Accident: నిర్మల్లో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా.. ఒకరు మృతి, ముగ్గురు సీరియస్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నిర్మల్ జిల్లాలోని సారంగాపూర్ మండలం మహబూబ్ ఘాట్ వద్ద ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్కు 50 మంది ప్రయాణికులతో వెళ్తున్న ముస్కాన్ ట్రావెల్స్ ప్రైవేటు బస్సు ఇవాళ (గురువారం) తెల్లవారు జామున బోల్తా పడింది. అందులో ప్రయాణిస్తున్న 25 మందికి గాయాలు కాగా ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్సల కోసం హైదరాబాద్ తరలిస్తుండగా అదిలాబాద్కు చెందిన ఫర్హాన అనే యువతి మరణించింది. మరొ ముగ్గురి పరిస్థితి సైతం సీరియస్ గానే ఉందని డాక్టర్లు సూచించారు.
Read Also: Viswambhara : ‘విశ్వంభర’లో మెగాస్టార్ పాత్ర ఎలా ఉంటుందంటే..?
Also Read
- Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. భుజంగరావుకు 14 రోజుల రిమాండ్
- రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!
- MP: ‘సారీ అమ్మా, నాన్న.. మళ్లీ పరీక్ష రాసే ధైర్యం లేదు’.. కన్నీరు పెట్టిస్తున్న నీట్ విద్యార్థిని సూసైడ్ నోట్
- SL vs WI: కెప్టెన్గా కుసాల్ మెండిస్ బోణి.. వెస్టిండీస్పై శ్రీలంక ఘన విజయం.!
కాగా, ప్రయాణికులు మాట్లాడుతూ.. ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్కు వెళ్తున్న సమయంలో మహబూబ్ ఘాట్ దగ్గరకు రాగానే డ్రైవర్ ఓవర్ స్పీడ్ గా నడపడంతో బస్సు కంట్రోల్ తప్పి బోల్తా పడిందని పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో ఒకరు చనిపోగా, మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. మరి కొందరికి కాళ్లు విరిగితే, కొందరికి చేతులు, నడుము విరిగాయన్నారు. గాయపడ్డ ప్రయాణికులకు నిర్మల్ లోని ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు.
Read Also: Bus Accident: ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా.. ఇద్దరు చిన్నారులు దుర్మరణం
ఇక, హస్పటల్ లో ఒక డ్యూటీ డాక్టర్ తప్ప మరో వైద్యుడు లేరని, సూపరిండెంట్కు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడం లేదని ప్రయాణికులు వాపోయారు. జిల్లా మెడికల్ హస్పటల్ నిర్మల్ లో ఉండి ఏం లాభం.. ప్రమాదంలో చాలా మందికి తీవ్ర గాయాలు కావడంతో అత్యవసర వైద్య సేవల కోసం కనీసం చికిత్స అందించేందుకు డాక్టర్లు లేకపోవడం దారుణమని సదరు బస్సు ప్రయాణికులు మండిపడుతున్నారు. ఇక, ఈ ఘటనపై రూరల్ సిఐ శ్రీనివాస్ మాట్లాడుతూ.. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి బోర్లా పడిందని అందులో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు గాయాలయ్యాయని తెలిసిన వెంటనే వారిని ఆసుపత్రికి తరలించే చికిత్స అందిస్తున్నామని పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. భుజంగరావుకు 14 రోజుల రిమాండ్
-
IRCTC: నకిలీ బుకింగ్లపై పట్టు బిగించిన ఐఆర్ సీటీసీ.. 3.03 కోట్ల అనుమానాస్పద ఐడీలు డీయాక్టివేట్
-
India T20 Captain: సూర్యకుమార్కు షాక్.. టీమిండియా కెప్టెన్గా శ్రేయాస్ అయ్యర్.. తెలుగు ఆటగాడు తిలక్ వర్మకు..!
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!
-
MP: ‘సారీ అమ్మా, నాన్న.. మళ్లీ పరీక్ష రాసే ధైర్యం లేదు’.. కన్నీరు పెట్టిస్తున్న నీట్ విద్యార్థిని సూసైడ్ నోట్
ట్రెండింగ్
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!
-
Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!
-
Jamun Benefits : బిర్యానీకి సూపర్ కాంబో.. నేరేడు పండ్ల రాయితా రుచి మామూలుగా ఉండదు..!
-
Fruit Storage Tips : కోసిన పండ్లు త్వరగా పాడవుతున్నాయా.? ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!