Somu Veerraju: మేము సర్జికల్ స్ట్రైక్స్ చేస్తే.. వాళ్లు బాంబ్లు వేసుకుంటారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Somu Veerraju Sensational Comments On YCP Govt: ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తాజాగా వైసీపీ ప్రభుత్వంపై షాకింగ్ కామెంట్స్ చేశారు. రాష్ట్రంలో గ్రామీణ సడక్ యోజన క్రింద బీజేపీ వేసినన్ని రోడ్లు ఎవరూ వేయలేదన్నారు. ఏం చెప్పడానికి కొందరు రాష్ట్రంలో తిరుగుతున్నారని.. పరోక్షంగా గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై కౌంటర్ వేశారు. కొత్తగా రాష్ట్రాన్ని తినేసేందుకు.. పథకాలు ప్రకటించుకుంటున్నారని ఆరోపించారు. తాము మోడీ నాయకత్వంలో రోడ్ మ్యాప్తో ముందుకు వెళ్తున్నామన్నారు. వాళ్లతో కలుస్తారా, వీళ్లతో కలుస్తారా అని ఎప్పుడు మమ్మల్నే ఎందుకు ప్రశ్నిస్తారు? అని నిలదీశారు. వారాహి యాత్రను బీజేపీతో కలిసి చేస్తారా? అని పవన్ను అడుగుతారా? అని ప్రశ్నించారు. బీజేపీకి ప్రజలతో మాత్రమే పొత్తు ఉందని పేర్కొన్నారు. బీజేపి చేపట్టిన కార్యక్రమాల గురించి ప్రశ్నించే దమ్ము, ధైర్యం ఉందా? అని సవాల్ చేశారు. ఏపీలో బీజేపిని ఓ అద్బుత శక్తిలా తీర్చిదిద్దుతామన్న ఆయన.. తమ పాలన అద్భుతంగా ఉందన్నారు. కానీ.. వారి పాలన మొత్తం అవినీతిమయమని ఆరోపించారు. వాళ్లు అవినీతిపరులని, అభివృద్ది లేని వారని, అందిరికీ ఫైన్లు వేసేవాళ్లని విమర్శించారు. తాము సర్జికల్ స్ట్రైక్స్ చేస్తే.. వాళ్లు వేరే వాళ్ల మీద బాంబులు వేసుకుంటారని దుయ్యబట్టారు.
GVL Narasimha Rao: బీజేపీ స్పెషల్ ఫోకస్ పెట్టింది.. జనసేనతో పొత్తు ఉంది
Also Read
- Thalliki Vandanam: భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. వారికి కూడా ‘తల్లికి వందనం’ వర్తింపు..
- Chittoor Horror: అసలు తల్లివేనా..? వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఏడేళ్ల కుమారుడికి చిత్రహింసలు..!
- Nadendla Manohar: స్థానిక ఎన్నికల్లో కొత్త వ్యూహం.. మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు..
- OTR: పోలవరం క్రెడిట్ రేస్లోకి ఏపీ బీజేపీ.? ముఖ్య నేతలంతా ర్యాలీగా ప్రాజెక్ట్ సైట్కు.!
అంతకుముందు.. కేంద్రమంత్రి అమిత్ షాతో చంద్రబాబు భేటీని ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్లు ఊహించుకుంటున్నారని, టీడీపీతో బీజేపీ పొత్తు పెట్టుకుంటుందని ఎవరు చెప్పాలని సోము వీర్రాజు ప్రశ్నించారు. బీజేపీ పెద్దలతో భేటీ అనంతరం చంద్రబాబు పొత్తుల అంశం ప్రస్తావించలేదని గుర్తు చేశారు. ఏపీలో డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలన్నదే తన కోరిక అన్నారు. ప్రధాని మోడీ చేసిన అభివృద్ధి, సంక్షేమం.. రాష్ట్ర ప్రజలందరికీ తెలసుని పేర్కొన్నారు. పవన్ కల్యాణ్, ముద్రగడ పద్మనాభం మధ్య వివాదంపై వివాదాన్ని రాజకీయంగా మాత్రమే చూడాలని.. కులపరంగా చూడకూడదని సూచించారు.
Pawan Kalyan: కుల రాజకీయాలతో వ్యవస్థ నాశనమౌతోంది.. జనసేనాని ఫైర్
తాజావార్తలు
-
Telangana Housing: పట్టణ పేదలకు శుభవార్త.. ‘ఇందిరమ్మ పట్టణ గృహ నిర్మాణ’ పథకానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!
-
Rajasthan: ప్రియుడి ప్రైవేట్ పార్ట్ కోసేసిన ప్రియురాలు.. అద్భుతం చేసిన వైద్యులు..
-
Thalliki Vandanam: భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. వారికి కూడా ‘తల్లికి వందనం’ వర్తింపు..
-
Pallaburusu: టూత్బ్రష్తో జిల్లా కోర్టులో లీగల్ ఫైట్?
-
Bullet Train: బుల్లెట్ ట్రైన్ ఆలస్యానికి భారతే కారణం.. జపాన్ మాజీ మంత్రి ఆరోపణలు..
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?