నాలుగేళ్ల క్రితమే ఆ విషయం తెలుసంటున్న ‘రాధేశ్యామ్’ దర్శకుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రభాస్ హీరోగా నటించిన ‘రాధేశ్యామ్’ సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేసింది. ఇటీవల ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించిన యూనిట్.. తాజాగా హైదరాబాద్లో ప్రెస్మీట్ ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు రాధాకృష్ణకుమార్ మాట్లాడుతూ.. ఈ మూవీ మన మనసుకు, నమ్మకానికి మధ్య జరిగే పోరాటం అని చెప్పాడు. ఇది జరిగిపోయిన స్టోరీ కాదు.. జరగబోయే స్టోరీ కాదు… ఎప్పుడూ నడుస్తున్న స్టోరీనే అని… అన్ని వయసుల వారికి ఈ మూవీ నచ్చుతుందని దర్శకుడు ధీమా వ్యక్తం చేశాడు. ఈ సినిమా గురించి తాను చాలా రీసెర్చ్ చేశానని.. ముఖ్యంగా ఏపీ, తెలంగాణ, తమిళనాడు, మహారాష్ట్రలోని పలువురు జ్యోతిష్యులను కలిశానని.. అందులో ఒక జ్యోతిష్యుడు ఈ సినిమా 2022 జనవరిలో విడుదలవుతుందని నాలుగేళ్ల క్రితమే చెప్పారని దర్శకుడు వివరించాడు. హీరోయిన్ పూజాహెగ్డే ఈ మూవీలో డాక్టర్ పాత్రలో కనిపిస్తుందన్నాడు.
కరోనా కారణంగా ఈ సినిమా రావడం లేట్ అయిందని దర్శకుడు రాధాకృష్ణకుమార్ పేర్కొన్నాడు. లవ్ అర్థమయ్యే ప్రతి ఒక్కరికీ ఈ సినిమా కనెక్ట్ అవుతుందని తెలిపాడు. ప్రభాస్ ఈ సినిమా చేయడం తనకు ఎంతో సంతోషంగా ఉందన్నాడు. ఈ సినిమాపై నమ్మకంతోనే కృష్ణంరాజు గారు ఈ సినిమా నిర్మాణంలో భాగస్వామ్యం అయ్యారని వివరించాడు. వేల సంవత్సరాల క్రితం నుంచి ఉన్న ఓ ప్రశ్నకు సమాధానంగానే ఈ సినిమాను తెరకెక్కించామన్నారు. ఈ సినిమాను ఎన్ని థియేటర్లలో విడుదల చేస్తారనే విషయం నిర్మాతలకే తెలుసు అని… తనకు టెక్నికల్ విషయాల గురించి పెద్దగా ఐడియా లేదని దర్శకుడు చెప్పాడు. కరోనా కారణంగా ఈ సినిమాకు చెందిన 150 మంది ఇటలీలో ఎలాంటి వర్క్ లేకుండా చిక్కుకుపోయామని.. ఆ పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పడానికే భయంగా ఉందన్నాడు. ఈ సినిమా అన్ని వర్గాల వారికి నచ్చుతుందనే నమ్మకంతో ఉన్నామని చెప్పాడు. ‘రాధేశ్యామ్’ వీఎఫ్ఎక్స్ వర్క్ 12 దేశాల్లో చేశామని రాధాకృష్ణ వెల్లడించాడు. ఫిలాసఫీ అనే నేపథ్యంగా తీసిన ఈ సినిమా అందరికీ స్ఫూర్తినిస్తుందన్నాడు.
Also Read
- Ireland: ఐర్లాండ్ చేతిలో ఓడిన 8వ దేశంగా భారత్.. ఇక మిగిలింది ఆ మూడే..
- Off The Record: కందుకూరు టీడీపీలో సిట్టింగ్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే
- Shreyas Iyer: ఐర్లాండ్ చేతిలో ఓటమికి కారణం ఇదే.. నిజాన్ని అంగీకరించిన శ్రేయాస్ అయ్యర్..
- India Lose: ప్రపంచ ఛాంపియన్ల పరువు ఐర్లాండ్ వీధుల్లో పారేశారు.. శ్రేయాస్ అయ్యర్పై ఆగ్రహం..
తాజావార్తలు
-
Ireland: ఐర్లాండ్ చేతిలో ఓడిన 8వ దేశంగా భారత్.. ఇక మిగిలింది ఆ మూడే..
-
Off The Record: కందుకూరు టీడీపీలో సిట్టింగ్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే
-
Shreyas Iyer: ఐర్లాండ్ చేతిలో ఓటమికి కారణం ఇదే.. నిజాన్ని అంగీకరించిన శ్రేయాస్ అయ్యర్..
-
Pulse Polio: 28న పల్స్ పోలియోకు తెలంగాణ రెడీ.!
-
India Lose: ప్రపంచ ఛాంపియన్ల పరువు ఐర్లాండ్ వీధుల్లో పారేశారు.. శ్రేయాస్ అయ్యర్పై ఆగ్రహం..
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!