Punjab Politics: నిన్న బాదల్, నేడు రాఘవ్ చద్దాలతో ప్రధాని మోడీ భేటీ.. రసవత్తరంగా పంజాబ్ పాలిటిక్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Punjab Politics: రాజ్యసభ ఎంపీ, ఇటీవల ఆప్ నుంచి బీజేపీలో చేరిన రాఘవ్ చద్దా ప్రధాని నరేంద్రమోడీతో శనివారం భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. ఈ సమావేశాన్ని చద్దా ‘‘చిరస్మరణీయమైన ఉదయం’’గా అభివర్ణించారు. పంజాబ్ ఎన్నికలకు ముందు బీజేపీ చద్దాకు కీలక బాధ్యతలు అప్పగించబోతుందా.? అనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. ప్రధాని మోడీతో భేటీ అయిన చిత్రాలను ఆయన సోషల్ మీడియాతో పంచుకున్నారు. అయితే, ఏ అంశాలపై మాట్లాడుకున్నారనే విషయాన్ని చద్దా వెల్లడించలేదు.
చద్దా, బాదల్తో మోడీ భేటీలకు ప్రాధాన్యత..
పంజాబ్ ఎన్నికలకు ముందు చద్దా, మోడీతో భేటీ కావడంతో ఆ రాష్ట్రంలో కీలకమైన రాజకీయ మార్పులు జరుగుతాయని తెలుస్తోంది. చద్దాకు పంజాబ్తో మంచి సంబంధాలు ఉన్నాయి. జలంధర్తో కుటుంబ సంబంధాలు ఉన్నాయి. చద్దాతో భేటీకి ముందు అంటే శుక్రవారం శిరోమణి అకాలీదళ్ చీఫ్ సుఖ్బీర్ సింగ్ బాదల్ ప్రధాని మోడీతో భేటీ అయ్యారు. ఈ రెండు కీలక సమావేశాల తర్వాత పంజాబ్లో బీజేపీ కీలక వ్యూహాలు రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆప్ పంజాబ్లో అధికారంలో ఉంది. రైతుల ఉద్యమం కారణంగా అకాలీదళ్తో బీజేపీకి ఉన్న 25 ఏళ్ల పొత్తు చెదిరిపోయింది. ఇప్పుడు మళ్లీ ఈ రెండు పార్టీలు జతకట్టే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
Also Read
- Renu Dhariyal: అయ్ బాబోయ్ ఎంతపొడుగో.. జుట్టు పెంచుకుంటూ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కొట్టేసిన మహిళ..
- PM Modi: భవిష్యత్ భారత్ నిర్మాతలు మీరే.. యువతకు ప్రధాని మోడీ స్ఫూర్తిదాయక సందేశం..
- Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
- HAPIDA SKYNeX Flying Vehicle: ట్రాఫిక్కు చెక్ పెట్టే ‘ఎలక్ట్రిక్ ఫ్లయింగ్ కార్’.. యువకుడి అద్భుత ఆవిష్కరణ! (వీడియో)
చద్దాకు ఎందుకు ప్రాధాన్యం:
పంజాబ్ నుంచే రాజ్యసభకు చద్దా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయనకు ఆ రాష్ట్ర రాజకీయాలపై మంచి పట్టు ఉంది. అమృత్సర్, లుధియానా, జలంధర్ వంటి ప్రధాన నగరాల్లో పార్టీ ప్రభావాన్ని పెంచుకోవడానికి చద్దా ఉపయోగపడే అవకాశం ఉందని అంచనాలు ఉన్నాయి.పంజాబ్లో వ్యాపార వర్గాలు, పట్టణ మధ్యతరగతి ఓటర్లలో పట్టు పెంచుకోవడానికి చద్దా ఉపయోగపడుతాడని బీజేపీ భావిస్తోంది.
తాజావార్తలు
-
Punjab Politics: నిన్న బాదల్, నేడు రాఘవ్ చద్దాలతో ప్రధాని మోడీ భేటీ.. రసవత్తరంగా పంజాబ్ పాలిటిక్స్..
-
Bonda Uma: శాంతియుత ఆందోళనలకు అభ్యంతరం లేదు.. లేదంటే మా స్టైల్లో బుద్ధి చెబుతాం..!
-
Ramayana: షాక్ ఇచ్చిన మేకర్స్.. విదేశాల్లో రెండు రోజుల ముందే ‘రామాయణం’…
-
CM Chandrababu: చట్ట వ్యతిరేక నిరసనలు సహించం.. వైసీపీ దీక్షలపై సీఎం కీలక వ్యాఖ్యలు..!
-
HMD Touch AI: 1950mAh బ్యాటరీతో.. హెచ్ఎమ్డి టచ్ ఏఐ ఫోన్ గ్లోబల్ మార్కెట్లలో విడుదలకు రెడీ!
ట్రెండింగ్
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్కు ముందే ధరలు లీక్.!
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!