PM Modi: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అన్ని పార్టీలు జోరుగా ప్రచారం చేస్తున్నాయి. బీజేపీ కూడా తమ అగ్రనేతలను ఆహ్వానిస్తూ ప్రచార హోరును పెంచింది. మంగళవారం హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో బీజేపీ బీసీ ఆత్మగౌరవ సభకు హాజరైన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా.. ఈ నెల 11న రాష్ట్రానికి మరోసారి ప్రధాని నరేంద్ర మోడీ రానున్నారు. పరేడ్ గ్రౌండ్ లో జరిగే బహిరంగ సభలో ప్రధాన మంత్రి పాల్గొననున్నారు.
Also Read: Parliament’s Winter session: డిసెంబర్ రెండో వారం నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు..?
సాయంత్రం 4 గంటల 45 నిమిషాలకు బేగంపేట విమానాశ్రయానికి మోడీ రానున్నారు. 5 గంటల నుండి 5.40 వరకు పరేడ్ గ్రౌండ్ బహిరంగ సభలో నరేంద్రమోడీ పాల్గొననున్నారు. అనంతరం6 గంటలకు బేగంపేట నుంచి తిరిగి వెళ్లనున్నారు. మాదిగ ఉప కులాల(మాదిగ విశ్వరూప బహిరంగ సభ) బహిరంగ సభలో… ఎస్సీ కులాల వర్గీకరణపై మోడీ ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు బీజేపీలోని పలు వర్గాలు తెలిపాయి. ప్రధాని మోడీ పర్యటన నేపథ్యంలో బీజేపీ వర్గాలు ఏర్పాట్లు చేస్తున్నాయి. ప్రధాని రాక నేపథ్యంలో పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు.