Rahul Gandhi: బ్రహ్మపుత్ర నదిలో రాహుల్ గాంధీ పడవ ప్రయాణం.. ఫొటోలు వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్ర అసోం చేరుకుంది. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ అస్సాంలోని బ్రహ్మపుత్ర నదిలో పడవ ప్రయాణం చేసి శ్రీశ్రీ ఔనియతి సత్రానికి చేరుకున్నారు. అందులోని కొన్ని ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అతనితో పాటు పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్, రాష్ట్ర అధ్యక్షుడు భూపేన్ కుమార్ బోరా పలువురు అగ్ర నాయకులు ఉన్నారు. ‘X’ లో రాహుల్ గాంధీ పోస్ట్ చేస్తూ “ఈ రోజు నేను శ్రీశ్రీ ఔనియతి సత్రాన్ని సందర్శించడానికి అస్సాంలోని బ్రహ్మపుత్ర నదిపై పడవ ప్రయాణం చేసాను. సాంస్కృతికంగా సంపన్నమైన, శంకర్ దేవ్ జీ భూమి, అస్సాం ప్రతి ఒక్కరినీ తన వెంట తీసుకెళ్లే జీవిత తత్వాన్ని మాకు నేర్పుతుంది. అని కామెంట్ చేశారు. అటువంటి గొప్ప సంస్కృతిని దగ్గరగా తెలుసుకునే, అర్థం చేసుకునే అవకాశాన్ని పొందడం ద్వారా తాను సంతృప్తి చెందానని రాహుల్ గాంధీతెలిపారు.
Read Also: Ayutthaya: ఇది “థాయ్లాండ్” అయోధ్య.. భౌగోళికంగా వేరైనా అక్కడా “రామ నామమే”..
Also Read
- India and Sri Lanka: 429/9 వద్ద మ్యాచ్కు తెర.. కొలంబోలో భారత్, శ్రీలంక డ్రా.. సిరీస్ మనదే..
- Nepal Floods: నేపాల్లో హృదయవిదారక పరిస్థితులు.. ఆత్మీయుల జాడ తెలియక అరణ్యరోదన
- ICC: స్టార్ క్రికెటర్కు భారీ షాక్.. డోపింగ్ కేసులో 15 నెలల బ్యాన్
- Nepal Floods: నేపాల్ వరదల్లో 288 మంది భారతీయులు గల్లంతు.. కేంద్రం ప్రకటన..
ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. అసోం చేరుకున్న తర్వాత మణిపూర్, నాగాలాండ్ ప్రజల నుంచి తనకు ఎంతో ప్రేమ లభించిందన్నారు. మీ బాధ, మీ సమస్యలు మీకు జరుగుతున్న అన్యాయాన్ని నిశితంగా అర్థం చేసుకోవడమే భారత్ జోడో న్యాయ్ యాత్ర లక్ష్యం అన్నారు. ఈ క్రమంలో.. అస్సాం ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మను లక్ష్యంగా చేసుకుని అవినీతి ఆరోపణలు చేశారు.
Read Also: Gun Fire: కారులో వెళ్తున్న వ్యక్తిపై కాల్పులు.. నోయిడాలో ఘటన
అస్సాం ముఖ్యమంత్రి భారతదేశంలో అత్యంత అవినీతిపరుడైన ముఖ్యమంత్రి అని.. ద్వేషం ముసుగులో ప్రజా ధనాన్ని దోచుకోవడం మాత్రమే అతని పని అని రాహుల్ గాంధీ దుయ్యబట్టారు. కానీ డబ్బు బలం అస్సాం ప్రజల శక్తిని ఎన్నటికీ ఓడించదని అన్నారు. ఈ అన్యాయంపై పోరాడాలని.. ప్రతి ఒక్కరికీ ఉపాధి ఉండేలా, ప్రకృతి సౌందర్యం, సాంస్కృతిక వైభవం ఎప్పుడూ సుభిక్షంగా ఉండే అలాంటి అసోంను సృష్టించాలని ఆయన అన్నారు.
आज, असम में ब्रह्मपुत्र नदी में नाव की यात्रा कर श्री श्री औनियाती सत्र के दर्शन के लिए पहुंचा।
सांस्कृतिक रूप से समृद्ध, शंकर देव जी की भूमि, असम हमें सभी को साथ लेकर चलने का जीवन दर्शन सिखाती है।
ऐसी महान संस्कृति को नज़दीक से जानने और समझने का मौका पाकर संतोष प्राप्त हुआ। pic.twitter.com/1qRpmOwpxl
— Rahul Gandhi (@RahulGandhi) January 19, 2024
తాజావార్తలు
-
India and Sri Lanka: 429/9 వద్ద మ్యాచ్కు తెర.. కొలంబోలో భారత్, శ్రీలంక డ్రా.. సిరీస్ మనదే..
-
Nepal Floods: నేపాల్లో హృదయవిదారక పరిస్థితులు.. ఆత్మీయుల జాడ తెలియక అరణ్యరోదన
-
ICC: స్టార్ క్రికెటర్కు భారీ షాక్.. డోపింగ్ కేసులో 15 నెలల బ్యాన్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్గా కాజు కట్లీ రెడీ..!
-
Nepal Floods: నేపాల్ వరదల్లో 288 మంది భారతీయులు గల్లంతు.. కేంద్రం ప్రకటన..
ట్రెండింగ్
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!
-
Guinness World Record: లక్ష అడుగుల ఎత్తు నుంచి ఫోన్ను పడేసినా.. ఒక్క గీత కూడా పడలేదు.! అసలు మ్యాజిక్ ఏంటంటే?