Vande Bharat Sleeper: త్వరలో పట్టాలెక్కనున్న వందే భారత్ స్లీపర్ రైలు.. ప్రారంభమెప్పుడంటే..?
- వందే భారత్ స్లీపర్ రైలు కోసం ఎదురుచూస్తున్న ప్రయాణికులకు శుభవార్త
- త్వరలో వందే భారత్ స్లీపర్ రైళ్లను ప్రవేశపెట్టాలని రైల్వే యోచన
- ఈ ఏడాది చివరి నాటికి వందే భారత్ స్లీపర్ రైలు ప్రారంభం.
వందే భారత్ స్లీపర్ రైలు కోసం ఎదురుచూస్తున్న ప్రయాణికులకు శుభవార్త. వందే భారత్ రైళ్ల విజయవంతమైన తర్వాత.. త్వరలో వందే భారత్ స్లీపర్ రైళ్లను ప్రవేశపెట్టాలని రైల్వే యోచిస్తోంది. భారతదేశపు మొట్టమొదటి వందే భారత్ స్లీపర్ రైలు ఈ ఏడాది చివరి నాటికి ప్రారంభించాలని భావిస్తున్నారు. కాగా.. వందే భారత్ స్లీపర్ రైలు వందే భారత్ సిరీస్ యొక్క మూడవ వెర్షన్. ఈ సిరీస్ రైళ్లలో చైర్-కార్ రైళ్లు కూడా ఉన్నాయి. అలాగే.. వందే మెట్రో గుజరాత్లో నడుస్తుంది. అయితే.. వచ్చే నెలలోగా తొలి వందేభారత్ స్లీపర్ రైలు పట్టాలెక్కనున్నట్లు జనరల్ మేనేజర్, ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ICF) చెన్నై, యు. సుబ్బారావు తెలిపారు.
ఆయన మాట్లాడుతూ.. భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ (BEML) బెంగళూరు ప్లాంట్ నుండి సెప్టెంబర్ 20 నాటికి మొదటి రైలు నిర్మాణం పూర్తవుతుందని తెలిపారు. “BEML కోచ్లను అసెంబ్లింగ్ చేస్తోంది. సెప్టెంబర్ 20 నాటికి కోచ్లు ICF, చెన్నైకి చేరుకుంటాయని మేము భావిస్తున్నాము. ఆ తర్వాత మేము రేక్ తయారీ, ఫైనల్ టెస్టింగ్.. కమీషనింగ్ చేస్తాము. ఇది సుమారు 15-20 రోజులు పడుతుంది. ఆ తర్వాత.. లక్నో ఆధారిత రైల్వే డిజైన్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ (RDSO) కింద డోలనం ట్రయల్స్ను.. నార్త్ వెస్ట్రన్ రైల్వే జోన్లో నిర్వహించనున్నారు.” అని సుబ్బారావు పేర్కొన్నారు.
Rajini: 15,000 అడిగిన రజనీకి 1,10,000 చెల్లించిన నిర్మాత.. ఏ సినిమానో తెలుసా?
డిజైన్ వర్క్ జరుగుతోంది
మే 2023లో ICF చెన్నై, 16 కార్ల వందే భారత్ స్లీపర్ రైలు 10 సెట్ల రేక్ల రూపకల్పన, తయారీకి BEML లిమిటెడ్తో ఆర్డర్ చేసింది. ఈ రైలు గరిష్టంగా గంటకు 160 కి.మీ వేగంతో నడపగలదు. “ఇది మొదటి వందే భారత్ స్లీపర్ రైలు. కాబట్టి ఇది పూర్తి చేయడానికి మరికొంత సమయం పడుతుంది. ఇది యూరోపియన్ ప్రమాణాలకు అనుగుణంగా ఉంటుంది. డిసెంబర్ 2024 నాటికి అన్ని టెస్టింగ్, ట్రయల్ రన్ల తర్వాత పని చేస్తుంది” అని సుబ్బారావు చెప్పారు.
వందే భారత్ స్లీపర్లోని సౌకర్యాలు
వందే భారత్ స్లీపర్ రైలులో.. భారతీయ రైల్వే తన ప్రయాణీకులకు యూరప్లోని నైట్జెట్ స్లీపర్ రైళ్ల మాదిరిగానే రాత్రి ప్రయాణాల్లో ప్రపంచ స్థాయి ప్రయాణ అనుభూతిని అందించాలని యోచిస్తోంది. రాత్రిపూట లైట్లు ఆపినప్పుడు వాష్రూమ్కు ప్రయాణీకులను మార్గనిర్దేశం చేసేందుకు మెట్ల దిగువన LED స్ట్రిప్స్ ఉంటాయని ఒక మూలం తెలిపింది. అంతే కాకుండా.. రైలు సహాయకులకు ప్రత్యేక బెర్త్లు కూడా ఉంటాయి. 16 కోచ్లు కలిగిన వందే భారత్ స్లీపర్ రైలులో మొత్తం 823 బెర్త్లు ఉంటాయి. ఇందులో 11 3AC కోచ్లు (611 బెర్త్లు), 4 2AC కోచ్లు (188 బెర్త్లు), 1 1ఏసీ కోచ్ (24 బెర్త్లు) ఉంటాయి. పోలాండ్కు చెందిన యూరోపియన్ రైలు కన్సల్టెంట్, EC ఇంజనీరింగ్ నుండి డిజైన్ ఇన్పుట్లతో ఈ రైలును BEML.. హైదరాబాద్కు చెందిన మేధా సర్వో డ్రైవ్స్ లిమిటెడ్ తయారు చేస్తున్నారు.
తాజావార్తలు
-
Varun Chakravarthy: వైభవ్ వికెట్తో చరిత్ర సృష్టించిన వరుణ్ చక్రవర్తి.. టీ20లలో నయా హిస్టరీ
-
Chanakya Niti : ఆఫీస్ పాలిటిక్స్ను తెలివిగా ఎదుర్కోవడం ఎలా.? చాణక్య నీతి సూత్రాలు..!
-
Car Insurance: మీ కారుకు ఇన్సూరెన్స్ ఉన్నా క్లెయిమ్ రావడం లేదా..? అయితే వీటిపై ఓ లుక్కేయండి..
-
Ambati Rambabu : అమరావతి అంతులేని కథ.. 100 జన్మలెత్తినా పూర్తి కాదు
-
US-Iran Talks: నిర్మానుష్యంగా పాకిస్తాన్ రాజధాని.. ఇస్లామాబాద్ లాక్డౌన్
ట్రెండింగ్
-
Health Tips : కిడ్నీలో రాళ్లు ఉన్నప్పుడు మూత్రంలో రక్తం ఎందుకు వస్తుంది.? నిపుణుల వివరణ
-
Apple Sharbat Recipe: అద్దిరిపోయే సమ్మర్ డ్రింక్.. ‘ఆపిల్ షర్బత్’.. ఎంతో చల్లగా, రిఫ్రెషింగ్గా..!
-
Miriyala Charu Recipe: జలుబు, జ్వరమా? ఐదు నిమిషాల్లో ఘాటైన ‘మిర్యాల చారు’.. అన్నమంతా దీనితోనే తినేస్తారు.!
-
Broccoli Soup Recipe : హెల్తీ అండ్ టేస్టీ.. ఇంట్లోనే క్రీమీ బ్రోకలీ సూప్.! కేవలం 20 నిమిషాల్లో రెడీ..!
-
Tubeless Tyre Puncture: టైర్ పంక్చర్ అయినా.. మరో 100 కి.మీ వరకు వెళ్లొచ్చు..! ఎలాగో తెలుసా?