దళిత బంధు పై కేసీఆర్ మాటలు కోటలు దాటాయి: రఘునందన్ రావు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో నాగారం మండలం, తిరుమలగిరి మండలంలో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు పర్యటించారు. నాగారంలోని మండల కేంద్రంలో కడియం సోమక్క వెంకయ్య మెమోరియల్ చారిటబుల్ ట్రస్టు క్రికెట్ టోర్నమెంట్ కార్యక్రమానికి హాజరై విజేతలకు బహుమతులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రఘునందర్ రావు మాట్లాడుతూ.. కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తుంగతుర్తి ప్రాంతంలోని తిరుమలగిరి ప్రాంతాన్ని దళితబంధుకు పైలెట్ ప్రాజెక్టుగా తీసుకున్న ముఖ్యమంత్రి ఇంతవరకు ఎందుకు అమలు చేయడం లేదో సమాధానం చెప్పాలన్నారు.దళిత బంధు పై కేసీఆర్ మాటలు కోటలు దాటాయి తుంగతుర్తి వరకు చేరాయి కానీ దలిత బంధు అమలు కాలేదని విమర్శించారు.తుంగతుర్తి ప్రాంతంలో రాజకీయంగా ఎదుగుతున్న బీజేపీ పార్టీని దాడులతో అణగదొక్కాలని చూడటం ఎంతవరకు సమంజసమన్నారు.
Read Also: రేపటి నుంచి బీజేపీ మైక్రో డొనేషన్స్ ప్రారంభం
Also Read
- Machilipatnam: కామర్స్ లెక్చరర్ 'కామ లీలలు'.. ఉద్యోగం ఇప్పిస్తానని ఆశ చూపిన వైనం.. సడెన్గా భార్య ఎంట్రీ..!
- Education Commission Chairman: విద్యా కమిషన్ చైర్మన్ పదవికి ఆకునూరి మురళి రాజీనామా.. సీఎస్కు లేఖ..
- Shocking: అది ఆహారం కాదు ఆత్మహత్య.. ప్లేట్లో విషాన్ని పెట్టుకుని తింటున్న హైదరాబాద్ యువత.. వెలుగులోకి షాకింగ్ నిజాలు..
- 150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
ఏడాది కిందట అసెంబ్లీ సాక్షిగా చెప్పి సంవత్సరం గడిచినా ఇప్పటికీ అమలు చేయపోవడంతో ఆంతర్యం ఏమిటని దుయ్యబట్టారు. టీఆర్ఎస్ పార్టీ నాయకులుగా మారితే ఇసుక తరలించడానికి ట్రాక్టర్లకు అనుమతులు లభిస్తాయని ఎద్దేవా చేశారు. జీవో 377కి సంబంధించి అఖిలపక్ష నాయకులతో సమావేశం ఏర్పాటు చేయాలని సీఎం అడిగినా ఇప్పటి వరకు దానిపై స్పందన లేదన్నారు. చదువుకున్న విద్యావంతుడు ఈ ప్రాంతంలో ఎమ్మెల్యే అయితే ఈ ప్రాంతంలో అభివృద్ధి బాగా జరుగుతుంది అనుకున్నారన్నారు . ఈప్రాంత ప్రజలకు దళిత బంధు అమలు అమలవుతుంది అనుకున్నాం కానీ ఏమైంది. ఫిబ్రవరి 5 లోగా అభ్యర్థుల ఎంపికలో గైడ్లైన్స్ లేకుండా ఎలా పూర్తి చేయాలని సీఎంని ప్రశ్నిస్తున్నామన్నారు. ఉద్యోగులు, నిరుద్యోగులు ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. వారికి అండగా మేమున్నాం. ఉద్యోగ నిరుద్యోగ ఆత్మహత్యలు, ప్రభుత్వ హత్యగా భావించి వారిని ఆదుకోవాలన్నారు. సీఎం దళిత బంధు బీజేపీ నాయకులకు ఇష్టం లేదని నెపం బీజేపీ పై నెడుతున్నారన్నారు. తుంగతుర్తి నుండి అడుగుతున్న రాష్ట్రంలో అందరూ దళితులకు దళిత బంధు ఎప్పుడు ఇస్తారని అంటూ రఘునందన్ రావు ప్రశ్నించారు.
తాజావార్తలు
-
KTR : అసెంబ్లీ రద్దు చెయ్.. ప్రజల తీర్పు ఏంటో చూద్దాం
-
Machilipatnam: కామర్స్ లెక్చరర్ ‘కామ లీలలు’.. ఉద్యోగం ఇప్పిస్తానని ఆశ చూపిన వైనం.. సడెన్గా భార్య ఎంట్రీ..!
-
Education Commission Chairman: విద్యా కమిషన్ చైర్మన్ పదవికి ఆకునూరి మురళి రాజీనామా.. సీఎస్కు లేఖ..
-
Shocking: అది ఆహారం కాదు ఆత్మహత్య.. ప్లేట్లో విషాన్ని పెట్టుకుని తింటున్న హైదరాబాద్ యువత.. వెలుగులోకి షాకింగ్ నిజాలు..
-
Protein Food : అమ్మ జ్ఞాపకం.. కేవలం 5 నిమిషాల్లో తయారయ్యే రుచికరమైన లావోటియన్ ‘ఎగ్ హాష్’!
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!