Minister Kottu Satyanarayana: పొత్తులో పవన్, చంద్రబాబు చివరివరకు ఉంటారనేది అనుమానమే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అధర్మాన్ని ఆశ్రయించారని మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. పొత్తులో పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు చివరివరకు ఉంటారనేది అనుమానమే అని పేర్కొన్నారు. పొత్తులు చివరివరకు ఉంటాయో? లేదో? చూడాల్సిందే అని ఆయన ఎద్దేవా చేశారు. చంద్రబాబు తాను చేసిన మోసాలు చూసి ఓటు వేయమని అడుగుతారా?, పవన్ ప్రజలను ఏమని ఓటు అడుగుతారు? అని మంత్రి కొట్టు విమర్శించారు. తండ్రి ఆశయాలను గాలికి వదిలేసి చంద్రబాబు స్క్రిప్ట్ను ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల చదువుతున్నారని మండిపడ్డారు.
పశ్చిమ గోదావరిలో మంత్రి కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ… ‘పవన్ కళ్యాణ్ అధర్మాన్ని ఆశ్రయించారు. పొత్తులో పవన్, చంద్రబాబు చివరివరకు ఉంటారనేది అనుమానమే. బాబు రెండు సీట్లు ప్రకటించారు కాబట్టి నేను రెండు సీట్లు ప్రకటించానన్నారు. ఇద్దరు పొత్తులో ఉన్నా.. ఎవరి దారి వారిదే. విహంగ వీక్షణ అంటే ప్రజలను గాలికి వదిలేస్తారా?. పొత్తులు చివరివరకు ఉంటాయో? లేదో? అనేది చూడాల్సిందే. పద్దతి ప్రకారం సీఎం వైఎస్ జగన్ ముందుకు వెళ్తున్నారు. మీ కుటుంబాలకు మేలు జరిగితే.. నాకు ఓటు వేయమని సీఎం అడుగుతున్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకున్నవారు దర్మపక్షం ఉన్నట్టు’ అని అన్నారు.
Also Read
- IPL Team: కొత్త ఐపీఎల్ జట్టులో దిగ్గజాలు.. CSK, MI, RCB తట్టుకునేనా..?
- GPS, 5ATM వాటర్ రెసిస్టెన్స్, 110+ పైగా స్పోర్ట్స్ మోడ్లతో Realme Watch S5 ఎంట్రీ.!
- Twisha Sharma: ట్విషా శర్మ మరణానికి ముందు ఎక్కడకెళ్లిందంటే.. వెలుగులోకి వీడియో
- SRH vs RCB: 300+ లోడింగ్.. మొదట బ్యాటింగ్ చేయనున్న కాటేరమ్మ కొడుకులు.!
Also Read: Australian Open 2024: ఆస్ట్రేలియన్ ఓపెన్లో సంచలనం.. ప్రపంచ నంబర్వన్ ‘జకోవిచ్’ ఔట్!
‘చంద్రబాబు నాయుడు నేను చేసిన మోసాలు చూసి ఓటు వేయమని అడుగుతారా?. పవన్ కళ్యాణ్ ప్రజలను ఏమని ఓటు అడుగుతారు. గెలుపు ఎప్పుడు ధర్మం పక్షాన ఉంటుంది. వైఎస్ షర్మిలకు ఇంకా రాజకీయ పరిణతి లేదు. చంద్రబాబు ఉచ్చులో ఆమె పడిపోయారు. తండ్రి ఆశయాలను గాలికి వదిలేసి.. చంద్రబాబు స్క్రిప్ట్ షర్మిల చదువుతున్నారు. వైఎస్ రక్తం పంచుకుపుట్టిన షర్మిల లేనిపోని అబాండాలు సీఎం జగన్పై వేస్తున్నారు. రాష్ట్రానికి అన్ని విధాలుగా ద్రోహం చేసిన కాంగ్రెస్ పార్టీతో షర్మిల చేతులు కలిపారు’ అని మంత్రి కొట్టు సత్యనారాయణ పేర్కొన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పోటీ చేసే రెండు స్థానాలను ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు. టీడీపీ రెండు సీట్లు ప్రకటించినందున తానూ 2 స్థానాలను ప్రకటిస్తున్నట్లు పవన్ చెప్పారు. ఈ నేపథ్యంలోనే మంత్రి కొట్టు సెటైర్లు వేశారు.
తాజావార్తలు
-
IPL Team: కొత్త ఐపీఎల్ జట్టులో దిగ్గజాలు.. CSK, MI, RCB తట్టుకునేనా..?
-
GPS, 5ATM వాటర్ రెసిస్టెన్స్, 110+ పైగా స్పోర్ట్స్ మోడ్లతో Realme Watch S5 ఎంట్రీ.!
-
Natural Hair Tonic : పలుచటి జుట్టుకు గుడ్బై.. ఇంట్లోనే తయారయ్యే మ్యాజికల్ హెయిర్ టానిక్.!
-
Cabbage Egg Sandwich : కొరియన్ స్ట్రీట్ స్టైల్ ‘క్యాబేజీ ఎగ్ శాండ్విచ్’.. 5 నిమిషాల్లో పిల్లల లంచ్ బాక్స్ కోసం సూపర్ రెసిపీ.!
-
Twisha Sharma: ట్విషా శర్మ మరణానికి ముందు ఎక్కడకెళ్లిందంటే.. వెలుగులోకి వీడియో
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!