Farmers Protest: హర్యానాలో అన్నదాతల ఆందోళన.. కురుక్షేత్ర-ఢిల్లీ జాతీయ రహదారి దిగ్బంధం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Farmers Protest: హర్యానాలో రైతులు ఆందోళన తీవ్రరూపం దాల్చింది.ఈ క్రమంలో జాతీయ రహదారి-44 ను రైతులు దిగ్బంధించారు. పొద్దు తిరుగుడు పంటకు మద్ధతు ధర ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నిరసనకు దిగారు.ఈ నేపథ్యంలో ఆందోళన చేస్తున్న రైతులకు యూపీ, పంజాబ్ రైతులు మద్దతు తెలిపారు. అదేవిధంగా రైతులకు రెజ్లర్లు సైతం మద్దతు తెలిపారు. రైతులు మంగళవారం హర్యానాలోని కురుక్షేత్ర వద్ద ఢిల్లీ-అమృత్సర్ జాతీయ రహదారిని(ఎన్హెచ్ 44) దిగ్బంధం చేశారు. పొద్దు తిరుగుడు పువ్వు గింజలకు కనీస మద్దతు ధర ఇవ్వకూడదని హర్యానా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ రైతులు ఆందోళన చేపట్టారు. రైతులు జాతీయ రహదారిని దిగ్బంధం చేయడంతో ఢిల్లీ-అమృత్సర్ జాతీయ రహదారి మీద ట్రాఫిక్ స్తంభించిపోయింది.
Read Also: Aurangzeb Picture: వాట్సాప్ ప్రొఫైల్ పిక్చర్గా ఔరంగజేబు ఫొటో.. నవీ ముంబై వ్యక్తి అరెస్ట్!
Also Read
- Ireland: ఐర్లాండ్ చేతిలో ఓడిన 8వ దేశంగా భారత్.. ఇక మిగిలింది ఆ మూడే..
- Off The Record: కందుకూరు టీడీపీలో సిట్టింగ్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే
- Shreyas Iyer: ఐర్లాండ్ చేతిలో ఓటమికి కారణం ఇదే.. నిజాన్ని అంగీకరించిన శ్రేయాస్ అయ్యర్..
- India Lose: ప్రపంచ ఛాంపియన్ల పరువు ఐర్లాండ్ వీధుల్లో పారేశారు.. శ్రేయాస్ అయ్యర్పై ఆగ్రహం..
పొద్దుతిరుగుడు విత్తనాలకు మద్ధతు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రైతులు జాతీయ రహదారిపైకి చేరుకున్నారు. కురుక్షేత్ర జిల్లాలోని పిప్లి సమీపంలోని ఫ్లై ఓవర్పై వారు గుమిగూడారు. మహాపంచాయత్లో భారతీయ కిసాన్ యూనియన్ నాయకుడు రాకేష్ టికాయత్తో సహా కీలక రైతు నాయకులతో పాటు, రెజ్లర్ బజరంగ్ పునియా కూడా ఉన్నారు. రెజ్లర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ) చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్పై చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న అగ్రశ్రేణి గ్రాప్లర్లలో అతను ఒకడు.
రాష్ట్ర ప్రభుత్వం పొద్దుతిరుగుడు విత్తనాలను మద్దతు ధరకు కొనుగోలు చేయడం లేదని, తమ ఉత్పత్తులను క్వింటాల్కు రూ. 6,400 ఎంఎస్పీకి రూ. 4,000 చొప్పున ప్రైవేట్ కొనుగోలుదారులకు విక్రయించాల్సి వచ్చిందని నిరసన వ్యక్తం చేసిన రైతులు పేర్కొన్నారు. పొద్దుతిరుగుడు విత్తనాలను క్వింటాల్కు రూ.6,400 ఎంఎస్పీతో ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.
తాజావార్తలు
-
Ireland: ఐర్లాండ్ చేతిలో ఓడిన 8వ దేశంగా భారత్.. ఇక మిగిలింది ఆ మూడే..
-
Off The Record: కందుకూరు టీడీపీలో సిట్టింగ్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే
-
Shreyas Iyer: ఐర్లాండ్ చేతిలో ఓటమికి కారణం ఇదే.. నిజాన్ని అంగీకరించిన శ్రేయాస్ అయ్యర్..
-
Pulse Polio: 28న పల్స్ పోలియోకు తెలంగాణ రెడీ.!
-
India Lose: ప్రపంచ ఛాంపియన్ల పరువు ఐర్లాండ్ వీధుల్లో పారేశారు.. శ్రేయాస్ అయ్యర్పై ఆగ్రహం..
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!