Pro Pak Slogans: అసెంబ్లీలో పాకిస్థాన్ అనుకూల నినాదాలు.. నేడు సుప్రీంకోర్టులో చుక్కెదురు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pro Pak Slogans: 2018లో నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు మహ్మద్ అక్బర్ లోన్ జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో ‘పాకిస్తాన్ జిందాబాద్’ అనే నినాదాన్ని లేవనెత్తారు. ఈ పెద్ద వివాదం తర్వాత ఐదేళ్ల తర్వాత, సుప్రీంకోర్టు సోమవారం మహ్మద్ అక్బర్ లోన్ను భారత రాజ్యాంగానికి విధేయతగా ప్రమాణం చేసి, దేశ సార్వభౌమత్వాన్ని అంగీకరిస్తూ అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. భారత రాజ్యాంగానికి విధేయత చూపుతున్నట్లు లిఖితపూర్వకంగా ప్రమాణం చేయాలని మహ్మద్ అక్బర్ లోన్ను ధర్మాసనం కోరింది. 2018లో జమ్మూకశ్మీర్ అసెంబ్లీలో పాకిస్థాన్ అనుకూల నినాదాలు చేశాడని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఆరోపించడంతో సుప్రీంకోర్టు చర్యలకు పూనుకుంది.
Also Read: Omar Abdullah: ప్రాంతీయ పార్టీలను తుడిచిపెట్టేందుకే జమిలి ఎన్నికలు..
Also Read
- Dubai: విమానంలో ఫోటోలు తీస్తే 10 ఏళ్ల జైలా? దుబాయ్ కోర్టు సంచలన తీర్పు..
- Fatima Sana: మహిళల క్రికెట్లో అరుదైన రికార్డు.. 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ.!
- Astrology: మే 16 శనివారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని ధన లాభం...!
- Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
ఆర్టికల్ 370 రద్దు ప్రధాన పిటిషనర్ అయి అక్బర్ లోన్ మంగళవారం నాటికి అఫిడవిట్ దాఖలు చేయనున్నారు. చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనానికి సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ ఈ విషయాన్ని తెలియజేశారు. బెంచ్ కోరిన అఫిడవిట్ను దాఖలు చేయకపోతే ఆయన తరపున వాదించబోనని సీనియర్ లాయర్ తెలిపారు. అక్బర్ లోన్ తరపున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ తన వాదనలు వినిపిస్తూ, ‘ఆయన లోక్సభ ఎంపీ. అతను భారత పౌరుడు, రాజ్యాంగం సూచించిన విధంగా ప్రమాణ స్వీకారం చేశారు. భారత సార్వభౌమత్వాన్ని అంగీకరిస్తున్నట్లు సిబల్ చెప్పారు. అదే సమయంలో దీనికి ఒక రోజు ముందు, కేంద్రం తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, ‘పాకిస్తాన్ జిందాబాద్’ అనే నినాదాన్ని లేవనెత్తినందుకు అక్బర్ లోన్ క్షమాపణలు చెప్పాలని కేంద్ర ప్రభుత్వం కోరుతున్నట్లు ధర్మాసనానికి తెలిపారు.
Also Read: TMC: ఇండియా కూటమికి ఎలాంటి సంబంధం లేదు.. ఉదయనిధి ‘సనాతన ధర్మ’ వ్యాఖ్యపై తృణమూల్
అక్బర్ లోన్కు రాజ్యాంగం పట్ల విధేయత ఉందని అంగీకరించాలంటే, సభలో నినాదాలు చేసినందుకు క్షమాపణలు చెప్పాలని లా ఆఫీసర్ అన్నారు. సెప్టెంబర్ 1న, కాశ్మీరీ పండిట్ గ్రూప్ అక్బర్ లోన్ వేర్పాటువాద శక్తులకు మద్దతుదారుడని పేర్కొంటూ, అతని అర్హతలను ప్రశ్నిస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ‘రూట్స్ ఇన్ కాశ్మీర్’ అనే ఎన్జీవో సుప్రీం కోర్టులో జోక్యానికి దరఖాస్తు చేసింది.
తాజావార్తలు
-
Dubai: విమానంలో ఫోటోలు తీస్తే 10 ఏళ్ల జైలా? దుబాయ్ కోర్టు సంచలన తీర్పు..
-
Fatima Sana: మహిళల క్రికెట్లో అరుదైన రికార్డు.. 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ.!
-
Quadruplet Delivery: అరుదైన ఘటన.. 5 రోజుల వ్యవధిలో నలుగురు శిశువులకు జన్మనిచ్చిన మహిళ
-
Peddi: ముంబై వేదికగా..‘పెద్ది’ Vs ‘డ్రాగన్’ క్లాష్
-
CSK Playoff Chances: ఇక మిగిలింది రెండు మ్యాచ్లే.. చెన్నై ప్లేఆఫ్స్ చేరుతుందా? సమీకరణాలు ఇవే..
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..