Minister Kottu Satyanarayana: పొత్తులో పవన్, చంద్రబాబు చివరివరకు ఉంటారనేది అనుమానమే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అధర్మాన్ని ఆశ్రయించారని మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. పొత్తులో పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు చివరివరకు ఉంటారనేది అనుమానమే అని పేర్కొన్నారు. పొత్తులు చివరివరకు ఉంటాయో? లేదో? చూడాల్సిందే అని ఆయన ఎద్దేవా చేశారు. చంద్రబాబు తాను చేసిన మోసాలు చూసి ఓటు వేయమని అడుగుతారా?, పవన్ ప్రజలను ఏమని ఓటు అడుగుతారు? అని మంత్రి కొట్టు విమర్శించారు. తండ్రి ఆశయాలను గాలికి వదిలేసి చంద్రబాబు స్క్రిప్ట్ను ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల చదువుతున్నారని మండిపడ్డారు.
పశ్చిమ గోదావరిలో మంత్రి కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ… ‘పవన్ కళ్యాణ్ అధర్మాన్ని ఆశ్రయించారు. పొత్తులో పవన్, చంద్రబాబు చివరివరకు ఉంటారనేది అనుమానమే. బాబు రెండు సీట్లు ప్రకటించారు కాబట్టి నేను రెండు సీట్లు ప్రకటించానన్నారు. ఇద్దరు పొత్తులో ఉన్నా.. ఎవరి దారి వారిదే. విహంగ వీక్షణ అంటే ప్రజలను గాలికి వదిలేస్తారా?. పొత్తులు చివరివరకు ఉంటాయో? లేదో? అనేది చూడాల్సిందే. పద్దతి ప్రకారం సీఎం వైఎస్ జగన్ ముందుకు వెళ్తున్నారు. మీ కుటుంబాలకు మేలు జరిగితే.. నాకు ఓటు వేయమని సీఎం అడుగుతున్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకున్నవారు దర్మపక్షం ఉన్నట్టు’ అని అన్నారు.
Also Read
- PhonePe: ఇంటర్నెట్ లేకున్నా UPI సేవలు.. కొత్త సర్వీస్ ప్రారంభించిన ఫోన్పే..
- Kalabhairava : కావ్య కల్యాణ్రామ్తో రిలేషన్ అనౌన్స్ చేసిన కాలభైరవ
- CM Chandrababu: ‘పునాది వేశా.. ప్రాజెక్ట్ పూర్తి చేశా’.. వెలిగొండ ప్రాజెక్టును ప్రారంభించిన సీఎం చంద్రబాబు..
- Abhishek Sharma: కాటేరమ్మ కొడుకు వీరవిహారం.. బాదుడే బాదుడే.. కేవలం 26 బంతుల్లోనే..
Also Read: Australian Open 2024: ఆస్ట్రేలియన్ ఓపెన్లో సంచలనం.. ప్రపంచ నంబర్వన్ ‘జకోవిచ్’ ఔట్!
‘చంద్రబాబు నాయుడు నేను చేసిన మోసాలు చూసి ఓటు వేయమని అడుగుతారా?. పవన్ కళ్యాణ్ ప్రజలను ఏమని ఓటు అడుగుతారు. గెలుపు ఎప్పుడు ధర్మం పక్షాన ఉంటుంది. వైఎస్ షర్మిలకు ఇంకా రాజకీయ పరిణతి లేదు. చంద్రబాబు ఉచ్చులో ఆమె పడిపోయారు. తండ్రి ఆశయాలను గాలికి వదిలేసి.. చంద్రబాబు స్క్రిప్ట్ షర్మిల చదువుతున్నారు. వైఎస్ రక్తం పంచుకుపుట్టిన షర్మిల లేనిపోని అబాండాలు సీఎం జగన్పై వేస్తున్నారు. రాష్ట్రానికి అన్ని విధాలుగా ద్రోహం చేసిన కాంగ్రెస్ పార్టీతో షర్మిల చేతులు కలిపారు’ అని మంత్రి కొట్టు సత్యనారాయణ పేర్కొన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పోటీ చేసే రెండు స్థానాలను ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు. టీడీపీ రెండు సీట్లు ప్రకటించినందున తానూ 2 స్థానాలను ప్రకటిస్తున్నట్లు పవన్ చెప్పారు. ఈ నేపథ్యంలోనే మంత్రి కొట్టు సెటైర్లు వేశారు.
తాజావార్తలు
-
PhonePe: ఇంటర్నెట్ లేకున్నా UPI సేవలు.. కొత్త సర్వీస్ ప్రారంభించిన ఫోన్పే..
-
Kalabhairava : కావ్య కల్యాణ్రామ్తో రిలేషన్ అనౌన్స్ చేసిన కాలభైరవ
-
Irumudi: రవితేజ బాక్సాఫీస్ ర్యాంపేజ్.. 10 రోజుల్లోనే 180 కోట్లు కొల్లగొట్టిన ‘ఇరుముడి’!
-
Dil Raju: టాలీవుడ్కి కొండంత ధైర్యాన్నిచ్చిన ‘ఇరుముడి’.. థియేటర్ల జాతరపై దిల్ రాజు సంచలన వ్యాఖ్యలు
-
Shalini Pandey : అర్ధనగ్న వీడియోపై షాలిని పాండే క్లారిటీ తీవ్ర ఆగ్రహం
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!