Accident: నిర్మల్లో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా.. ఒకరు మృతి, ముగ్గురు సీరియస్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నిర్మల్ జిల్లాలోని సారంగాపూర్ మండలం మహబూబ్ ఘాట్ వద్ద ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్కు 50 మంది ప్రయాణికులతో వెళ్తున్న ముస్కాన్ ట్రావెల్స్ ప్రైవేటు బస్సు ఇవాళ (గురువారం) తెల్లవారు జామున బోల్తా పడింది. అందులో ప్రయాణిస్తున్న 25 మందికి గాయాలు కాగా ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్సల కోసం హైదరాబాద్ తరలిస్తుండగా అదిలాబాద్కు చెందిన ఫర్హాన అనే యువతి మరణించింది. మరొ ముగ్గురి పరిస్థితి సైతం సీరియస్ గానే ఉందని డాక్టర్లు సూచించారు.
Read Also: Viswambhara : ‘విశ్వంభర’లో మెగాస్టార్ పాత్ర ఎలా ఉంటుందంటే..?
Also Read
- AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
- boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
- Harish Rao: సమ్మక్క సాగర్ ప్రాజెక్టుపై కుట్ర జరుగుతోంది.. హరీశ్రావు సంచలన ఆరోపణలు
- Telangana Launches Dial 112: 100కు గుడ్బై! ఇక పోలీస్, అంబులెన్స్, ఫైర్.. అన్నింటికీ ఒకే నంబర్..
కాగా, ప్రయాణికులు మాట్లాడుతూ.. ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్కు వెళ్తున్న సమయంలో మహబూబ్ ఘాట్ దగ్గరకు రాగానే డ్రైవర్ ఓవర్ స్పీడ్ గా నడపడంతో బస్సు కంట్రోల్ తప్పి బోల్తా పడిందని పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో ఒకరు చనిపోగా, మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. మరి కొందరికి కాళ్లు విరిగితే, కొందరికి చేతులు, నడుము విరిగాయన్నారు. గాయపడ్డ ప్రయాణికులకు నిర్మల్ లోని ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు.
Read Also: Bus Accident: ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా.. ఇద్దరు చిన్నారులు దుర్మరణం
ఇక, హస్పటల్ లో ఒక డ్యూటీ డాక్టర్ తప్ప మరో వైద్యుడు లేరని, సూపరిండెంట్కు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడం లేదని ప్రయాణికులు వాపోయారు. జిల్లా మెడికల్ హస్పటల్ నిర్మల్ లో ఉండి ఏం లాభం.. ప్రమాదంలో చాలా మందికి తీవ్ర గాయాలు కావడంతో అత్యవసర వైద్య సేవల కోసం కనీసం చికిత్స అందించేందుకు డాక్టర్లు లేకపోవడం దారుణమని సదరు బస్సు ప్రయాణికులు మండిపడుతున్నారు. ఇక, ఈ ఘటనపై రూరల్ సిఐ శ్రీనివాస్ మాట్లాడుతూ.. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి బోర్లా పడిందని అందులో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు గాయాలయ్యాయని తెలిసిన వెంటనే వారిని ఆసుపత్రికి తరలించే చికిత్స అందిస్తున్నామని పేర్కొన్నారు.
తాజావార్తలు
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
Tejaswini Nandamuri : బాలయ్య కూతురిని డైరెక్ట్ చేయబోయే దర్శకురాలు ఎవరంటే?
-
Harish Rao: సమ్మక్క సాగర్ ప్రాజెక్టుపై కుట్ర జరుగుతోంది.. హరీశ్రావు సంచలన ఆరోపణలు
-
Karikala First Look: సందీప్ కిషన్ ‘కరికాల’ ఫస్ట్ లుక్ అదిరింది!.. ఇలాంటి అవతార్లో ఎప్పుడూ చూడలే..
ట్రెండింగ్
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్గా వీవీఎస్ లక్ష్మణ్?
-
Yamaha R15, MT-15 MotoGP ఎడిషన్ బైక్స్ మళ్లీ వచ్చేశాయి.. కొత్త కలర్ ఆప్షన్లతో FZ-S సిరీస్ కూడా అప్డేట్..!
-
కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!