GVL Narasimha Rao: బీజేపీ స్పెషల్ ఫోకస్ పెట్టింది.. జనసేనతో పొత్తు ఉంది
GVL Narasimha Rao Says BJP Put Special Focus On Telugu States: రెండు తెలుగు రాష్ట్రాలపై బీజేపీ స్పెషల్ ఫోకస్ పెట్టిందని ఎంపీ జీవీఎల్ నరసింహారావు పేర్కొన్నారు. జనసేనతో తమ పొత్తు ఉందని మరోసారి స్పష్టం చేశారు. బీజేపీ, జనసేన రెండు పార్టీలు కలిసి.. ముందుకు వెళ్లాలనేదే అధినాయకత్వం నిర్ణయమని వెల్లడించారు. విశాఖపట్నంలో జీవీఎల్ మీడియాతో మాట్లాడుతూ.. పాట్నా వేదికగా విపక్షాల భేటీ తర్వాత, ప్రజాస్వామ్యంను అపహాస్యం చేసేందుకు సిద్ధం అవుతున్నాయని మండిపడ్డారు.
Actress Jyothi: కేపీ చౌదరి డ్రగ్స్ కేసుపై నటి జ్యోతి రియాక్షన్.. ఆ హక్కు ఎవరిచ్చారు?
Also Read
- AP Intermediate Supplementary Exams: ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఫీజు గడువు పొడిగింపు..!
- CM Chandrababu: ఘనంగా Andhra University శతాబ్ది వేడుకలు.. విశాఖను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దుతా.!
- వందేళ్ల వైభవానికి అరుదైన గౌరవం.. Andhra Universityకు కేంద్రం ప్రత్యేక గుర్తింపు
- Petrol, Diesel Shortage: పెట్రోల్, డీజిల్ కొరతపై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్.. అధికారులకు కీలక ఆదేశాలు
బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాలు చేస్తున్న ప్రయత్నం.. ఒక ప్రహసనంగా మిగిలిపోతుందని పేర్కొన్నారు. అవినీతి కూటమి ద్వారా బీజేపీని ఎదుర్కొనేందుకు విపక్షలు కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు. ఎమర్జెన్సీ నాటి పరుస్థితులను పాఠ్యాంశంగా అందుబాటులోకి తీసుకుని రావాలని డిమాండ్ చేశారు. ఎమర్జెన్సీ నాటి దుర్మార్గ పరిస్థితులు తమకేమీ తెలియదన్నట్టు రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. తెలంగాణలో కాంగ్రెస్ది మూడో స్థానమని వ్యాఖ్యానించిన ఆయన.. 2024 లక్ష్యంగా బీజేపీ దక్షిణాదిలో విస్తరిస్తోందని అన్నారు. కర్ణాటక ఎన్నికల ఫలితాల ప్రభావం ఇతర రాష్ట్రాలపై ఏమాత్రం ఉండదని ధీమా వ్యక్తం చేశారు. ఎమర్జెన్సీ విధించినందుకు.. ప్రతి ఏటా కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ జాతికి క్షమాపణ చెప్పాలని కోరారు. రాష్ట్రంలో అప్రకటిత పరిస్థితులు, మీడియాపై ఆంక్షలు లేవని క్లారిటీ ఇచ్చారు.
Pawan Kalyan: కుల రాజకీయాలతో వ్యవస్థ నాశనమౌతోంది.. జనసేనాని ఫైర్
అంతకుముందు.. వైసీపీ ప్రభుత్వం ఏ ఒక్క ప్రాజెక్టును పూర్తి చేయకపోవడం వల్లే, ఉత్తరాంధ్ర కరువు ప్రాంతంగా మిగిలిపోయిందంటూ జీవీఎల్ సంచలన ఆరోపణలు చేశారు. ఉచిత పథకాలతో ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న మాట వాస్తవమేనని, దీనిపై మేధావులే ప్రజల్ని చైతన్యం చేయాలని అన్నారు. కేంద్రం నిధులు ఇస్తుంటే.. రాష్ట్ర ప్రభుత్వం వాటిపై తమ స్టిక్కర్లు అంటించుకుని ప్రచారం చేసుకుంటోందని విమర్శించారు. ఏపీలో ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపు చర్యలకు దిగుతోందంటూ మండిపడ్డారు.
తాజావార్తలు
-
DC Vs RCB: రెండు చెత్త రికార్డులను మూట కట్టుకున్న ఢిల్లీ క్యాపిటల్స్.. ఆర్సీబీ సంచలనం..
-
Salary Delay: సారీ బాస్.. ఉద్యోగులకు బ్యాడ్ న్యూస్! ఈసారి ‘ఫస్ట్’కు శాలరీ రాదు.. ఎందుకో తెలుసా?
-
Putin – Abbas Araghchi Meeting: అమెరికాకు పుతిన్ మాస్టర్ స్ట్రోక్.. ఇరాన్కు రష్యా ‘ఫుల్’ సపోర్ట్..!
-
AP Intermediate Supplementary Exams: ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఫీజు గడువు పొడిగింపు..!
-
CM Chandrababu: ఘనంగా Andhra University శతాబ్ది వేడుకలు.. విశాఖను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దుతా.!
ట్రెండింగ్
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!