Hyderabad: గాంధీ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం.. 10 మంది సీనియర్లు సస్పెండ్
Hyderabad: తెలంగాణలో మరోసారి ర్యాగింగ్ కలకలం రేగింది. ఈ ర్యాగింగ్ భూతం వల్ల ఎంతో మంది విద్యార్థులు తమ బంగారు భవిష్యత్తును కోల్పోతున్నారు. నిజానికి అన్ని విద్యాసంస్థల్లో ర్యాగింగ్ నిరోధక కమిటీలు వేస్తున్నారు. ఈ భూతాన్ని తరిమికొట్టేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. ఇలాంటి అక్రమార్కులు చట్ట ప్రకారం నేరమని, చట్టప్రకారం శిక్షార్హమని తెలిసినా కొందరు ఆకతాయి విద్యార్థులు మాత్రం పైశాచికత్వాన్ని ప్రదర్శిస్తున్నారు. పరిచయం లేక ఇంటరాక్షన్ పేరుతో హద్దుమీరి వ్యవహరిస్తున్నారు. తాజాగా అలాంటి ఘటనే హైదరాబాద్లోని గాంధీ మెడికల్ కాలేజీలో వెలుగు చూసింది.
హైదరాబాద్ గాంధీ మెడికల్ కాలేజీలో మొదటి సంవత్సరం విద్యార్థులపై 10 మంది సీనియర్ విద్యార్థులు ర్యాగింగ్కు పాల్పడ్డారు. ఈ విషయాన్ని బాధిత విద్యార్థులు కళాశాల యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లారు. దీన్ని సీరియస్గా తీసుకున్న కాలేజీ యాజమాన్యం ఆ పది మంది సీనియర్ విద్యార్థులను హాస్టల్ నుంచి ఏడాది పాటు సస్పెండ్ చేసింది. ఏదైనా విద్యాసంస్థల్లో విద్యార్థులు ర్యాగింగ్కు పాల్పడితే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. ఇలాంటి ర్యాగింగ్లను సహించేది లేదని జిల్లా వైద్యాధికారి తెలిపారు. ఏదైనా మెడికల్ కాలేజీలో విద్యార్థులు ర్యాగింగ్కు పాల్పడితే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. అయితే ఇటీవల వరంగల్ మెడికల్ కాలేజీ వైద్యురాలు ప్రీతి సీనియర్ల వేధింపులతో ఆత్మహత్య చేసుకుంది. ప్రాణాలు కోల్పోయారు. అప్పటి నుంచి ఎందరో డాక్టర్లు ఆత్మహత్యలు చేసుకున్నా ర్యాగింగ్ కారణం కాదన్నారు. అయితే.. ఇలాంటి సమయంలో కూడా ర్యాగింగ్.. సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
Also Read
Read also: Chandrababu Arrest: చంద్రబాబు అరెస్ట్.. ములాఖత్ కు కుటుంబ సభ్యులు
తాజాగా ఏలూరు ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో ర్యాగింగ్ కలకలం రేగింది. ర్యాగింగ్ కారణంగా ఓ వైద్య విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసింది. ర్యాగింగ్ పేరుతో సీనియర్ల వేధింపులు తాళలేక ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రభుత్వాలు ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా ర్యాగింగ్ భూతం ఆగడం లేదు. దేశవ్యాప్తంగా విద్యాసంస్థల్లో కొన్నిచోట్ల ర్యాగింగ్ ఘటనలు వెలుగు చూస్తున్నాయి. వరంగల్ వైద్య విద్యార్థిని ప్రీతి ఆత్మహత్యకు సీనియర్ వేధింపులే కారణమని పోలీసులు ఇటీవల చార్జిషీట్లో పేర్కొన్నారు. ఈ ఏడాది జూన్ 7న పోలీసులు చార్జిషీటులో ఈ విషయాన్ని పేర్కొన్నారు. ప్రీతి ఆత్మహత్య రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇటీవల, పశ్చిమ బెంగాల్లోని జాదవ్పూర్ విశ్వవిద్యాలయంలో అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థి హాస్టల్ రెండవ అంతస్తు నుండి పడి మరణించాడు. ర్యాగింగ్లో భాగంగా ఓ యువకుడిని నగ్నంగా ఊరేగించి, తట్టుకోలేక విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడినట్లు వార్తలు వచ్చాయి. ఈ ఘటనలో 13 మంది విద్యార్థులను పోలీసులు అరెస్టు చేశారు.
Redmi Note 13 Pro Series : అదిరిపోయే ఫీచర్స్ తో రెడ్మి నోట్ 13ప్రో సిరీస్ వచ్చేస్తోంది…వివరాలివే..
తాజావార్తలు
-
LPG Cylinder Price: భారీగా పెరిగిన గ్యాస్ ధరలు.. 19 కిలోల వాణిజ్య LPG సిలిండర్ ధర రూ. 993 పెంపు
-
Astrology: మే 1 శుక్రవారం దినఫలాలు.. ఏ రాశివారు ఏ పరిహారం చెల్లించాలంటే..!
-
RCB vs GT : బెంగళూరును చిత్తు చేసిన టైటాన్స్.. గిల్ మెరుపులు
-
Screen Time Effects : స్క్రీన్ సమయం పెరగడం వల్ల మైగ్రేన్లు వస్తాయా.?
-
Off The Record : సీఎం సరికొత్త టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారా? బీజేపీ టార్గెట్ గా వ్యూహాలు?
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!