Minister Kottu Satyanarayana: పొత్తులో పవన్, చంద్రబాబు చివరివరకు ఉంటారనేది అనుమానమే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అధర్మాన్ని ఆశ్రయించారని మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. పొత్తులో పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు చివరివరకు ఉంటారనేది అనుమానమే అని పేర్కొన్నారు. పొత్తులు చివరివరకు ఉంటాయో? లేదో? చూడాల్సిందే అని ఆయన ఎద్దేవా చేశారు. చంద్రబాబు తాను చేసిన మోసాలు చూసి ఓటు వేయమని అడుగుతారా?, పవన్ ప్రజలను ఏమని ఓటు అడుగుతారు? అని మంత్రి కొట్టు విమర్శించారు. తండ్రి ఆశయాలను గాలికి వదిలేసి చంద్రబాబు స్క్రిప్ట్ను ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల చదువుతున్నారని మండిపడ్డారు.
పశ్చిమ గోదావరిలో మంత్రి కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ… ‘పవన్ కళ్యాణ్ అధర్మాన్ని ఆశ్రయించారు. పొత్తులో పవన్, చంద్రబాబు చివరివరకు ఉంటారనేది అనుమానమే. బాబు రెండు సీట్లు ప్రకటించారు కాబట్టి నేను రెండు సీట్లు ప్రకటించానన్నారు. ఇద్దరు పొత్తులో ఉన్నా.. ఎవరి దారి వారిదే. విహంగ వీక్షణ అంటే ప్రజలను గాలికి వదిలేస్తారా?. పొత్తులు చివరివరకు ఉంటాయో? లేదో? అనేది చూడాల్సిందే. పద్దతి ప్రకారం సీఎం వైఎస్ జగన్ ముందుకు వెళ్తున్నారు. మీ కుటుంబాలకు మేలు జరిగితే.. నాకు ఓటు వేయమని సీఎం అడుగుతున్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకున్నవారు దర్మపక్షం ఉన్నట్టు’ అని అన్నారు.
Also Read
- Vaibhav Sooryavanshi: బుడ్డోడికి మళ్లీ నిరాశే.. ఇంగ్లండ్తో తొలి టీ20లోనూ 'నో ఛాన్స్'.!
- Pawan Kalyan: సోషల్ మీడియా దుర్వినియోగంపై ఉక్కుపాదం మోపుతాం.. ‘ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్’ పేరుతో దూషణలు ఇక కుదరవు.!
- US: అమెరికాలో విషాదం.. ఆకస్మిక వరదల్లో ఏపీ యువకుడు మృతి
- Ishan Kishan: ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్లో పేలిన పాకెట్ డైనమెట్.. నెం.1 బ్యాటర్గా ఇషాన్ కిషన్.!
Also Read: Australian Open 2024: ఆస్ట్రేలియన్ ఓపెన్లో సంచలనం.. ప్రపంచ నంబర్వన్ ‘జకోవిచ్’ ఔట్!
‘చంద్రబాబు నాయుడు నేను చేసిన మోసాలు చూసి ఓటు వేయమని అడుగుతారా?. పవన్ కళ్యాణ్ ప్రజలను ఏమని ఓటు అడుగుతారు. గెలుపు ఎప్పుడు ధర్మం పక్షాన ఉంటుంది. వైఎస్ షర్మిలకు ఇంకా రాజకీయ పరిణతి లేదు. చంద్రబాబు ఉచ్చులో ఆమె పడిపోయారు. తండ్రి ఆశయాలను గాలికి వదిలేసి.. చంద్రబాబు స్క్రిప్ట్ షర్మిల చదువుతున్నారు. వైఎస్ రక్తం పంచుకుపుట్టిన షర్మిల లేనిపోని అబాండాలు సీఎం జగన్పై వేస్తున్నారు. రాష్ట్రానికి అన్ని విధాలుగా ద్రోహం చేసిన కాంగ్రెస్ పార్టీతో షర్మిల చేతులు కలిపారు’ అని మంత్రి కొట్టు సత్యనారాయణ పేర్కొన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పోటీ చేసే రెండు స్థానాలను ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు. టీడీపీ రెండు సీట్లు ప్రకటించినందున తానూ 2 స్థానాలను ప్రకటిస్తున్నట్లు పవన్ చెప్పారు. ఈ నేపథ్యంలోనే మంత్రి కొట్టు సెటైర్లు వేశారు.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: బుడ్డోడికి మళ్లీ నిరాశే.. ఇంగ్లండ్తో తొలి టీ20లోనూ ‘నో ఛాన్స్’.!
-
ENG vs IND 1st T20: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్! ప్లేయింగ్ XI లో ఎవరెవరంటే?
-
Kayadu Lohar: అందుకే హిట్లున్నా లేకున్నా వరుస ఆఫర్లు!
-
Pawan Kalyan: సోషల్ మీడియా దుర్వినియోగంపై ఉక్కుపాదం మోపుతాం.. ‘ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్’ పేరుతో దూషణలు ఇక కుదరవు.!
-
US: అమెరికాలో విషాదం.. ఆకస్మిక వరదల్లో ఏపీ యువకుడు మృతి
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!