర ప్రభుత్వం కోరుతున్నట్లు ధర్మాసనానికి తెలిపారు.
Also Read: TMC: ఇండియా కూటమికి ఎలాంటి సంబంధం లేదు.. ఉదయనిధి ‘సనాతన ధర్మ’ వ్యాఖ్యపై తృణమూల్
అక్బర్ లోన్కు రాజ్యాంగం పట్ల విధేయత ఉందని అంగీకరించాలంటే, సభలో నినాదాలు చేసినందుకు క్షమాపణలు చెప్పాలని లా ఆఫీసర్ అన్నారు. సెప్టెంబర్ 1న, కాశ్మీరీ పండిట్ గ్రూప్ అక్బర్ లోన్ వేర్పాటువాద శక్తులకు మద్దతుదారుడని పేర్కొంటూ, అతని అర్హతలను ప్రశ్నిస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ‘రూట్స్ ఇన్ కాశ్మీర్’ అనే ఎన్జీవో సుప్రీం కోర్టులో జోక్యానికి దరఖాస్తు చేసింది.
తాజావార్తలు
-
Shehbaz Sharif: ఇరాన్ అధ్యక్షుడి టూర్లో పాక్ ప్రధాని వింత ప్రవర్తన.. నెట్టింట తీవ్ర విమర్శలు
-
PoK: పీఓకే ప్రజల్ని ఆకలితో చంపేస్తున్న పాకిస్తాన్..
-
Bunny Vas : తెలుగుమ్మాయని అవకాశం ఇస్తే.. మాకు 15 రూల్స్ పెట్టింది.
-
CM Revanth Reddy: చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచే రోజు ఇది.. జల వివాదాలకు శాశ్వత పరిష్కారం..!
-
Vaibhav Sooryavanshi: పక్కా ప్లాన్తో బరిలోకి వైభవ్ సూర్యవంశీ.. కాటేరమ్మ కొడుకు రికార్డుపైనే గురి..
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!