Prithvi Shaw: పృథ్వీ షా ఎవరో కూడా నాకు తెలియదు: సప్నా గిల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీమ్ఇండియా క్రికెటర్ పృథ్వీ షాపై జరిగిన దాడి కేసులో నిందితురాలు సప్నా గిల్ను కస్టడీకి ఇస్తూ ముంబై మెజిస్ట్రేట్ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే విచారణ సందర్భంగా యూట్యూబర్ అయిన సప్నా గిల్ తరఫున న్యాయవాది కోర్టులో పృథ్వీ షాకు సంబంధించిన పలు విషయాలను లేవనెత్తినట్లు మీడియా వర్గాలు తెలిపాయి. మద్యం తాగే అలవాటు ఉన్న షాను బీసీసీఐ గతంలో బ్యాన్ చేసిందని కోర్టుకు తెలిపారు. “కేసు పెట్టకుండా ఉండటానికి రూ.50 వేలు ఇవ్వాలని సప్నా గిల్ అస్సలు అనలేదు. దీనికి ఎలాంటి ఆధారం కూడా లేదు. సంఘటన జరిగిన 15 గంటల తర్వాత తన స్నేహితుడితో పృథ్వీ షా ఫిర్యాదు చేయించాడు. అప్పుడే ఎందుకు కంప్లైంట్ చేయలేదు?” అని సప్నా గిల్ లాయర్ వాదించారు.
Also Read: Virat Kohli: కోహ్లీ ఔటా! నాటౌటా?.. చెత్త అంపైరింగ్పై నెటిజన్ల ట్రోల్స్
Also Read
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
- Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
- Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
విచారణ సందర్భంగా సప్నా గిల్ కూడా కోర్టుకు విన్నవిస్తూ.. అసలు పృథ్వీ షా అంటే ఎవరో కూడా తనకు తెలియదని పేర్కొన్నట్లు సమాచారం. “నా స్నేహితుడు అతడిని సెల్ఫీ అడిగాడు. అప్పటికీ అతడొక క్రికెటర్ అని నాకు తెలియదు. మేం కేవలం ఇద్దరం మాత్రమే ఉన్నాం. పృథ్వీ మాత్రం ఎనిమిది మందితో ఉన్నాడు. అతడు భోజనం కోసం వచ్చాడని చెప్పడం.. మేం క్లబ్లో పార్టీ చేసుకోవడమంతా అబద్దం. అప్పుడు అతడు మద్యం తాగి ఉన్నాడు. పోలీసులు కూడా ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయాలని మమ్మల్ని అడిగారు” అని సప్నా కోర్టులో చెప్పినట్లు తెలుస్తోంది. వాదనలు విన్న మెజిస్ట్రేట్ నిందితురాలు సప్నా గిల్ను ఫిబ్రవరి 20వ తేదీ వరకు పోలీసు కస్టడీకి ఇస్తూ ఆదేశాలు జారీ చేశారు. విచారణ అనంతరం సప్నా న్యాయవాది విలేకర్లతో మాట్లాడుతూ.. పృథ్వీ షా చేసినవన్నీ తప్పుడు ఆరోపణలేనని, తమ వాదనను కోర్టులో వినిపించినట్లు తెలిపింది.
Also Read: Cheteshwar Pujara: వందో టెస్టులో పుజారా చెత్త రికార్డు.. రెండో బ్యాటర్గా!
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!