PM Modi: తలపాగాలో మెరిసిన ప్రధాని మోడీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
75వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తలపాగాలో మెరిశారు. ప్రధాని బాధ్యతలు స్వీకరించిన తర్వాత నుంచి రిపబ్లిక్ డే, ఇండిపెండెన్స్ డే దినోత్సవాల్లో వేడుకల్లో తలపాగా కట్టుకునే సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. 2015 జనవరి 26 నుంచి ప్రతి సంవత్సంవరం ఒక్కో ప్రత్యేక కలిగిన తలపాగా ఆయన ధరిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. అయితే, ఈ సారి ప్రధాని మోడీ కాషాయరంగు ‘బంధాని’ తలపాగాను ధరించారు.
Read Also: Minister Kottu Satyanarayana: పొత్తులో పవన్, చంద్రబాబు చివరివరకు ఉంటారనేది అనుమానమే!
Also Read
- Mehbooba Mufti: 'దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం'.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
- Story Board : ఎల్నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
- Salman Khan: విద్యార్థులు ఇంటికెళ్లిపోండి.. సోనమ్కు ఇంటి భోజనం పంపిస్తా.. సల్మాన్ ఖాన్ ఆసక్తికర ట్వీట్
- Kusha Missile: కుశ మిస్సైల్ సక్సెస్.. భారత అమ్ములపొదిలో మరో అస్త్రం..
ఇక, 2015లో ప్రధాని నరేంద్ర మోడీ వివిధ రంగుల్లో ఉన్న తలపాగాను ధరించారు. ముదురు ఆకుపచ్చ, కాషాయం, గులాబీ రంగుల్లో ఉండగా.. మధ్యలో తెల్లని చుక్కలు కనిస్తున్నాయి. తలపాగాతో నల్లటి సూట్ను ప్రధాని ధరించారు. అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో కలిసి 66వ గణతంత్ర వేడుకల్లో పాల్గొన్నారు.
అలాగే, 2016లో ప్రధాని మోడీ ఎరుపు చారలతో పసుపు రంగులోని తలపాగాను ధరించారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ డార్క్ క్రీమ్ కలర్ ఫుల్ స్లీవ్ బంద్గాలా సూట్ను వేసుకున్నారు. దీంతో పాటు 2017లో రిపబ్లిక్ వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోడీ గులాబీ రంగు తలపాగా వేసుకున్నారు. ఈ సఫాపై వెండి రంగు క్రాస్ లైన్లు కనిపిస్తాయి. తెల్లటి కుర్తా, దానిపై తెల్లటి చుక్కలు ఉన్న నల్లటి జాకెట్పై మోడీ మెరిసిపోయారు. అలాగే, 2018లో ప్రధాని మోడీ మల్టికలర్లోని తలపాగాను వేసుకున్నారు. సఫాతో ప్రధాని మోడీ క్రీమ్ కుర్తా, నలుపు రంగు జాకెట్ వేసుకొచ్చారు.
Read Also: Jana Reddy: రేవంత్ నెలరోజుల పాలన పై జానారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
అలాగే, 2019లో ప్రధాని మోడీ ఎర్రకోట జెండా ఎగురవేసి ప్రసంగించారు.. ఆ టైంలో ఆయన బహులవర్ణాల్లోని తలపాగా ధరించడం మనం చూడొచ్చు. ఎరుపు, పసుపు రంగులో ఉన్న తలపాగా వేసుకున్నారు. 2020లో ప్రధానమంత్రి కాషాయ రంగు ‘బంధేజ్’ తలపాగాను ధరించారు. సాంప్రదాయ కుర్తా పైజామా, దానిపై జాకెట్ వేసుకున్నాడు. ఇక, 2021లో రిపబ్లిక్ వేడుకల్లో మోడీ ప్రత్యేక తలపాగాలో కనబడుతున్నారు. ఎరుపు రంగు ‘హలారీ తలపాగా’ను వేసుకున్నారు. ఈ తలపాగాను జామ్నగర్ రాజకుటుంబం ప్రధాని మోడీకి బహుమతిగా ఇచ్చింది. 2022 గణతంత్ర వేడుకల్లో ప్రధాని తలపాగాకు బదులుగా టోపీ ధరించాడు. ఉత్తరాఖండ్కు చెందిన బ్రహ్మకమల్ క్యాప్ వేసుకున్నాడు. 2023లో ప్రధానమంత్రి రంగురంగుల రాజస్థానీ తలపాగా ధరించి అలరించాడు. తెల్లటి కుర్తా, ప్యాంట్తో నల్లటి కోటు ధరించిన ప్రధాని మోడీ తెల్లటి స్టోల్ ధరించారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy : విద్యార్థుల యూనిఫాంల నాణ్యతపై రాజీపడేది లేదు
-
OTR : విశ్వేశ్వర్ రెడ్డి ఒక్క మాటతో వైసీపీ ఇరుక్కుందా?
-
Covid 19: కోవిడ్పై కేంద్రం క్లారిటీ.. భయపడాల్సిన అవసరం లేదట..!
-
Mehbooba Mufti: ‘దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం’.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
-
Story Board : ఎల్నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?