Rain Alert : తెలుగు రాష్ట్రాలకు అలర్ట్.. మరో రెండ్రోజులు వర్షాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గత రెండు రోజులుగా తెలుగు రాష్ట్రాలను అకాల వర్షాలు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. చేతికి వచ్చిన పంటలు అకాల వర్షాల కారణంగా నీటిపాలవుతున్నాయి. దీంతో రైతన్న తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. అంతేకాకుండా.. ప్రధాన పట్టణాల్లో భారీ వర్షం కారణంగా రోడ్లపై నీరు చేరి ట్రాఫిక్కు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అయితే.. మరో రెండు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది వాతావరణ శాఖ. ఉరుము, మెరుపులతో కూడిన వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ పేర్కొంది. అయితే.. సముద్ర తీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మత్య్సకారులు వేటకు వెళ్లవద్దని హెచ్చిరకలు జారీ చేశారు.
Also Read :PM Modi: దేశంలో ప్రజాస్వామ్యం పటిష్ఠం.. ఓర్వలేకే దాడులు చేస్తున్నారు..
Also Read
- Pak vs WI: వెస్టిండీస్పై బాబర్ సేన భారీ విజయం.! WTC పాయింట్ల పట్టికలో మార్పులు.!
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
ఇదిలా ఉంటే.. ఉమ్మడి వసరంగల్ జిల్లాలో శనివారం సాయంత్రం కురిసిన ఉరుములు, మెరుపులతో కూడిన వడగండ్ల వర్షం బీభత్సం సృష్టించింది. ఏకధాటిగా గంట పాటు గులకరాళ్ల సైజులో వడగండ్లు పడి వరి పంటలు, తోటలు దెబ్బతిన్నాయి. బలమైన ఈదురు గాలులు వీచి పలు చోట్ల చెట్లు నేలకొరిగాయి. పొట్ట దశలో ఉన్న వరి పంటలు దెబ్బతిన్నాయని . ములుగు జిల్లాలోని వెంకటాపూర్, గోవిందరావుపేట మండలాల్లో, జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రం, గణపురం మండల కేంద్రంలో వడగండ్ల వర్షం కురిసింది. దీంతో రహదారిపై రాళ్లు కుప్పలుక్పులుగా పడ్డాయి. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి, నర్సింహులపేట మండలాల్లో పెంకుటిండ్లు, వరి పంటలు దెబ్బతిన్నాయి.
Also Read : Tamilnadu: ఏఐఏడీఎంకే-బీజేపీ కూటమి చీలిక దిశగా పయనిస్తోందా?
జనగామ జిల్లాలోని పలు ప్రాంతాల్లో చెట్లు నేలకూలాయి. రాత్రి కురిసిన గాలి వానకి గ్రేటర్ వరంగల్ పలు రేకుల ఇండ్ల పై కప్పులు ఎగిరిపోయి.. కరిమాబాద్. ఖిలా వరంగల్ లో ఇంటి పైన వేసిన రేకులు కొట్టుకొని పోవడం జనం ఇబ్బందులు పడ్డారు. నిజమాబాద్ లోనూ వడగండ్ల వర్షం తో పంట నష్టం వాటిల్లింది. బీర్కూర్, మేనూరు, నర్సాపూర్, రామా రెడ్డి, మోస్రా, జుక్కల్, నస్రుల్లా బాద్, ముగ్ధుపూర్ లో వడగండ్ల వాన బీభత్సం సృష్టించింది. 200 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్లు అధికారుల నివేదిక అందింది. మాలాపల్లి లో పిడుగుపాటుకు ముగ్గురు విద్యార్థులు అస్వస్థత గురయ్యారు.
తాజావార్తలు
-
Raaka: ‘రాకా’లో షారుఖ్ ఉన్నారా? వైరల్ అవుతున్న గెస్ట్ రోల్ వార్తలపై క్లారిటీ!
-
Pak vs WI: వెస్టిండీస్పై బాబర్ సేన భారీ విజయం.! WTC పాయింట్ల పట్టికలో మార్పులు.!
-
Oppo F35 Pro: ఒప్పో F35 ప్రో భారత్ లో రిలీజ్ కు రెడీ.. 10,000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫోన్!
-
Shakib Al Hasan: బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ ఇంటిపై.. పెట్రోల్ బాంబు దాడి!
-
Dhanush-Kareena Kapoor: భన్సాలీ కొత్త ప్రాజెక్ట్లో ధనుష్ కి జోడీగా కరీనా? పౌరాణిక అడ్వెంచర్కు రంగం సిద్ధం!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!