Rajasthan: “గిరిజనులకు DNA టెస్ట్”.. విద్యాశాఖ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు..
- గిరిజనులపై రాజస్థాన్ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు..
- డీఎన్ఏ టెస్టులు చేస్తామని కామెంట్స్..
- మంత్రి వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఫైర్..
- క్షమాపణలు చెప్పాలని గిరిజన సంఘాల డిమాండ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rajasthan: రాజస్థాన్ విద్యాశాఖ మంత్రి, బీజేపీ నేత మదన్ దిలావర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. ‘గిరిజనులకు డీఎన్ఏ పరీక్ష’ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపై ప్రతిపక్ష కాంగ్రెస్ మండిపడుతోంది. భారతీయ ఆదివాసీ పార్టీ(బీఏపీ), రాజస్థాన్ గిరిజన సంఘాలు కూడా మంత్రి వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండించాయి. కోటాలోని రామ్ గంజ్ మండికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే, మంత్రి దిలావర్..‘‘ గిరిజనులు హిందువులు కాదని’’ బీఏపీ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ డీఎన్ఏ వ్యాఖ్యలు చేశారు.
Read Also: UP: మాయావతి దిద్దుబాటు చర్యలు.. వారసుడిగా తిరిగి మేనల్లుడు నియామకం
Also Read
- Meenakshi Natarajan: మీనాక్షి నటరాజన్కు తెలంగాణలో నమోదైన కేసు గురించే తెలియదా? అసలు కేసు మిస్టరీ ఏంటి?
- TMC Crisis: నమ్మినవారే నట్టేట ముంచారు.. రెబల్ క్యాంప్లో మమత బెనర్జీ విధేయులు..
- Saturday Holiday: ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం.. ఇక అన్ని శనివారాలు సెలవులే.. తెలంగాణలో..?
- PM Modi: ఎన్డీఏ నేతలకు ఝుల్మురి తినిపించిన మోడీ.. వీడియో వైరల్
దిలావర్ మాట్లాడుతూ.. ‘‘వారు హిందువులా కాదా అనేది వారి పూర్వీకులను అడుగుతామే. వాళ్లను కలుసుకుని మేము వారి వంశవృక్షాన్ని నమోదు చేస్తాము. వారు హిందువులు కాకుంటే డీఎన్ఏ పరీక్ష నిర్వహించి, వారు వారి తండ్రుల పిల్లలు అవునా..కాదా అనే దాన్ని తేలుస్తాము’’ అని అన్నారు. ఈ ప్రకటన తర్వాత ప్రతిపక్ష పార్టీ నేతలు గిరిజనులు తమ రక్తనమూనాలను సీఎం భజన్ లాల్కి పంపాలని కోరుతూ ప్రచారాన్ని ప్రారంభిస్తామని చెప్పారు. దిలావర్ గిరిజన సమాజాన్ని అవమానించారని బన్స్వారా లోక్సభ ఎంపీ రాజ్కుమార్ రోట్ అన్నారు. ఆయన క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. రాజస్థాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు గోవింద్ సింగ్ దోతస్రా దిలావర్ను “మానసిక రోగి”గా అభివర్ణించారు. గిరిజనులపై ఆయన చేసిన వ్యాఖ్యల్ని ఖండించారు.
తాజావార్తలు
-
Krrish 4 : ‘క్రిష్ 4’ ఆలస్యానికి కారణం అదే?
-
LGBT – A Legal Battle: ‘ఎల్జీబీటీ’ల ఆక్రందనలపై సినిమా.. జూన్ 19న విడుదల!
-
Varalaxmi Sarathkumar : వరలక్ష్మి శరత్కుమార్ను ప్రమోషన్స్’కి రమ్మని అడుక్కున్నా..అడుగడుగునా ఇబ్బంది పెట్టింది.. దర్శకుడు సంచలనం!
-
Meenakshi Natarajan: మీనాక్షి నటరాజన్కు తెలంగాణలో నమోదైన కేసు గురించే తెలియదా? అసలు కేసు మిస్టరీ ఏంటి?
-
NBK-Vivek Athreya: బాలకృష్ణ బర్త్ డే వేడుకల్లో వివేక్ ఆత్రేయ – మైత్రీ రవిశంకర్.. వైరల్ ఫోటో వెనుక అసలు కథ ఇదేనా!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!