Imran Khan : ఇమ్రాన్ ఖాన్కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన ఇస్లామాబాద్ హైకోర్టు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇస్లామాబాద్లోని ఉగ్రవాద నిరోధక కోర్టు ఇవాళ (మంగళవారం) జ్యుడిషియల్ కాంప్లెక్స్ వద్ద హింసకు సంబంధించిన ఎనిమిది ఆరోపణలపై PTI నాయకుడు ఇమ్రాన్ ఖాన్కు బెయిల్ మంజూరు చేసింది. PTI చీఫ్ అభ్యర్థనకు సానూకులంగా స్పందించిన న్యాయమూర్తి జూన్ 8 వరకు బెయిల్ మంజూరు చేశారు. ఈరోజు ముందుగా, అల్-ఖాదిర్ ట్రస్ట్ సమస్యకు సంబంధించి, మాజీ ప్రధాని మరియు అతని భార్య బుష్రా బీబీ కూడా ఇస్లామాబాద్లోని అకౌంటబిలిటీ కోర్టు (NAB) నుండి బెయిల్ పొందారు.
Also Read : Hansika: స్టార్ హీరో డేట్ కు వస్తావా అంటూ టార్చర్ పెట్టాడు.. హన్సిక సంచలన వ్యాఖ్యలు
Also Read
- NEET-UG 2026 paper leak: నీట్ పేపర్ లీక్ను ఛేదించిన సీబీఐ.. అసలు సూత్రధారి కెమిస్ట్రీ లెక్చరర్..
- Chennai: టెక్ మహీంద్రా కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం.. మంటల్లో ఆఫీస్ దగ్ధం
- Pawan Kalyan : ఒక్కడిగా మొదలై.. లక్షలాది మంది సైన్యంగా.. జనసేన విస్తరణపై పవన్ కీలక వ్యాఖ్యలు.!
- FSSAI : పామాయిల్పై కీలక ప్రకటన.. అపోహలు వద్దు.. అది సురక్షితం..!
అల్ ఖదీర్ ట్రస్ట్ కేసులో ఇమ్రాన్ ఖాన్ భార్య బుష్రా బీబీకి అకౌంటబిలిటీ కోర్టు మే 31 వరకు బెయిల్ మంజూరు చేసింది. NAB తనను అరెస్ట్ చేయకుండా ఆపడానికి బెయిల్ కోసం ఆమె నిన్న కోర్టులో ఒక పిటిషన్ను దాఖలు చేసింది. తను కోర్టుకు హాజరు కావడానికి రాజధానిలో ఉన్నప్పుడు అరెస్టు చేయబడే 80శాతం అవకాశాలు ఉన్నాయని తాను నమ్ముతున్నట్లు ఇమ్రాన్ ఇప్పటికే పేర్కొన్నాడు.
Also Read : Jagananna Vidya Deevena: విద్యార్థులకు శుభవార్త.. రేపే ఆ మొత్తం ఖాతాల్లో జమ
అయితే, గత రాత్రి ట్విట్టర్ స్పేసెస్లో జరిగిన సెషన్లో తనను అరెస్టు చేసినట్లయితే శాంతిని కాపాడాలని ఇమ్రాన్ తన అభిమానులను కోరారు. మీరు హింసాత్మకంగా ప్రవర్తిస్తే, ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకునే అవకాశం ఉన్నందున శాంతిని కాపాడాలని నేను ప్రతి ఒక్కరినీ కోరుతున్నాను అని ఇమ్రాన్ ఖాన్ తెలిపారు. అతను ప్రతి సందర్భంలోనూ బెయిల్ మంజూరు చేయబడినప్పటికీ.. మరో కేసులో PTI ఛైర్మన్ ఇమ్రాన్ ఖాన్ ను అరెస్టు చేసే అవకాశం అధికంగా ఉంది.
Also Read : Malladi: ‘కువారి బహు’ నుండి ‘8 ఎ. ఎం. మెట్రో’ వరకూ!
తనకు అవసరమైన అన్ని బెయిల్లు ఉన్నాయి.. కానీ పరిస్థితులను బట్టి వారు నన్ను ఇంకా నిర్బంధించవచ్చని ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యానించారు. జనరల్ హెడ్క్వార్టర్స్ వెలుపల కూడా అహింసా ర్యాలీ నిర్వహించకుండా ఎవరూ నిరోధించలేరు.. డాన్ నివేదించిన ప్రకారం శాంతియుత నిరసన ప్రాథమిక హక్కు అని ఆయన అన్నారు. ఇమ్రాన్ మరియు అతని భార్య బుష్రా బీబీకి ఈ నెల ప్రారంభంలో అల్-ఖాదిర్ ట్రస్ట్ కేసు మరియు వ్యక్తిగత లాభం కోసం.. 190 మిలియన్ల అక్రమ బదిలీని సులభతరం చేయడంలో ప్రభుత్వ అధికారి దుర్వినియోగానికి పాల్పడ్డారనే ఆరోపణలపై విచారణకు సంబంధించి NAB సమన్లు జారీ చేసింది.
తాజావార్తలు
-
NEET-UG 2026 paper leak: నీట్ పేపర్ లీక్ను ఛేదించిన సీబీఐ.. అసలు సూత్రధారి కెమిస్ట్రీ లెక్చరర్..
-
Viral Suit Chef: రోడ్డు పక్కన ఫ్రైడ్ రైస్ అమ్ముతూ నెల రూ.7 లక్షలు సంపాదిస్తున్న 19 ఏళ్ల కుర్రాడు..
-
Chennai: టెక్ మహీంద్రా కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం.. మంటల్లో ఆఫీస్ దగ్ధం
-
Pawan Kalyan : ఒక్కడిగా మొదలై.. లక్షలాది మంది సైన్యంగా.. జనసేన విస్తరణపై పవన్ కీలక వ్యాఖ్యలు.!
-
FSSAI : పామాయిల్పై కీలక ప్రకటన.. అపోహలు వద్దు.. అది సురక్షితం..!
ట్రెండింగ్
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!