Hyderabad: గాంధీ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం.. 10 మంది సీనియర్లు సస్పెండ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad: తెలంగాణలో మరోసారి ర్యాగింగ్ కలకలం రేగింది. ఈ ర్యాగింగ్ భూతం వల్ల ఎంతో మంది విద్యార్థులు తమ బంగారు భవిష్యత్తును కోల్పోతున్నారు. నిజానికి అన్ని విద్యాసంస్థల్లో ర్యాగింగ్ నిరోధక కమిటీలు వేస్తున్నారు. ఈ భూతాన్ని తరిమికొట్టేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. ఇలాంటి అక్రమార్కులు చట్ట ప్రకారం నేరమని, చట్టప్రకారం శిక్షార్హమని తెలిసినా కొందరు ఆకతాయి విద్యార్థులు మాత్రం పైశాచికత్వాన్ని ప్రదర్శిస్తున్నారు. పరిచయం లేక ఇంటరాక్షన్ పేరుతో హద్దుమీరి వ్యవహరిస్తున్నారు. తాజాగా అలాంటి ఘటనే హైదరాబాద్లోని గాంధీ మెడికల్ కాలేజీలో వెలుగు చూసింది.
హైదరాబాద్ గాంధీ మెడికల్ కాలేజీలో మొదటి సంవత్సరం విద్యార్థులపై 10 మంది సీనియర్ విద్యార్థులు ర్యాగింగ్కు పాల్పడ్డారు. ఈ విషయాన్ని బాధిత విద్యార్థులు కళాశాల యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లారు. దీన్ని సీరియస్గా తీసుకున్న కాలేజీ యాజమాన్యం ఆ పది మంది సీనియర్ విద్యార్థులను హాస్టల్ నుంచి ఏడాది పాటు సస్పెండ్ చేసింది. ఏదైనా విద్యాసంస్థల్లో విద్యార్థులు ర్యాగింగ్కు పాల్పడితే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. ఇలాంటి ర్యాగింగ్లను సహించేది లేదని జిల్లా వైద్యాధికారి తెలిపారు. ఏదైనా మెడికల్ కాలేజీలో విద్యార్థులు ర్యాగింగ్కు పాల్పడితే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. అయితే ఇటీవల వరంగల్ మెడికల్ కాలేజీ వైద్యురాలు ప్రీతి సీనియర్ల వేధింపులతో ఆత్మహత్య చేసుకుంది. ప్రాణాలు కోల్పోయారు. అప్పటి నుంచి ఎందరో డాక్టర్లు ఆత్మహత్యలు చేసుకున్నా ర్యాగింగ్ కారణం కాదన్నారు. అయితే.. ఇలాంటి సమయంలో కూడా ర్యాగింగ్.. సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
Also Read
Read also: Chandrababu Arrest: చంద్రబాబు అరెస్ట్.. ములాఖత్ కు కుటుంబ సభ్యులు
తాజాగా ఏలూరు ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో ర్యాగింగ్ కలకలం రేగింది. ర్యాగింగ్ కారణంగా ఓ వైద్య విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసింది. ర్యాగింగ్ పేరుతో సీనియర్ల వేధింపులు తాళలేక ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రభుత్వాలు ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా ర్యాగింగ్ భూతం ఆగడం లేదు. దేశవ్యాప్తంగా విద్యాసంస్థల్లో కొన్నిచోట్ల ర్యాగింగ్ ఘటనలు వెలుగు చూస్తున్నాయి. వరంగల్ వైద్య విద్యార్థిని ప్రీతి ఆత్మహత్యకు సీనియర్ వేధింపులే కారణమని పోలీసులు ఇటీవల చార్జిషీట్లో పేర్కొన్నారు. ఈ ఏడాది జూన్ 7న పోలీసులు చార్జిషీటులో ఈ విషయాన్ని పేర్కొన్నారు. ప్రీతి ఆత్మహత్య రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇటీవల, పశ్చిమ బెంగాల్లోని జాదవ్పూర్ విశ్వవిద్యాలయంలో అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థి హాస్టల్ రెండవ అంతస్తు నుండి పడి మరణించాడు. ర్యాగింగ్లో భాగంగా ఓ యువకుడిని నగ్నంగా ఊరేగించి, తట్టుకోలేక విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడినట్లు వార్తలు వచ్చాయి. ఈ ఘటనలో 13 మంది విద్యార్థులను పోలీసులు అరెస్టు చేశారు.
Redmi Note 13 Pro Series : అదిరిపోయే ఫీచర్స్ తో రెడ్మి నోట్ 13ప్రో సిరీస్ వచ్చేస్తోంది…వివరాలివే..
తాజావార్తలు
-
UP: యూపీలో హర్యానా నటుడు అంకిత్ బలియాన్ హత్య
-
Sankranti 2027: అనిల్ రావిపూడికి ఈసారి టఫ్ ఫైట్.. 2027 సంక్రాంతి బరిలో బిగ్ వార్!
-
Nepal-Tibet Flood: వరదల్లో చిక్కుకున్న ఇషా ఫౌండేషన్కు చెందిన 77 మంది భక్తులు, రంగంలోకి సద్గురు
-
Bhatti Vikramarka : బొగ్గు దాటి బంగారం, రాగిపై సింగరేణి ఫోకస్.. భట్టి కీలక ఆదేశాలు
-
Toxic Makers: ‘ధురంధర్ 2’కు షాకిచ్చిన ‘టాక్సిక్’.. ఫ్యాన్స్కు మేకర్స్ కీలక విజ్ఞప్తి
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..