దళిత బంధు పై కేసీఆర్ మాటలు కోటలు దాటాయి: రఘునందన్ రావు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో నాగారం మండలం, తిరుమలగిరి మండలంలో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు పర్యటించారు. నాగారంలోని మండల కేంద్రంలో కడియం సోమక్క వెంకయ్య మెమోరియల్ చారిటబుల్ ట్రస్టు క్రికెట్ టోర్నమెంట్ కార్యక్రమానికి హాజరై విజేతలకు బహుమతులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రఘునందర్ రావు మాట్లాడుతూ.. కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తుంగతుర్తి ప్రాంతంలోని తిరుమలగిరి ప్రాంతాన్ని దళితబంధుకు పైలెట్ ప్రాజెక్టుగా తీసుకున్న ముఖ్యమంత్రి ఇంతవరకు ఎందుకు అమలు చేయడం లేదో సమాధానం చెప్పాలన్నారు.దళిత బంధు పై కేసీఆర్ మాటలు కోటలు దాటాయి తుంగతుర్తి వరకు చేరాయి కానీ దలిత బంధు అమలు కాలేదని విమర్శించారు.తుంగతుర్తి ప్రాంతంలో రాజకీయంగా ఎదుగుతున్న బీజేపీ పార్టీని దాడులతో అణగదొక్కాలని చూడటం ఎంతవరకు సమంజసమన్నారు.
Read Also: రేపటి నుంచి బీజేపీ మైక్రో డొనేషన్స్ ప్రారంభం
Also Read
- Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
- RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
- Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
- Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
ఏడాది కిందట అసెంబ్లీ సాక్షిగా చెప్పి సంవత్సరం గడిచినా ఇప్పటికీ అమలు చేయపోవడంతో ఆంతర్యం ఏమిటని దుయ్యబట్టారు. టీఆర్ఎస్ పార్టీ నాయకులుగా మారితే ఇసుక తరలించడానికి ట్రాక్టర్లకు అనుమతులు లభిస్తాయని ఎద్దేవా చేశారు. జీవో 377కి సంబంధించి అఖిలపక్ష నాయకులతో సమావేశం ఏర్పాటు చేయాలని సీఎం అడిగినా ఇప్పటి వరకు దానిపై స్పందన లేదన్నారు. చదువుకున్న విద్యావంతుడు ఈ ప్రాంతంలో ఎమ్మెల్యే అయితే ఈ ప్రాంతంలో అభివృద్ధి బాగా జరుగుతుంది అనుకున్నారన్నారు . ఈప్రాంత ప్రజలకు దళిత బంధు అమలు అమలవుతుంది అనుకున్నాం కానీ ఏమైంది. ఫిబ్రవరి 5 లోగా అభ్యర్థుల ఎంపికలో గైడ్లైన్స్ లేకుండా ఎలా పూర్తి చేయాలని సీఎంని ప్రశ్నిస్తున్నామన్నారు. ఉద్యోగులు, నిరుద్యోగులు ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. వారికి అండగా మేమున్నాం. ఉద్యోగ నిరుద్యోగ ఆత్మహత్యలు, ప్రభుత్వ హత్యగా భావించి వారిని ఆదుకోవాలన్నారు. సీఎం దళిత బంధు బీజేపీ నాయకులకు ఇష్టం లేదని నెపం బీజేపీ పై నెడుతున్నారన్నారు. తుంగతుర్తి నుండి అడుగుతున్న రాష్ట్రంలో అందరూ దళితులకు దళిత బంధు ఎప్పుడు ఇస్తారని అంటూ రఘునందన్ రావు ప్రశ్నించారు.
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!