Mumbai Rains: ముంబైలో వర్ష బీభత్సం. కుప్పకూలిన ఓ భవనం.. నలుగురు సేఫ్.. మరో ఇద్దరి కోసం గాలింపు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mumbai Rains: దేశ ఆర్థిక రాజధాని ముంబైలో వర్షాలు దంచికొడుతున్నాయి. శనివారం నుంచి మహానగరంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఆదివారం ఘట్కోపర్ ప్రాంతంలో ఓ భవనంలో కొంతభాగం కుప్పకూలింది. దీంతో చాలా వరకు ఆస్తినష్టం వాటిల్లింది. అంతేకాకుండా శిథిలాల కింద ఆరుగురు చిక్కుకున్నారు. సకాలంలో సంఘటనా స్థలానికి చేరుకున్న ఎన్డీఆర్ఎఫ్ బృందాలు నలుగురిని సురక్షితంగా బయటకు తీశారు. వెంటనే వారిని ప్రథమ చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. శిథిలాల కింద మరికొంత మంది చిక్కుకుని ఉండొచ్చని అధికారులు తెలుపుతున్నారు. అందులో వృద్ధ దంపతులు కూడా ఉన్నట్లు సమాచారం తెలుస్తోంది. దీంతో వెంటనే శిథిలాల కింద కాపాడేందుకు NDRF బృందాలు సహాయక చర్యలు ప్రారంభించాయి.
Read Also: GVL Narasimha Rao: బీజేపీ స్పెషల్ ఫోకస్ పెట్టింది.. జనసేనతో పొత్తు ఉంది
Also Read
- KBR Park Video : కేబీఆర్ పార్క్ చుట్టూ జీహెచ్ఎంసీ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. వీడియో రిలీజ్.!
- PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
- Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
- Shreyas Iyer: మా ఓటమికి కారణం ఆ ఇద్దరే.. అస్సలు ఊహించలేదంటూ ఆవేదన వ్యక్తం చేసిన శ్రేయస్..
ఆదివారం తెల్లవారుజామున కురిసిన వర్షానికి మూడంతస్తుల భవనంలో చాలా భాగం ఒక్కసారిగా కుప్పకూలింది. ఎవరూ బయటకు వెళ్లేందుకు అవకాశం లేకపోవడంతో తమను తాము రక్షించుకునే క్రమంలో శిథిలాల కింద చిక్కుకున్నట్లు NDRF తెలిపింది. సమాచారం అందుకున్న బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు.. ఈ ప్రమాదంలో భవనంలో ఉన్న చాలా మంది శిథిలాల కింద సమాధి అయ్యారని చెప్పారు. వీరిలో నలుగురిని సురక్షితంగా బయటకు తీశారు.
Read Also: Somu Veerraju: మేము సర్జికల్ స్ట్రైక్స్ చేస్తే.. వాళ్లు బాంబ్లు వేసుకుంటారు
శిథిలాల కింది మరికొంత మంది చిక్కుకుని ఉండొచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే NDRF బృందాలు వారిని వెతకడానికి మరియు రక్షించడానికి ఆపరేషన్ను ముమ్మరం చేశాయి. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రస్తుతం NDRF యొక్క 3 బృందాలు రెస్క్యూ ఆపరేషన్లో నిమగ్నమై ఉన్నాయి. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఈ ఘటన ఉదయం 9.33 గంటలకు జరిగింది. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది మొదటి స్ధలానికి చేరుకున్నారు. పరిస్థితిని గమనించిన బృందం ఉన్నతాధికారులకు సమాచారం అందించింది. అనంతరం రాష్ట్ర బృందాలతో పాటు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఎన్డిఆర్ఎఫ్ బృందాలు శిథిలాలను సురక్షితంగా తొలగించి నలుగురిని బయటకు తీశారు. శిథిలాల కింద ఇంకా ముగ్గురు చిక్కుకున్నట్లు సమాచారం. వారిని రక్షించేందుకు అగ్నిమాపక సిబ్బందితో పాటు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు శరవేగంగా శిథిలాలను తొలగిస్తున్నాయి.
తాజావార్తలు
-
KBR Park Video : కేబీఆర్ పార్క్ చుట్టూ జీహెచ్ఎంసీ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. వీడియో రిలీజ్.!
-
PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
-
Ragi Mixture: సాయంత్రం స్నాక్స్లోకి క్రిస్పీ ‘రాగి మిక్సర్’.. సింపుల్గా హెల్తీగా ఇంట్లోనే ఇలా చేసుకోండి!
-
Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
-
Donald Trump: అమెరికా అధ్యక్షుడికి షాక్.. రూల్స్ బ్రేక్ చేశారంటూ ట్రంప్కు ఫైన్ వేసిన అధికారులు! అసలేం జరిగిందంటే..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..