Rahul Gandhi: బ్రహ్మపుత్ర నదిలో రాహుల్ గాంధీ పడవ ప్రయాణం.. ఫొటోలు వైరల్
రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్ర అసోం చేరుకుంది. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ అస్సాంలోని బ్రహ్మపుత్ర నదిలో పడవ ప్రయాణం చేసి శ్రీశ్రీ ఔనియతి సత్రానికి చేరుకున్నారు. అందులోని కొన్ని ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అతనితో పాటు పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్, రాష్ట్ర అధ్యక్షుడు భూపేన్ కుమార్ బోరా పలువురు అగ్ర నాయకులు ఉన్నారు. ‘X’ లో రాహుల్ గాంధీ పోస్ట్ చేస్తూ “ఈ రోజు నేను శ్రీశ్రీ ఔనియతి సత్రాన్ని సందర్శించడానికి అస్సాంలోని బ్రహ్మపుత్ర నదిపై పడవ ప్రయాణం చేసాను. సాంస్కృతికంగా సంపన్నమైన, శంకర్ దేవ్ జీ భూమి, అస్సాం ప్రతి ఒక్కరినీ తన వెంట తీసుకెళ్లే జీవిత తత్వాన్ని మాకు నేర్పుతుంది. అని కామెంట్ చేశారు. అటువంటి గొప్ప సంస్కృతిని దగ్గరగా తెలుసుకునే, అర్థం చేసుకునే అవకాశాన్ని పొందడం ద్వారా తాను సంతృప్తి చెందానని రాహుల్ గాంధీతెలిపారు.
Read Also: Ayutthaya: ఇది “థాయ్లాండ్” అయోధ్య.. భౌగోళికంగా వేరైనా అక్కడా “రామ నామమే”..
Also Read
- Rava Paratha Recipe: రెగ్యులర్ బ్రేక్ఫాస్ట్ బోర్ కొట్టిందా..? 10 నిమిషాల్లో మెత్తటి రవ్వ పరాఠాలు ఇలా తయారు చేయండి
- KING 100 : దాదాపు 20 ఏళ్ల తర్వాత నాగ్ సరసన టబు.. ఫ్యాన్స్ ఫుల్ ఖుషి
- Divya Sathyaraj: పెళ్లి లేకుండానే తల్లిని అవుతా.. కట్టప్ప కూతురు సెన్సేషనల్ కామెంట్స్!
- YSRCP Protest: డీజిల్, పెట్రోల్ కొరత.. ఆందోళనలకు వైసీపీ పిలుపు..
ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. అసోం చేరుకున్న తర్వాత మణిపూర్, నాగాలాండ్ ప్రజల నుంచి తనకు ఎంతో ప్రేమ లభించిందన్నారు. మీ బాధ, మీ సమస్యలు మీకు జరుగుతున్న అన్యాయాన్ని నిశితంగా అర్థం చేసుకోవడమే భారత్ జోడో న్యాయ్ యాత్ర లక్ష్యం అన్నారు. ఈ క్రమంలో.. అస్సాం ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మను లక్ష్యంగా చేసుకుని అవినీతి ఆరోపణలు చేశారు.
Read Also: Gun Fire: కారులో వెళ్తున్న వ్యక్తిపై కాల్పులు.. నోయిడాలో ఘటన
అస్సాం ముఖ్యమంత్రి భారతదేశంలో అత్యంత అవినీతిపరుడైన ముఖ్యమంత్రి అని.. ద్వేషం ముసుగులో ప్రజా ధనాన్ని దోచుకోవడం మాత్రమే అతని పని అని రాహుల్ గాంధీ దుయ్యబట్టారు. కానీ డబ్బు బలం అస్సాం ప్రజల శక్తిని ఎన్నటికీ ఓడించదని అన్నారు. ఈ అన్యాయంపై పోరాడాలని.. ప్రతి ఒక్కరికీ ఉపాధి ఉండేలా, ప్రకృతి సౌందర్యం, సాంస్కృతిక వైభవం ఎప్పుడూ సుభిక్షంగా ఉండే అలాంటి అసోంను సృష్టించాలని ఆయన అన్నారు.
आज, असम में ब्रह्मपुत्र नदी में नाव की यात्रा कर श्री श्री औनियाती सत्र के दर्शन के लिए पहुंचा।
सांस्कृतिक रूप से समृद्ध, शंकर देव जी की भूमि, असम हमें सभी को साथ लेकर चलने का जीवन दर्शन सिखाती है।
ऐसी महान संस्कृति को नज़दीक से जानने और समझने का मौका पाकर संतोष प्राप्त हुआ। pic.twitter.com/1qRpmOwpxl
— Rahul Gandhi (@RahulGandhi) January 19, 2024
తాజావార్తలు
-
Rava Paratha Recipe: రెగ్యులర్ బ్రేక్ఫాస్ట్ బోర్ కొట్టిందా..? 10 నిమిషాల్లో మెత్తటి రవ్వ పరాఠాలు ఇలా తయారు చేయండి
-
KING 100 : దాదాపు 20 ఏళ్ల తర్వాత నాగ్ సరసన టబు.. ఫ్యాన్స్ ఫుల్ ఖుషి
-
Divya Sathyaraj: పెళ్లి లేకుండానే తల్లిని అవుతా.. కట్టప్ప కూతురు సెన్సేషనల్ కామెంట్స్!
-
YSRCP Protest: డీజిల్, పెట్రోల్ కొరత.. ఆందోళనలకు వైసీపీ పిలుపు..
-
Nandamuri Balakrishna : బాలయ్య నీ స్పీడ్ ఏంటయ్యా.. ఒకేసారి రెండు సినిమాలు
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!