దళిత బంధు పై కేసీఆర్ మాటలు కోటలు దాటాయి: రఘునందన్ రావు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో నాగారం మండలం, తిరుమలగిరి మండలంలో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు పర్యటించారు. నాగారంలోని మండల కేంద్రంలో కడియం సోమక్క వెంకయ్య మెమోరియల్ చారిటబుల్ ట్రస్టు క్రికెట్ టోర్నమెంట్ కార్యక్రమానికి హాజరై విజేతలకు బహుమతులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రఘునందర్ రావు మాట్లాడుతూ.. కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తుంగతుర్తి ప్రాంతంలోని తిరుమలగిరి ప్రాంతాన్ని దళితబంధుకు పైలెట్ ప్రాజెక్టుగా తీసుకున్న ముఖ్యమంత్రి ఇంతవరకు ఎందుకు అమలు చేయడం లేదో సమాధానం చెప్పాలన్నారు.దళిత బంధు పై కేసీఆర్ మాటలు కోటలు దాటాయి తుంగతుర్తి వరకు చేరాయి కానీ దలిత బంధు అమలు కాలేదని విమర్శించారు.తుంగతుర్తి ప్రాంతంలో రాజకీయంగా ఎదుగుతున్న బీజేపీ పార్టీని దాడులతో అణగదొక్కాలని చూడటం ఎంతవరకు సమంజసమన్నారు.
Read Also: రేపటి నుంచి బీజేపీ మైక్రో డొనేషన్స్ ప్రారంభం
Also Read
- Se*xual Assault: తుక్కుగూడ నర్సు శిరీష హత్య కేసు.. లైంగిక దాడి చేసినట్లు నిర్ధారణ.. నిందితుడి అరెస్ట్.!
- Hockey World Cup 2026 విజేతగా జర్మనీ.. స్పెయిన్పై 1-0తో విజయం.!
- Vem Narender Reddy: మార్చి 2027 వరకు లక్ష ఉద్యోగాల భర్తీ.. వారానికి ఒక నోటిఫికేషన్.!
- Romanchakam: ఆయన పిలిస్తే రాకపోతే బతికి వేస్ట్.. విజయ్ దేవరకొండ ఎమోషనల్ స్పీచ్..!
ఏడాది కిందట అసెంబ్లీ సాక్షిగా చెప్పి సంవత్సరం గడిచినా ఇప్పటికీ అమలు చేయపోవడంతో ఆంతర్యం ఏమిటని దుయ్యబట్టారు. టీఆర్ఎస్ పార్టీ నాయకులుగా మారితే ఇసుక తరలించడానికి ట్రాక్టర్లకు అనుమతులు లభిస్తాయని ఎద్దేవా చేశారు. జీవో 377కి సంబంధించి అఖిలపక్ష నాయకులతో సమావేశం ఏర్పాటు చేయాలని సీఎం అడిగినా ఇప్పటి వరకు దానిపై స్పందన లేదన్నారు. చదువుకున్న విద్యావంతుడు ఈ ప్రాంతంలో ఎమ్మెల్యే అయితే ఈ ప్రాంతంలో అభివృద్ధి బాగా జరుగుతుంది అనుకున్నారన్నారు . ఈప్రాంత ప్రజలకు దళిత బంధు అమలు అమలవుతుంది అనుకున్నాం కానీ ఏమైంది. ఫిబ్రవరి 5 లోగా అభ్యర్థుల ఎంపికలో గైడ్లైన్స్ లేకుండా ఎలా పూర్తి చేయాలని సీఎంని ప్రశ్నిస్తున్నామన్నారు. ఉద్యోగులు, నిరుద్యోగులు ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. వారికి అండగా మేమున్నాం. ఉద్యోగ నిరుద్యోగ ఆత్మహత్యలు, ప్రభుత్వ హత్యగా భావించి వారిని ఆదుకోవాలన్నారు. సీఎం దళిత బంధు బీజేపీ నాయకులకు ఇష్టం లేదని నెపం బీజేపీ పై నెడుతున్నారన్నారు. తుంగతుర్తి నుండి అడుగుతున్న రాష్ట్రంలో అందరూ దళితులకు దళిత బంధు ఎప్పుడు ఇస్తారని అంటూ రఘునందన్ రావు ప్రశ్నించారు.
తాజావార్తలు
-
Ayodhya Ram Mandir: రూ.4కోట్లు చెక్ ఇచ్చింది.. అకౌంట్లో చూస్తే 3 రూపాయలే ఉన్నాయ్..అయోధ్య చెక్ బౌన్స్ కథ వింటే..
-
NBK 112 : బాలయ్య – కొరటాల సినిమాలో తమిళ స్టార్ హీరో?
-
Se*xual Assault: తుక్కుగూడ నర్సు శిరీష హత్య కేసు.. లైంగిక దాడి చేసినట్లు నిర్ధారణ.. నిందితుడి అరెస్ట్.!
-
Sardar 2: కార్తి ‘సర్దార్ 2’ ట్రైలర్ కు టైమ్ ఫిక్స్ చేసిన మేకర్స్!
-
CTET 2026: సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్.. దరఖాస్తుకు రేపే చివరి ఛాన్స్..
ట్రెండింగ్
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!