నాలుగేళ్ల క్రితమే ఆ విషయం తెలుసంటున్న ‘రాధేశ్యామ్’ దర్శకుడు
ప్రభాస్ హీరోగా నటించిన ‘రాధేశ్యామ్’ సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేసింది. ఇటీవల ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించిన యూనిట్.. తాజాగా హైదరాబాద్లో ప్రెస్మీట్ ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు రాధాకృష్ణకుమార్ మాట్లాడుతూ.. ఈ మూవీ మన మనసుకు, నమ్మకానికి మధ్య జరిగే పోరాటం అని చెప్పాడు. ఇది జరిగిపోయిన స్టోరీ కాదు.. జరగబోయే స్టోరీ కాదు… ఎప్పుడూ నడుస్తున్న స్టోరీనే అని… అన్ని వయసుల వారికి ఈ మూవీ నచ్చుతుందని దర్శకుడు ధీమా వ్యక్తం చేశాడు. ఈ సినిమా గురించి తాను చాలా రీసెర్చ్ చేశానని.. ముఖ్యంగా ఏపీ, తెలంగాణ, తమిళనాడు, మహారాష్ట్రలోని పలువురు జ్యోతిష్యులను కలిశానని.. అందులో ఒక జ్యోతిష్యుడు ఈ సినిమా 2022 జనవరిలో విడుదలవుతుందని నాలుగేళ్ల క్రితమే చెప్పారని దర్శకుడు వివరించాడు. హీరోయిన్ పూజాహెగ్డే ఈ మూవీలో డాక్టర్ పాత్రలో కనిపిస్తుందన్నాడు.
కరోనా కారణంగా ఈ సినిమా రావడం లేట్ అయిందని దర్శకుడు రాధాకృష్ణకుమార్ పేర్కొన్నాడు. లవ్ అర్థమయ్యే ప్రతి ఒక్కరికీ ఈ సినిమా కనెక్ట్ అవుతుందని తెలిపాడు. ప్రభాస్ ఈ సినిమా చేయడం తనకు ఎంతో సంతోషంగా ఉందన్నాడు. ఈ సినిమాపై నమ్మకంతోనే కృష్ణంరాజు గారు ఈ సినిమా నిర్మాణంలో భాగస్వామ్యం అయ్యారని వివరించాడు. వేల సంవత్సరాల క్రితం నుంచి ఉన్న ఓ ప్రశ్నకు సమాధానంగానే ఈ సినిమాను తెరకెక్కించామన్నారు. ఈ సినిమాను ఎన్ని థియేటర్లలో విడుదల చేస్తారనే విషయం నిర్మాతలకే తెలుసు అని… తనకు టెక్నికల్ విషయాల గురించి పెద్దగా ఐడియా లేదని దర్శకుడు చెప్పాడు. కరోనా కారణంగా ఈ సినిమాకు చెందిన 150 మంది ఇటలీలో ఎలాంటి వర్క్ లేకుండా చిక్కుకుపోయామని.. ఆ పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పడానికే భయంగా ఉందన్నాడు. ఈ సినిమా అన్ని వర్గాల వారికి నచ్చుతుందనే నమ్మకంతో ఉన్నామని చెప్పాడు. ‘రాధేశ్యామ్’ వీఎఫ్ఎక్స్ వర్క్ 12 దేశాల్లో చేశామని రాధాకృష్ణ వెల్లడించాడు. ఫిలాసఫీ అనే నేపథ్యంగా తీసిన ఈ సినిమా అందరికీ స్ఫూర్తినిస్తుందన్నాడు.
Also Read
- Petrol Price: బిగ్ షాక్.. లీటర్ పెట్రోల్పై రూ.25, డీజిల్పై రూ.28 రాత్రికి రాత్రే పెంపు..?
- Storyboard : తమిళనాడు రాజకీయం ఎలా ఉంది..? టీవీకే తో విజయ్ ఏం చేయబోతున్నారు..?
- Amazon Great India Summer Sale: అమెజాన్ సమ్మర్ సేల్లో.. ల్యాప్టాప్లు, స్మార్ట్ఫోన్లు సగం కంటే తక్కువ ధరకే!
- Telangana : పోలీస్ శాఖలో భారీ పదోన్నతులు.. సజ్జనార్, మహేష్ భగవత్ లకు డీజీపీ హోదా..!
తాజావార్తలు
-
Off The Record : ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా చర్యలు వద్దన్న హైకోర్ట్
-
Petrol Price: బిగ్ షాక్.. లీటర్ పెట్రోల్పై రూ.25, డీజిల్పై రూ.28 రాత్రికి రాత్రే పెంపు..?
-
Asian Games: ‘ఆసియా క్రీడల’ ప్రత్యక్ష ప్రసారం సోనీ నెట్వర్క్ చేతికి.. యాప్లో కూడా..
-
Storyboard : తమిళనాడు రాజకీయం ఎలా ఉంది..? టీవీకే తో విజయ్ ఏం చేయబోతున్నారు..?
-
Amazon Great India Summer Sale: అమెజాన్ సమ్మర్ సేల్లో.. ల్యాప్టాప్లు, స్మార్ట్ఫోన్లు సగం కంటే తక్కువ ధరకే!
ట్రెండింగ్
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?