Parliament Sessions: రాహుల్ గాంధీ వివాదాస్పద వ్యాఖ్యలు! రికార్డు నుంచి తొలగింపు
- సోమవారం పార్లమెంట్ లో ప్రసంగించిన రాహుల్
- రెండో ప్రసంగం కూడా వివాదాస్పదం
- ప్రసంగంలోని కొన్ని పదాలను రికార్డు నుంచి తొలగింపు
- సభలోలేని వ్యక్తుల పేర్లు ప్రస్తావించొద్దన్న స్పీకర్
- మొదటి ప్రసంగంలో కూడా రాహుల్ వివాదాస్పద వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన రెండో ప్రసంగం కూడా వివాదాస్పదమైంది. బడ్జెట్పై చర్చ సందర్భంగా సోమవారం లోక్సభలో రాహుల్ గాంధీ చేసిన ప్రసంగంలోని కొన్ని పదాలను రికార్డు నుంచి తొలగించారు. తొలగించిన పదాలలో.. మోహన్ భగవత్, అజిత్ దోవల్, అంబానీ, అదానీ పేర్లు ఉన్నాయి. రాహుల్ గాంధీ తన 45 నిమిషాల ప్రసంగంలో ఈ నలుగురి పేర్లను తీసుకున్నారు. దీనిపై స్పీకర్ ఓం బిర్లా కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు.
READ MORE: Telangana Assembly 2024: కేసీఆర్ రికార్డ్ బ్రేక్ చేసిన సీఎం రేవంత్ రెడ్డి..
Also Read
- HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
- Kolar Tragedy: గుండెల్ని పిండేసే ఘటన.. ఇద్దరు పసిబిడ్డల ప్రాణాలు తీసిన కన్నతల్లి.. చివరకు..!
- Hyderabad: అలర్ట్.. నగరంలో రెండు ఎబోలా కేసులు.. ఈ లక్షణాలు ఉంటే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!
- Pak vs Aus: కుప్ప కూలిన ఆస్ట్రేలియా.. పాకిస్తాన్ సిరీస్ కైవసం.!
రాహుల్ గాంధీ ఏం చెప్పారు?
ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ చేసిన రెండో ప్రసంగంలో ‘చక్రవ్యూహ’ ప్రధానాంశం. మహాభారత యుద్ధంలో చక్రవ్యూహం నిర్మాణాన్ని ప్రస్తావిస్తూ.. అందులో భయం, హింస ఉందని, ఆరుగురు వ్యక్తులు అభిమన్యుని ట్రాప్ చేసి చంపారని రాహుల్ గాంధీ అన్నారు. చక్రవ్యూహాన్ని పద్మవ్యూహంగా అభివర్ణిస్తూ.. తలకిందులు చేసిన కమలం లాంటిదని అన్నారు.
READ MORE:Attack On Polavaram MLA Balaraju Car: జనసేన ఎమ్మెల్యే కారుపై రాళ్ల దాడి.. పవన్ కల్యాణ్ సీరియస్..
కొత్త చక్రవ్యూహం సిద్ధమైందని.. అది కూడా కమలం ఆకారంలో ఉందని రాహుల్ గాంధీ అన్నారు. దాన్ని ప్రధాని మోడీ దానిని ఛాతీపై పెట్టుకుని తిరుగుతున్నారన్నారు. అభిమన్యుని ద్రోణ, కర్ణ, కృపాచార్య, కృతవర్మ, అశ్వస్థమా, శకుని కలిసి చంపారని పేర్కొ్నారు. “నేటికీ చక్రవ్యూహం మధ్యలో ఆరు మంది ఉన్నారు. ఈ 6 మంది దానిని నియంత్రిస్తారు. ఇందులో నరేంద్ర మోడీ , అమిత్ షా, మోహన్ భగవత్, అజిత్ దోవల్, అంబానీ, అదానీ ఉన్నారు.” అని ఆయన వ్యాఖ్యానించారు.
READ MORE:Mr Bachchan: రవితేజ సినిమాలో యంగ్ హీరో గెస్ట్ రోల్..ఎవరంటే.?
రాహుల్ గాంధీ ఈ ప్రకటనపై లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అడ్డుతగిలారు. ఈ సభలో సభ్యుడు కాని వ్యక్తి పేరు తీసుకోరాదని గుర్తు చేశారు. దీనిపై రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. అజిత్ దోవల్, అదానీ, అంబానీ పేర్లను తీసుకోకూడదనుకుంటే వద్దని అన్నారు. మోడీ ప్రభుత్వంలో దేశ ప్రజలు చిక్కుల్లో పడ్డారని, ఇందులో రైతులు, యువత ఎక్కువగా నష్టపోతున్నారని ఆరోపించారు.
READ MORE:Kurnool Kidnap Case: కర్నూలులో నగల వ్యాపారి కిడ్నాప్.. సినీఫక్కీలో పోలీసుల ఛేజ్..
మొదటి ప్రసంగంలో కూడా పదాల తొలగింపు…
జులై 1న రాహుల్ గాంధీ ప్రతిపక్ష నేత హోదాలో పార్లమెంట్లో తొలి ప్రసంగం చేశారు. అనంతరం రాష్ట్రపతి ప్రసంగంపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. తొలి ప్రసంగంలో రాజ్యాంగ ప్రతిని, శివుడి బొమ్మను చూపుతూ రాహుల్ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. అతడి తొలి ప్రసంగంలో ఎక్కువ భాగం పార్లమెంటరీ రికార్డు నుంచి తొలగించబడింది. ప్రసంగంలోని కొన్ని భాగాలను తొలగించిన తర్వాత రాహుల్ గాంధీ తన అసంతృప్తిని వ్యక్తం చేస్తూ లోక్సభ స్పీకర్కు లేఖ కూడా రాశారు.
- Tags
- Adani
- ajit doval
- Ambani
- bjp
- congress
తాజావార్తలు
-
Plumber: రాత్రికి రాత్రే కోటీశ్వరుడైన ప్లంబర్.. ఖాతాలోకి ఏకంగా రూ.294 కోట్ల 80 లక్షలు..!
-
Tollywood : ఆ మ్యూజిక్ డైరెక్టర్ ని చూసి ఇతర సంగీత దర్శకులు చాలా నేర్చుకోవాలి
-
Shreyas Iyer-BCCI: బీసీసీఐ కీలక సమావేశంకు శ్రేయాస్ అయ్యర్.. టీమిండియా టీ20 కెప్టెన్గా ఫిక్స్!
-
Vivo X500 Pro Max: వివో ఎక్స్500 ప్రో మ్యాక్స్.. 50MP + 50MP + 200MP కెమెరాలు.. 8000mAh బ్యాటరీ, 120W ఫాస్ట్ ఛార్జింగ్
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!