PM Modi: దేశంలో ప్రజాస్వామ్యం పటిష్ఠం.. ఓర్వలేకే దాడులు చేస్తున్నారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: దేశంలోని ప్రజాస్వామ్య సంస్థలన్నీ విజయవంతంగా నడుస్తున్నాయని, వాటిని చూసి ఓర్వలేకే కొందరు ఆరోపణలు చేస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మండిపడ్డారు. ఇండియా టుడే కాన్క్లేవ్ 2023లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శనివారం కీలకోపన్యాసం చేస్తూ.. భారత ప్రజాస్వామ్యం, ప్రజాస్వామ్య సంస్థల విజయం కొందరిలో అసూయను కలిగిస్తోందని అన్నారు. ఈ విజయం వల్లే మన ప్రజాస్వామ్యం, ప్రజాస్వామ్య సంస్థలపై దాడులు జరుగుతున్నాయని ప్రధాని మోదీ అన్నారు. ప్రజాస్వామ్య ఫలాలు అంటే ఏంటో యావత్ ప్రపంచానికి భారత్ చూపించిందన్నారు. దేశంలో ప్రజాస్వామ్యం దాడికి గురవుతోందంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలకు ప్రధాని మోదీ కౌంటర్ ఇచ్చారు. అవినీతి ఆరోపణలపై విచారణ జరుపుతున్న సంస్థల చుట్టూ వివిధ పార్టీల నేతలు ర్యాలీలు చేస్తున్నారని విమర్శలు గుప్పించారు. “ఏ దేశ అభివృద్ధిలోనైనా, విధాన రూపకల్పనలోనైనా స్తబ్దత అతిపెద్ద అడ్డంకులలో ఒకటి. మన దేశంలో, పాత ఆలోచనలు, పాత విధానాల కారణంగా, కొన్ని కుటుంబాల పరిమితుల కారణంగా, చాలా కాలం స్తబ్దత ఉంది, ”అని ప్రధాని మోదీ అన్నారు. “మనం ముందుకు వెళ్లాలంటే, నిర్ణయాలు తీసుకునే వేగం, ధైర్యం ఉండాలి. దేశం ఎదగాలంటే, కొత్తదనాన్ని స్వీకరించే సామర్థ్యం ఉండాలి.” అని అన్నారు.
భారతదేశ ప్రజాస్వామ్య సంస్థల పటిష్టత గురించి ప్రధాని మోదీ ప్రసంగించారు. గత కొన్ని సంవత్సరాలుగా భారతదేశంలో సృష్టించబడిన అనేక కొత్త సంస్థలను జాబితా చేశారు. “ఈ రోజు భారతదేశం ఏదైతే సాధిస్తోందో, అది మన ప్రజాస్వామ్య శక్తి, మన సంస్థల శక్తి వల్లనే” అని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన భారత ప్రభుత్వం నిర్ణయాత్మక నిర్ణయాలు తీసుకుంటోందని ప్రపంచం చూస్తోందన్నారు. గత సంవత్సరాల్లో భారతదేశంలో సృష్టించబడిన కొత్త సంస్థలను ప్రధానమంత్రి మోదీ హైలైట్ చేశారు. భవిష్యత్ రోడ్మ్యాప్ను నిర్ణయించడంలో నీతి ఆయోగ్ పెద్ద పాత్ర పోషిస్తుందని, దేశంలో కార్పొరేట్ పాలనను బలోపేతం చేయడంలో నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని, భారతదేశంలో ఆధునిక పన్ను వ్యవస్థను రూపొందించడంలో జీఎస్టీ కౌన్సిల్ పాత్రను కూడా ప్రధాని మోదీ స్పృశించారు. కరోనా సమయంలోనూ ఎన్నికల్లో పెద్ద సంఖ్యలో ప్రజలు భాగమయ్యారని ప్రధాని స్పష్టం చేశారు.
Also Read
- 2027 World Cup: స్టార్ ప్లేయర్లకు నో ఛాన్స్.. వరల్డ్ కప్ జట్టులో ఊహించని ట్విస్ట్..
- 24 Carat Gold: బంగారం 24 క్యారెట్లే ఎందుకు? 50 లేదా 100 క్యారెట్లు ఎందుకు ఉండవు? 3,000 ఏళ్ల చరిత్ర.. మీకు తెలుసా?
- Sheikh Hasina: విద్యార్థి ఉద్యమం కాదు, రెజిమ్ ఛేంజ్ కుట్ర.. 2 ఏళ్ల తర్వాత మౌనం వీడిన షేక్ హసీనా..
- Air India: ఎయిరిండియా కొత్త సీఈవో, ఎండీగా గెబ్రెమారియం నియామకం
దేశంలోని ప్రజాస్వామ్య సంస్థలు బలంగా ఉన్నాయని.. అందుకే ఎన్నికల్లో ప్రజల భాగస్వామ్యం పెరుగుతోందని ప్రధాని అన్నారు. బలమైన ఆర్థిక, బ్యాంకింగ్ వ్యవస్థలు ఉన్నాయని.. ఈ విజయాలు కొందరిని బాధిస్తున్నాయని మోదీ పేర్కొన్నారు. అందుకే మన ప్రజాస్వామ్యాన్ని, సంస్థలను లక్ష్యంగా చేసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రపంచంలోని మేధావులంతా భారత దేశ వృద్ధి రేటు గురించి ఆశాజనకంగా ఉన్నారన్నారు. కానీ, దేశ స్థైర్యాన్ని దెబ్బతీసే ప్రయత్నాలు సైతం జరుగుతున్నాయని.. ఏదైనా మంచి పని జరుగుతుంటే.. కాటుక పెట్టుకోవడం మన సంప్రదాయమని ఎద్దేవా చేశారు.
తాజావార్తలు
-
2027 World Cup: స్టార్ ప్లేయర్లకు నో ఛాన్స్.. వరల్డ్ కప్ జట్టులో ఊహించని ట్విస్ట్..
-
Irumudi : అయ్యప్ప ‘బంగారు పల్లకి’ సాంగ్ రెడీ అవుతోంది..!
-
24 Carat Gold: బంగారం 24 క్యారెట్లే ఎందుకు? 50 లేదా 100 క్యారెట్లు ఎందుకు ఉండవు? 3,000 ఏళ్ల చరిత్ర.. మీకు తెలుసా?
-
Sheikh Hasina: విద్యార్థి ఉద్యమం కాదు, రెజిమ్ ఛేంజ్ కుట్ర.. 2 ఏళ్ల తర్వాత మౌనం వీడిన షేక్ హసీనా..
-
Air India: ఎయిరిండియా కొత్త సీఈవో, ఎండీగా గెబ్రెమారియం నియామకం
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!