Somu Veerraju: మేము సర్జికల్ స్ట్రైక్స్ చేస్తే.. వాళ్లు బాంబ్లు వేసుకుంటారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Somu Veerraju Sensational Comments On YCP Govt: ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తాజాగా వైసీపీ ప్రభుత్వంపై షాకింగ్ కామెంట్స్ చేశారు. రాష్ట్రంలో గ్రామీణ సడక్ యోజన క్రింద బీజేపీ వేసినన్ని రోడ్లు ఎవరూ వేయలేదన్నారు. ఏం చెప్పడానికి కొందరు రాష్ట్రంలో తిరుగుతున్నారని.. పరోక్షంగా గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై కౌంటర్ వేశారు. కొత్తగా రాష్ట్రాన్ని తినేసేందుకు.. పథకాలు ప్రకటించుకుంటున్నారని ఆరోపించారు. తాము మోడీ నాయకత్వంలో రోడ్ మ్యాప్తో ముందుకు వెళ్తున్నామన్నారు. వాళ్లతో కలుస్తారా, వీళ్లతో కలుస్తారా అని ఎప్పుడు మమ్మల్నే ఎందుకు ప్రశ్నిస్తారు? అని నిలదీశారు. వారాహి యాత్రను బీజేపీతో కలిసి చేస్తారా? అని పవన్ను అడుగుతారా? అని ప్రశ్నించారు. బీజేపీకి ప్రజలతో మాత్రమే పొత్తు ఉందని పేర్కొన్నారు. బీజేపి చేపట్టిన కార్యక్రమాల గురించి ప్రశ్నించే దమ్ము, ధైర్యం ఉందా? అని సవాల్ చేశారు. ఏపీలో బీజేపిని ఓ అద్బుత శక్తిలా తీర్చిదిద్దుతామన్న ఆయన.. తమ పాలన అద్భుతంగా ఉందన్నారు. కానీ.. వారి పాలన మొత్తం అవినీతిమయమని ఆరోపించారు. వాళ్లు అవినీతిపరులని, అభివృద్ది లేని వారని, అందిరికీ ఫైన్లు వేసేవాళ్లని విమర్శించారు. తాము సర్జికల్ స్ట్రైక్స్ చేస్తే.. వాళ్లు వేరే వాళ్ల మీద బాంబులు వేసుకుంటారని దుయ్యబట్టారు.
GVL Narasimha Rao: బీజేపీ స్పెషల్ ఫోకస్ పెట్టింది.. జనసేనతో పొత్తు ఉంది
Also Read
- YS Jagan Security: డీజీపీపై వైసీపీ ఫైర్.. జగన్ పర్యటనలో భద్రత తొలగించడంపై గుడివాడ అమర్నాథ్ సంచలన ఆరోపణలు
- AP Cabinet Meeting: రేపు ఏపీ కేబినెట్ భేటీ.. అజెండాలో అమరావతి.. కీలక ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్..!
- Srisailam Water Release: గుడ్న్యూస్.. శ్రీశైలం నుంచి నీటి విడుదల ప్రారంభం
- YS Jagan: చంద్రబాబు పాలనలో రైతులు రోడ్డున పడ్డారు.. ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారు!
అంతకుముందు.. కేంద్రమంత్రి అమిత్ షాతో చంద్రబాబు భేటీని ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్లు ఊహించుకుంటున్నారని, టీడీపీతో బీజేపీ పొత్తు పెట్టుకుంటుందని ఎవరు చెప్పాలని సోము వీర్రాజు ప్రశ్నించారు. బీజేపీ పెద్దలతో భేటీ అనంతరం చంద్రబాబు పొత్తుల అంశం ప్రస్తావించలేదని గుర్తు చేశారు. ఏపీలో డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలన్నదే తన కోరిక అన్నారు. ప్రధాని మోడీ చేసిన అభివృద్ధి, సంక్షేమం.. రాష్ట్ర ప్రజలందరికీ తెలసుని పేర్కొన్నారు. పవన్ కల్యాణ్, ముద్రగడ పద్మనాభం మధ్య వివాదంపై వివాదాన్ని రాజకీయంగా మాత్రమే చూడాలని.. కులపరంగా చూడకూడదని సూచించారు.
Pawan Kalyan: కుల రాజకీయాలతో వ్యవస్థ నాశనమౌతోంది.. జనసేనాని ఫైర్
తాజావార్తలు
-
Air India: ఎయిరిండియా కొత్త సీఈవో, ఎండీగా గెబ్రెమారియం నియామకం
-
LPG Tax: షాక్ తప్పదా..! ఎల్పీజీ సిలిండర్పై కొత్త పన్ను..? అసలు ప్రతిపాదన ఏమిటి..?
-
CJP: అవసరమైతే రాంచీకి వెళ్తాం.. జార్ఖండ్ విద్యార్థి ఉద్యమానికి సీజేపీ మద్దతు..
-
Korean Kanakaraju First Review: ‘కొరియన్ కనకరాజు’ ఫస్ట్ రివ్యూ.. సినిమాలో ప్లస్ పాయింట్స్ ఇవే.. అసలు మేటర్ ఏంటంటే?
-
Minister Ponguleti: 22ఏ భూముల పరిష్కారానికి తుది గడువు.. అర్హులకు అన్యాయం జరగనివ్వం: మంత్రి పొంగులేటి
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!